నవతెలంగాణ-తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గల మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 10 ట్రాక్టర్లను పట్టుకున్నట్టు ఎల్ ఎండీ ఎస్ ఐ నరేష్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీటిలో ఐదు రామకృష్ణకాలనీ గ్రామానికి చెందినవి కాగా మరో ఐదు నుస్తులాపూర్కు చెందినవి ఉన్నట్టు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుకున్న ట్రాక్టర్లను మైనింగ్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.