- జిల్లాలో 39 ఏకగ్రీవంమొదటి విడతలో 13.. రెండో విడతలో 15
- మూడో విడతలో 11..
- బరిలో 2,070 సర్పంచ్, 6,210 వార్డు స్థానాల అభ్యర్థులు
నవతెలంగాణ-సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 254 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో చందుర్తి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, బోయినిపల్లి మండలాల్లోని గ్రామాలకు ఈ నెల 21న ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో ఈ నెల 25న, మూడో విడతలో తంగళ్లపల్లి, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో ఈ నెల 31న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో 80 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 698 నామినేషన్లు రాగా, 722 వార్డు స్థానాలకు 2,055 వచ్చాయి. అలాగే మూడో విడతలో 84 సర్పంచ్ స్థానాలకు 693, 744 వార్డు స్థానాలకు 2,055 నామినేషన్లు వచ్చాయి. మూడో విడతలో 90 సర్పంచ్ స్థానాలకు 679, 764 వార్డు స్థానాలకు 2,100 నామినేషన్లు వచ్చాయి.
జిల్లాలో 39 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం..
జిల్లాలో మొదటి విడతలో 13 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో చందుర్తి మండలంలో దేవునితండా, కొత్తపేట, కట్టలింగంపేట, రుద్రంగి మండలంలో అడ్డాబోరుతండా, మీరానితండా, చింతామణితండా, బడితండా, రూప్లానాయక్ తండా, ఖిమ్యానాయక్ తండా, బోయినిపల్లి మండలంలో నర్సింగాపూర్, కోరెం, వేములవాడ రూరల్ మండలంలో తుర్కాసిపల్లె గ్రామపంచాయతీలు ఉన్నాయి. రెండో విడతలో 15 ఏకగ్రీవం కాగా గంభీరావుపేట మండలంలో రాజుపేట, లక్ష్మిపూర్, పొన్నాలపల్లె, ఎల్లారెడ్డిపేట మండలంలో దేవునితండా, బాకూర్పల్లి తండా, బుగ్గరాజేశ్వర తండా, అగ్రహారం, హరిదాస్నగర్, గుంటపల్లితండా, వీర్నపల్లి మండలంలో బాబాయితండా, భూక్యతండా, మద్దిమల్ల, లాల్సింగ్తండా, శాంతినగర్, ఎర్రతండా, ముస్తాబాద్లో గన్నేవానిపల్లె గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడో విడతలో 11 ఏకగ్రీవంకాగా కోనరావుపేట మండలంలో అజ్మీరాతండా, ఊరితండా, భూక్యరెడ్డితండా, కమ్మరిపేట, గోవిందరావుపేట, ఇల్లంతకుంట రామోజీపేట, కిష్టారావుపల్లె, సోమారంపేట, గూడుపుపల్లె, రంగంపేట, చిక్కడోనిపల్లె గ్రామపంచాయతీలు ఉన్నాయి.
ఏకగ్రీవాల వైపు కొత్తపంచాయతీలు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన గ్రామపంచాయతీల్లో భాగంగా జిల్లాలో 53 కొత్తగా ఏర్పడ్డాయి. గ్రామస్తులు గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఏకగ్రీవమైతే ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షలు, ఎమ్మెల్యే కోటా నుంచి మరో రూ. 15 లక్షలు మొత్తం రూ. 25 లక్షలు గ్రామపంచాయతీకి రానున్నాయి. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి మాట్లాడుకుని గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం కోసం తీర్మాణాలు చేస్తున్నారు.
Authorization