- కలెక్టరేటు ఏవోకు వినతిపత్రం ఇచ్చిన మహిళలు
జగిత్యాల టౌన్ : మహిళా సంఘాల సభ్యులకు లింకేజీ ఇప్పించి వేల రూపాయల కమీషన్లను గుంజుతున్నారంటూ వీరిని తొలగించాలని పొలాసకు చెందిన మహిళా సంఘ సభ్యులు గురువారం జగిత్యాల కలెక్టరేటు ఎదుట రోడ్డుపై బైటాయిం చారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని తెలుసు కొన్న టౌన్ సీఐ ప్రకాశ్ సంఘటనా స్థలికి వెళ్లి మహిళలను కలెక్టరేట్ ఏవో వద్దకు తీసుకెళ్లగా మహిళలు ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు మాట్లా డుతూ గౌతమి, మంజుల అనే ఇద్దరు మహిళా సంఘాలపై సీఎలుగా వ్యవహరి స్తున్నారని, వీరు పొదుపు సంఘాల మహిళల గ్రూపులకు వచ్చే రుణాలను ఇప్పిస్తూ ఓక్కో గ్రూపుపై రెండు, మూడు వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి వద్ద దాదాపు 22 లక్షల 80 వేల రూపాయల వరకు ఉన్నాయని, వీటి లెక్కలు అడిగితే చెప్పడం లేదని తెలిపారు. 82 మంది పొదుపు సంఘాల మహిళ లు ఉన్నారని, వీరిందరి నుంచి సగటున 20 లక్షల వరకు వసూ లు చేశారని తెలిపారు. వీరిని తప్పుకొమ్మని కోరినా పోవడంలేదని తట్టుకోలేకనే వారం రోజులుగా నిరసన చేపడు తున్నామన్నారు. వీరి వినతిపత్రం ఏవోకు ఇస్తున్న సందర్భంలోనే అక్కడికి జగి త్యాల ఆర్డీవో నరేందర్ వచ్చారు. దీనిపై స్టేట్మెంట్ రికార్డు చే యాలని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. దీంతో శాంతించిన మహిళలు వెనుదిరి గారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్, సులోచన, మల్లన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Authorization