నవతెలంగాణ-సారంగాపూర్
మహా శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని సారంగాపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంబట్ల శ్రీదుబ్బరాజేశ్వరుని ఆలయంలో రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 6 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. ఆదివారం ఉదయం 10:30గంటలకు రంగు రంగుల పువ్వులతో మొక్కజొన్న కంకులు, ఫల పుష్పాలతో అందంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆసీనులను చేయగా వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణాలతో రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్రలో పలువురు కళాకారులు ప్రదర్శించిన వేషధారణాలు రిటైర్డ్ ఏఎస్ఐ మల్లయ్య ప్రదర్శించిన వేషధారణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జాతర బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ వెంకటరమణ, జగిత్యాల రూరల్ సీఐ రాజేష్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ ఎస్ఐలు శీలం రాజయ్య, మనోహర్ రావు, జన్ను ఆరోగ్యం పర్యవేక్షించారు. సారంగాపూర్ ఎంఆర్వో శ్రీనివాస్, ఎంపీడీఓ జే.పుల్లయ్య తమ సిబ్బందితో 6 రోజుల పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలందించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొబ్బరిచిప్పల సేకరణకు వేలం పాటలో వేలం పాట దక్కించుకున్న కాంట్రాక్టర్ తన సహాయకులతో కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చిన భక్తుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.5 నుంచి రూ.10ల వరకు ముక్కు పిండి వసూలు చేశారు. ఈ రథయాత్రలో సారంగాపూర్ ఎంపీపీ కోల జమున శ్రీనివాస్, జెడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, సారంగాపూర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుర్రాల రాజేందర్ రెడ్డి, స్థానిక సర్పంచులు బొడ్డుపెల్లి రాజన్న, ఆకుల జమున రాజిరెడ్డి, పల్లికొండ రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా భీమన్న జాతర రథోత్సవం
రాయికల్: మండలంలోని కొత్తపేట రాజరాజేశ్వర నాగాలయంలో రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు చేరుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఎంపీపీ సంధ్యారాణి , కొత్తపేట, ఒడ్డెర కాలనీ పాలకవర్గం, నాగాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవానికి రాయికల్ మండల ప్రజలతో పాటు మల్లాపూర్, కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల్ తదితర మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బత్తిని రాజేశం, మన్నె గుండ్ల వెంకమ్మ నర్సయ్య, బెక్కెం తిరుపతి, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ శేఖర్, ఆలయ చైర్మన్ మందుల నరేష్, నాయకులు గోపి రాజారెడ్డి, గంగారెడ్డి, ప్రవీణ్, ఆరె శ్రీనివాస్, ఏలేటి రాజేందర్, ఆదిరెడ్డి ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Authorization