మామిడి కాయలు చెట్లమీద మగ్గుతాయి. కానీ ఆ విధంగా మగ్గనివ్వకూడదు. ఎందుకంటే చెట్లపై కాయలు సమానంగా పండవు, రంగు కూడా పీలవంగా ఉంటుంది. నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. అనేక సార్లు కోయాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల మామిడి కాయలను ఆకుపచ్చగా, గట్టిగా పక్వానికి రాగానే అవి మగ్గక ముందే కోసి కృత్రిమ పద్దతుల ద్వారా పండిస్తారు.
వరి, బోద గడ్డి ఉపయోగించి మామిడి కాయలను మాగవేస్తారు. బయటి ప్రదేశాల్లో కోసిన కాయలను గుట్టలుగా పోసి వాటిని వరిగడ్డి లేదా బోదగడ్డితో కప్పుతారు. లేదా గాలి చొరబడని గదుల్లో నేలపై పర్చిన వరి లేదా బోదగడ్డి మీద మామిడి కాయలను వరుసగా పేర్చి మగ్గనిస్తారు. దక్షిణ భారత రాష్ట్రాలలో స్థానిక మార్కెట్ల కోసం ఈ పద్దతిని ఇంకా ఉపయోగిస్తున్నారు. కర్ణాటక, మరి కొన్ని దక్షిణ ప్రాంతాలలో మామిడి కాయలను గదుల్లో ఉంచి పొగపెట్టడం ద్వారా కూడా మాగనిస్తారు. ఈ సాంప్రదాయ పద్దతుల వల్ల కాయలు మగ్గడానికి చాలా రోజుల పడుతుంది.
ప్రస్తుత పద్దతులు
సాంప్రదాయ పద్దతిలో కోసిన కాయలు వివిధ పక్క దశల్లో ఉండడం వల్ల అన్ని కాయలు సమంగా మగ్గవు. నిద్రవస్థలో ఉన్న నల్లమచ్చ తొడిమ కుళ్లు ఎక్కువై అపార నష్టాన్ని కలుగజేస్తాయి. అందువల్ల వాణిజ్య సరళిలో చేసే వర్తకంలో మామడిని కృత్రిమంగా రసాయనాల ద్వారా మాగనిస్తారు. ఈ పద్దతిలో తొలి నుంచి కాల్షియం, కార్బైడ్ ఆ తర్వాత ఎథిలిన్ను ఉపయోగించి మామిడి కాయలను మగ్గనిస్తున్నారు.
కాల్షియం, కార్బైడ్తో మామిడి కాయలను మగ్గవేయడం:
కాల్షియం, కార్బైడ్తో పండిన పండ్లు ఆరోగ్యానికి హానికరం. వినియోగదారులకు విషంగా పని చేస్తాయి. వాటిని తినడం వల్ల మానవ శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జీవన క్రియలు మందగిస్తాయి. శరీరంలో రక్షహీనత ఏర్పడుతుంది. మూత్రపిండాలు దెబ్బ తింటాయి. ఒక్కోసారి ఆరోగ్యం కోలుకోలేని విదంగా అవుతుంది.
ఇథలీన్ వాయువుతో పండ్లను మాగపెట్టే పద్దతి:
ఇథిలీన్ వాయువును ఉపయోగించి పండ్లను మాగపెట్టుటకు ముఖ్యంగా మామిడి, అరటి, సపోట కాయలు పక్వానికి మూడో వంతు తయారై ఉండాలి. ఇథిలీన్ వాయువును ఉపయోగించుటకు ఇథిలీన్ రైపనింగ్ ఛాంబర్స్ ఏర్పాటు, వాణిజ్య పరంగా ఇథిలీన్ వాయువు లభ్యత గురించి రైతులకు, వ్యాపారస్తులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. మామిడి కాయలను రైపనింగ్ చాంపర్లో ఉంచి 100 నుంచి 150 పిపిఎం ఇథిలీన్ వాయువును ప్రవేశపెట్టి 12 నుంచి 24 గంటలు ఛాంబర్ తలుపులు తెరవకుండా ఉంచాలి. తరువాత కాయలు 4 నుంచి 5 రోజుల్లో మంచి రంగు సంతరించుకుని పక్వానికి వస్తాయి.
Authorization