నవతెలంగాణ-సిరిసిల్ల
రోడ్డు భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సాధారణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్, హాట్ స్పాట్స్ గుర్తించి, అక్కడ ప్రమాదాలు జరగడానికి కారణాలను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు, ప్రమాద జరుగు స్థలం, సూచికలు బోర్డ్లు, డివైడర్లు, రోడ్డు మధ్యలో గుంతలు, ప్రమాదకరమైన మూలమలువుల వద్ద బోర్డులు, బ్లింకర్లు, కోన్లు, స్టడ్లు లాంటివి సంబంధిత శాఖ వారి సమన్వయంతో ఏర్పాటు చేయాలన్నారు. క్రైం కంప్లైంట్ సెల్ ఫిర్యాదుల పట్ల విచారణ వేగవంతం చేసి బాధితులకి న్యాయం చేకూర్చాలన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. గత నెలలో జరిగిన గ్రేవ్, నాన్ గ్రేవ్, ట్రాఫిక్ సంబందిత సమస్యలు, మహిళ సంబంధిత నేరాలు తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పోలీసుస్టేషన్ రికార్డులను, పరిసరాలను, శభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ నియమాలు పాటిస్తున్నారో లేదో పోలీస్స్టేషన్పై ఆకస్మిత తనిఖీలు చేస్తూ సందర్శిస్తానని తెలిపారు. డయల్ 100 కాల్స్ పట్ల సత్వర స్పందన ఇవ్వాలని, సాంకేతికతను ఉపయోగిస్తూ సంఘటన స్థలానికి వీలైనంత త్వరగా చేరుకోవాలన్నారు. తరచుగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తూ ప్రజల భద్రత పట్ల భరోసా కల్పించాలని అన్నారు.
కీ పెర్ఫార్మన్స్ ఇండికేట్ అవార్డ్లు
గత నెలలో విధుల్లో ప్రతిభ చూపిన జిల్లా పోలీసు సిబ్బందిని ఎస్పీ రాహుల్హెగ్డే అవార్డులతో సత్కరించింది. తంగళ్లపల్లి ఎస్ఐతో పాటు8 మంది కానిస్టేబుళ్లు ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజలకు అమూల్యమైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో సీఐలు మోగిలి, శ్రీనివాస్, అనిల్ కుమార్, రవీందర్, వెంకటస్వామి, రఘుచందర్, వెంకటనర్సయ్య, రజనీకాంత్, సుబ్రహ్మణ్యం నాయుడు పాల్గొన్నారు.
'
Authorization