- 30 రోజుల ప్రణాళిక పనులపై ఆరా - బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధంగా ఉండాలి నవతెలంగాణ-రుద్రంగి రుద్రంగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం మండల అధికారులతో ఎంపీడీఓ శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్యం, హరితహారం పనుల అమలు చేస్తున్న విధానాలను వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ కోసం అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అనూష, ఆర్ఐ సునీత, మిషన్ భగీరథ ఏడబ్ల్యూ ఈఓ సుస్మిత, ఐకేపీ, ఉపాధి హామీ, పశు వైద్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.