- సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మూషం రమేశ్
- పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఎదుట గుమాస్తాల ధర్నా
నవతెలంగాణ-సిరిసిల్ల
వస్త్ర పరిశ్రమ యాజమానుల వద్ద పని చేస్తున్న గుమాస్తాలకు వెంటనే వేతనాలు పెంచాలని సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి, వస్త్ర పరిశ్రమ గుమస్తా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మూషం రమేష్ అన్నారు. శనివారం సీఐట ీయూ ఆధ్వర్యంలో వస్త్ర పరిశ్రమ గుమాస్తా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం వరకు గుమాస్తాల ర్యాలీ నిర్వహించి సంఘం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అధ్యక్షుడు మూషం రమేష్ మాట్లాడు తూ వస్త్ర పరిశ్రమలో చాలా సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో గుమాస్తాలుగా పనిచేస్తున్నారన్నారు. వారికి ఇస్తున్న వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఈ నెల 5న వినతిపత్రం అందజేశామని తెలిపారు. కానీ ఇప్పటివరకు యాజమానుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థి తుల్లో సమ్మెకు దిగామన్నారు. ఇప్పటికైనా యాజ మానులు వెంటనే స్పందించి గుమాస్తాలకు కనీస వేతనం రూ.18వేలా500 వేతనంతోపాటు సంవ త్సరానికి నెల జీతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతోపాటు 8 గంటల పని విధానం అమలు చేయాలని, ఆది వారం సెలవు ఇవ్వాలని కోరారు. అనంతరం వస్త్ర పరిశ్రమ నాయకులకు వినతిపత్రం అంద జేశారు. వస్త్ర పరిశ్రమ గుమాస్తా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొండ నాగరాజు, ప్రధాన కార్యదర్శి భైరి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అడిగొప్పుల అశోక్, కట్టెకోల మహేష్, బూర నరేష్, సహాయ కార్యదర్శులు భైరి వేణు, పోరండ్ల గంగాధర్, ఊరగొండ కరుణాకర్, నాయకులు ఒగ్గు గణేష్, అన్నల్దాస్ గణేష్లతో పాటు సుమారు 300 మంది గుమాస్తాలు పాల్గొన్నారు.
Authorization