- మానేరు నదిలో ఇసుక అక్రమదారుల పాగ
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాకర్స్
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-సిరిసిల్ల టౌన్
మానేరు నది నేడు ఇసుక స్మగ్లర్ల దాటికి వెలవెలబోతోంది. తక్కువ సమయంలో ఏక్కువ సంపాదించాలనే స్మగ్లర్ల అత్యాశ, అధికారుల చేతివాటం, వేరసి ప్రకృతి ఓడిలో నత్తగుల్లలతో, పక్షుల కిలకిల రాగాలతో నిత్యం సిరిసిల్ల పట్టణ ప్రజలకు తాగునీటి అందించే మానేరు నది తీరమంతా గుంతలమయంగా మారింది. కాలక్రమేనా పట్టణంలో జనభా పెరిగిపోవడంతో స్థానిక ప్రజలకు ఉదయం పూట వాకింగ్, యోగ, రన్నింగ్ వంటి వ్యాయమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అందుబాటులో ఉంది. కేవలం జూనియర్ కళశాల మైదానం మాత్రమే. అయితే నూతనంగా నిర్మించిన బైపాస్లో కూడా ప్రజలు వాకింగ్ చేయడానికి వెళ్లిన, పలుమార్లు బైపాస్లో భారీ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఫలితంగా ప్రజలు బైపాస్లో వాకింగ్కు వెళ్లాలంటే జంకుతున్నారు.
రాజన్నసిరిసిరిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు నది నేడు వెలవెలబోతోంది. నిత్యం ప్రవహించే మానేరు నేడు వాకింగ్, యోగ, రన్నింగ్ వంటి కార్యక్రమాలకు మంచి ఇసుక మైదానంగా మారింది. ఈ ప్రాంతంలోనే గంగమ్మ గుడి, ఎస్పీ ఆఫీస్, మున్సిపల్ మ్యూజికల్ వాటర్ పౌంటేన్, బతుకమ్మ ఘాట్ లాంటి ఉండటంతో జన సంచారం ఏక్కువ ఉండటంతో ప్రజలు ఉదయం, సాయంత్రం ఇటువైపు వాకింగ్ రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
అధికారుల చేతివాటం..
గతంలో గంగమ్మ గుడి నుంచి 200మీటర్ల వరకు వదిలి లోకల్ అవసరాలకు ఇసుకను నిబంధనల మేరకు వాడునే అనుమతిని రెవెన్యూ అధికారులు ఇచ్చారు. రెవెన్యూ కింది స్థాయి అధికారులు వీఆర్ఓ, వీఆర్ఏల చేతివాటం వల్ల ఇవేవి పట్టకుండా ఇసుకాసురులు ఇసుకను తోడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు రాసినప్పుడు మాత్రమే, మా తప్పులేదంటు రెవెన్యూ అధికారులు ట్రాక్టర్లను ఇలా పట్టుకొని అలా ఒదిలేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
రెండు శాఖల సమన్వయ లోపం..
పోలీస్, రెవెన్యూ శాఖ సమన్వయ లోపాన్ని అవగాహన చేసుకున్న ఇసుకాసురులు రాత్రి వేలలో గంగమ్మ గుడి చుట్టు ఉన్న ఇసుక మెట్టలను తోడేస్తున్నారు. ఉదయం వేళ వాకింగ్ వెళ్ళేవారు ఈ ఇసుక రవాణపై సదరు శాఖలకు సమాచారమిచ్చిన మా పరిధి కాదంటే, మా పరిధి కాదంటు దాటవేసే దోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడమే మా విధి
ఇరిగేషన్ ఈఈ, ఏడీ మైనింగ్, మిడ్ మానేరు ఈఈ, డీడీ గ్రౌండ్ వాటర్, తంగళ్లపల్లి, సిరిసిల్ల తహసీల్దార్లు, ఏడీ, ల్యాండ్ రికార్డు అధికారులు వీరందరూ గంగమ్మ గుడి పరిసర ప్రాంతంలో ఇసుక తీస్తే జరిగే పరిణామాలపై రిపోర్టు ఇస్తారు. వీరి రిపోర్టు ఆధారంగానే కలెక్టర్, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయక తప్పదు.
తహసీల్దార్ అంజన్న
ఉన్న ఒక్క ఈ ప్రాంతానైనా కాపాడండి
ఈ ప్రాంతంలో గంగమ్మ గుడి, మున్సిపల్ మ్యూజికల్ పౌంటేన్, బతుకమ్మ ఘాట్ ఉన్నాయి. అదివారం ఆటవిడుపు కోసం చాలా మంది ఈ ప్రాంతంలో సేద తీరుతారు. అలాంటి ఈ ప్రాంతంలో ఇసుక గుంతలు లేకుండా అధికారులు కాపాడాలి.
శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు
వాకర్స్కు ఇబ్బంది కలిగించొద్దు
గతంలో వివిధ ప్రాంతాలకు ఇసుక రవాణా జరిగిన గంగమ్మ గుడి పరిసర ప్రాంతాల నుంచి ఎప్పుడు ఇసుక తవ్వలేదు. ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాంతంలో ఇసుకను తోడేసి గుంతలు చేస్తున్నారు. ఉదయం వేళ వాకింగ్ చేసేవారికి ఈ గుంతలు ఇబ్బందిగా మారింది.
పాతురి మహేందర్రెడ్డి, వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు
Authorization