- తమ గ్రామం వరకూ బస్సును పొడగించాలి
- రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన మహిళా సర్పంచ్
నవతెలంగాణ-శంకరపట్నం
విద్యార్థుల కోసం రవాణా సౌకర్యం కల్పించి, ఆర్టీసీ బస్సును పొడగించాలని మహిళా సర్పంచ్ రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. అర్కండ్ల గ్రామానికి చెందిన సర్పంచ్ చెర్ల అనిత శ్రీనివాస్ తమ గ్రామానికి బస్సు కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలంలోని ఎరడపల్లిలో గురువారం రోడ్డుపై బైఠాయించి విద్యార్థులతో కలిసి బస్సు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్కండ్ల గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదువుతున్నారన్నారు. కాగా, గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు సరిగా స్కూల్ వెళ్లటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రవాణా సౌకర్యం కల్పించాలని, మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు విన్నవించినా హుజూరాబాద్ టీఎస్ ఆర్టీసీ మేనేజర్కు వినతి పత్రం అందజేసిన ఇప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామం వరకూ ఆర్టీసీ బస్సును పొడగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
Authorization