రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంట వరి. వర్షాకాలంలో 10 నుంచి 11 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నాం. రబీలో ఆరు నుంచి 7 లక్షల హెక్టార్లలో సాగు చేస్తాం. మన దగ్గర వరి సాగుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ దిగుబడులు ఆశించినంత మేరకు రావడం లేదు. గత కొన్నేండ్లుగా 3.8 టన్నులు మించి రావడం లేదు. కనీసం ఒక హెక్టారుకు 5 టన్నులుపైబడి రావాల్సి ఉంటుంది. అప్పుడే విజయవంతంగా అయినట్లు.
అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం లేదు. వర్షపాతం తగ్గిపోతుంది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాలు సకాలంలో కురవకపోవడం జరుగుతుంది. అందుకే నాటు ఆలస్యంగా వేసినా మంచి దిగుబడులు వచ్చే రకాలు రావాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నా పంట పండే విధంగా ఉండాలి. భవిష్యత్తులో నీటి ప్రమాదం పొంచి ఉంది. లేబర్ సమస్య కూడా మనముందుంది. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది కనుక ఇవన్ని అధిగమించాల్సి ఉంది.
యువత ఆసక్తి చూడాలంటే వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి. దీర్ఘకాలిక రకాలు ఎక్కువ సాగు చేసేవారు అంటే ఐదునెలల పంట. ఇప్పుడు ఆ పంటలు సాధ్యమైనంత వరకు తీసేయాలి. సాంబ మసూరి, బీపీటీ 5204 ఇలా దీనికి ధీటుగా నాలుగు నెలల్లోనే అధిక దిగుబడులు సాధించే రకాలు చాలా ఉన్నాయి. జూన్ నెలలోనే నారు పోసుకోవాల్సిన పని లేదు. తొలకరి వర్షాలు రాగనే పచ్చిరొట్ట పంటకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే రసాయన ఎరువులు తగ్గించుకునేందుకు వీలుంటుంది. అలాగే నీరు సద్వినియోగం అవుతుంది.
జూలైలో నారు పోసుకొని ఆగస్టులో నాట్లు వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. బీపీటీ కి సమానంమైన పంట ఉన్నప్పుడు ఐదు నెలల పంటలకెందుకు వెళ్లాలి. స్వల్ప కాలిక రకాలు తీసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ 15048, జగిత్యాల జెజిఎల్ 1798 సన్నరకాలు. వీటిని స్వల్పకాలిక రకాలు (125 రోజులలో వచ్చేవి) అంటారు. మధ్యకాలిక రకాలు 135 రోజుల వరకు వచ్చేవి బీపీటీ నాణ్యతలోనే ఉంటాయి. జగిత్యాల్ మసూరి (జెజిఎల్) 11470, కృష్ణ అగ్గితెగులును తట్టుకునేది. డయాటెటిక్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలుజరగుతుంది. దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కనుక మధుమేహవ్యాధిని నియంత్రిస్తుంది. జెజిఎల్11727, డబ్ల్యుజెలెల్ 14, 32100, మరోటి జెజిఎల్ అనే రకాలున్నాయి. స్వల్పకాలిక రకాలు తెలంగాణలో పండించేవి ఎంటియు 1010 కాటన్ దొరసన్నాలు. ఎక్కువగా ప్రాచూర్యం పొందినవి బీపీటీ 4204 ఎంటియు పంటకాలం ఎక్కువ .
తెలంగాణకు కెఎన్ఎం 118, జెజిఎల్ 18047 ప్రత్యామ్నాయాలు. రైతులు వేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు. రోగాల విషయంలో దోమను తట్టుకునేందుకు తయారు చేస్తున్నాం. రెండేండ్లలోపు వస్తాయి. మన రాష్ట్రంలో ఆరు వరి పరిశోధనా కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. రైతులకు ఏం చేయాలనేదానిపై దిగుబడి పెంచాలనేది కీలకంగా చర్చించారు. ఎకరానికి సరాసరి 50 బస్తాలకు తగ్గకుండా దిగుబడి రావాలి. ఇంకా 20 శాతం దిగుబడి పెంచాలి. అవసరమైన వరి విత్తనాలు రావాలి. వరిలో హైబ్రీడ్స్ వృద్ధి చేయాలి. తక్కువ నీటితో లేబర్ సహాయం లేకుండా ఎలా చేయాలనేది చూస్తున్నాం. తెలంగాణలో చౌడు భూములు అధికంగా ఉన్నాయి. చౌడును తట్టుకునే విధంగా పరిశోధనలు చేస్తున్నారు.
అంతేకాకుండా నీటి వినియోగం కూడా అధికం. బావుల కింద విద్యుత్ వృధా చేస్తున్నాం. అందుకే మధ్య కాలిక, స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. 125 రోజులకు కోతకొచ్చేవి స్వల్పకాలికాలు. తెలంగాణలో వరి ఎగుమతికి ఎక్కువ అవకాశాలున్నాయి. తెలంగాణలో మంచి విత్తనం తయారు చేసేందుకు వనరలున్నాయి. ఐదారు రకాల వరి విత్తనాలు ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలనే ఆలోచన ఉంది.
ఆర్ఎన్ఆర్- 15048
ఖరీఫ్, రబీ సీజన్లో అనువైన స్వల్పకాలిక రకం. కాలం వ్యవధి 125 రోజులుంటుంది. ఖరీఫ్లో ఆలస్యంగా విత్తుకోవడానికి అనువైన రకం, జూలైలో అయితే పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది. ఎంటియు 1010 కాటన్దొర సన్నాలతో సరిసమానంగా అధిక దిగుబడులు వచ్చే రకం. అంతేకాకుండా తక్కువ నత్రజనితో అధిక దిగుబడి వస్తుంది. సాంబమసూరితో పోల్చుకుంటే అతిసన్నగా ఉంటుంది. అన్నం రుచికరంగా ఉంటుంది. అగ్గితెగులును సమర్ధవంతంగా తట్టుకుంటుంది. రబీలో చలిని తట్టుకుంటుంది. ఖరీఫ్లో 70 శాతం నూకలు లేని బియ్యాన్ని ఇస్తుంది. ఖరీఫ్లో అయితే జూలై నెలలో నార్లు పోసుకోవాలి. జూన్లో నారు పోసుకుంటే కాలపరిమితి పెరుగుతుంది. కొంచెం ఎత్తుపెరుగుతుంది కనుక నత్రజని ఎరువును మోతాదు తగ్గించి వేసుకోవాలి. స్వల్పకాలిక రకం కనుక నత్రజనిని నాట్లు వేసుకున్న తరువాత వారం పది రోజుల వ్యవధితో మూడు దఫాలుగా చిరుపొట్ట దశలో చల్లుకోవాలి. ఈ రకంలో కాండం తొలుచు పురుగు అశించే అవకాశం ఉంది కనుక 7 నుంచి 10 రోజుల్లో గుళికలు, చిరుపొట్ట దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరాన్టానిల్ప్రోల్ వంటి మందుల వాడి నివారించుకోవాలి. సన్నగింజ రకం కనుక బెట్ట పరిస్థితుల్లో కంకినల్లి ఆశించకుండా చిరుపొట్ట దశలో ప్రోఫెనోఫాస్, డైకోఫాల్, స్పైరోమెపిఫెన్ వంటి మందులు పిచికారీ చేయాలి. ఈ రకం 10 నుంచి 15 రోజులు నిద్రావస్థను కలిగి ఉన్నది. కనుక కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడుకోవాలంటే బాగా ఎండబెట్టిన తరువాత మొలక శాతాన్ని పరీక్షించి నార్లు పోసుకోవాలి.
Authorization