తంగళ్లపల్లి : వివాహేత సంబంధం పెట్టుకున్న ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దాడి చేసి ట్రాక్టర్కు కట్టేసిన ఘటన సిరిసిల్ల మున్సిపల్లోని చిన్నబోనాల లో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల అర్బన్ మండలమైన చిన్నబోనాల గ్రామానికి చెందిన పడిగే నారాయణ వ్యవసాయం చేయడంతోపాటు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పొన్నం స్వప్న అనే మహిళతో నారాయణ వివాహేత సంబంధం పెట్టుకుని ఎనిమిది నెలల క్రితం ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. 20 రోజుల క్రితం నారాయణ ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయంపై కుటుంబసభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్వప్నను మందలించారు. తిరిగి వెళ్లే క్రమంలో నారాయణ మళ్లీ స్వప్నను తీసుకుని వెళ్లి సిరిసిల్లలో అద్దె రూం తీసుకుని ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు బుధవారం నారాయణను ఇంటికి తీసుకొచ్చారు. స్వప్పను పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు ఆమెను మందలించి పంపించారు. గురువారం స్వప్న నారాయణ ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడుతుండగా నారాయణ భార్య గమనించి స్వప్పపై దాడి చేసింది. పారిపోకుండా స్వప్పను ట్రాక్టర్కు కట్టివేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని స్వప్పను, నారాయణను పోలీస్స్టేషన్క తరలిస్తుండగా గ్రామస్తులకు అడ్డుకున్నారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కుమారుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టణ సీఐ శ్రీనివాస్ చౌదరి అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోలీసులు స్వప్నను, నారాయణను పోలీస్స్టేషన్కు తరలించారు.
Authorization