నవతెలంగాణ-ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్, బాకూర్పల్లి తండాల్లో గురువారం పశువులకు మండల పశువైద్య సిబ్బంది గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా సిబ్బంది రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారిణి రేణుక, ఎంపీపీ పిల్లి రేణుక-కిషన్, తిమ్మాపూర్ గ్రామసర్పంచ్ పడిగెల రవి, బాకూర్పల్లి తండా సర్పంచ్ మంజుల, తిమ్మాపూర్ ఎంపీటీసీ వరద బాబు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ముస్తాబాద్ : మండలంలోని మోహినికుంట గ్రామంలో పశువైద్యాధికారిని జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల విజయ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గోపాల్రావు, రైతులు పాల్గొన్నారు. Q