సాంప్రదాయంగా సాగవుతున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైనది. కనకాంబరం 30 నుంచి 90 సెం.మీ ఎత్తు పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు.
వాతావరణం: ఉష్ణమండలపు పంట. వాతావరణంలో హెచ్చు తగ్గులను బాగా తట్టుకుంటుంది. 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం.
నేలలు: అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. క్షార గుణం గల నేలలు అనుకూలం కావు.నిమటోడ్స్ ఉన్న నేలలో సాగు చేయరాదు.
రకాలు: దీనిలో ప్రత్యేకించి రకాలు లేవు.కానీ ప్రాంతీయంగా వివిధ రంగుల్లో పుష్పించే రకాలు ఆరంజి, ఎరుపు గులాబి, పసుపు కలవు.
ప్రవర్థనం: విత్తడం, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. ఎకరానికి సుమారు 2 కిలోలల విత్తనాలు అవసరం.
నాటడం: విత్తనాన్ని మే నుంచి జూన్ వరకు విత్త, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. మొక్కలను 30ఇంటు 30సెం.మీ ఎడంలో నాటుకోవాలి.
ఎరువులు: ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతోపాటు 14 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, పొటాష్ ఎరువులను దుక్కిలో వేసి దున్నాలి. ఆ తర్వాత 15 నుంచి 20 కిలోల నత్రజని ఎరువును రెండు దఫాలుగా నాటిన మూడు నెలలకు , 8నుంచి 9 నెలల వ్యవధిలో వేసుకోవాలి.
నీటి యాజమాన్యం:కనకాంబరం నీటి ఎద్దడిని తట్టు కుంటుంది. అయినప్పటికీ వాణిజ్య సరళిలో సాగు చేస్తే అవసరాన్ని బట్టి 10నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటి యాజమాన్యం చేయవచ్చు.
పూత : మొక్కలు నాటిన 3నుంచి 4 నెలల తర్వాత పూత ప్రారంభమై సంవత్సరం పొడువునా పూస్తాయి.
తెగుళ్లు
కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు ఆశించిన మొక్క ఆకుల అంచులు పసుపు రంగుకు మారుతాయి. వేర్లు మొక్క కాండం మొదలు కుళ్లడం వల్ల మొక్క ఆకస్మికంగా చనిపోతుంది. కాండాన్ని చీల్చి చూస్తే లోపల గోధుమ రంగుకు మారి ఉంటుంది.దీని నివారణకు పరిశుద్ధమైన సాగు పద్ధతులు పాటించాలి. మురుగు నీరు తీసివేయాలి. నెమటోడుల నివారణకు సొలరైజేషన్ చేయాలి. భూమిలో వేప చెక్క ప్యురడాన్ గుళికలు వేయాలి. భూమిని లీటరు నీటికి 2 గ్రా.బినోమిల్ లేదా 3గ్రా. మాంకోజెబ్ కలిపిన ద్రావణంతో తడపాలి. నారు మొక్కలను 2 గ్రా. బినోమిల్ లేదా 1 గ్రా. కార్బెండజిమ్ మందు ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
సేకరణ : మోత్కూరి యాదయ్య
Authorization