సాధారణంగా కందిని సాంప్రదాయ పద్దతిలో వర్షాలు కురిసిన తర్వాత జూన్ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రుతుపవనాలు ఆలస్యం అయ్యే సందర్భాల్లో నాటే పద్ధతి ద్వారా కందిని పెంచడం ఒక మంచి ప్రత్యామ్నాయం. నాటే పద్దతిలో30 నుంచి 45 రోజుల వయస్సు మొక్కలను నాటాలి. అదే విధంగా మొక్కల పెంపకం వేసవి కాలంలోనే చేపట్టాలి. కనుక ప్రధాన పొలానికి దగ్గర్లో షెడ్ వంటి నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలి. 6 ఇంటు 4 పరిమాణంలో ఉండే హెడ్. డిపిఇ పాలి బ్యాగులను మొక్కల పెంపకం కొరకు వినియోగించుకోవాలి. మే 15లోపు ఒక్కో పాలి బ్యాగులో మట్టి, తగు మోతాదులో పశువుల ఎరువు, డిఎపి కలిపిన మిశ్రమాన్ని కలిపి సిద్దంగా ఉంచుకోవాలి.
మే 15 నుంచి 20వ తేదీ లోపు ఒక్కో పాలి బ్యాగుకు 2 నుంచి 3 గింజలు నాటుకోవాలి. ఇలా నాటిన గింజలు 5 నుంచి 6 రోజుల్లోపు మొలకెత్తుతాయి. అనుకూలతను బట్టి 30 నుంచి 45 రోజుల మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. కనుక రైతులు మొక్కల అవసరానికి తగ్గట్టు నీటిని అందిస్తూ జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈ విధంగా పెంచిన మొక్కలను ప్రధాన పొలంలో నాటి, మిగిలిన యాజమాన్య పద్దతులను సాంప్రదాయ పద్దతిలో మాదిరిగానే పాటించాలి. ఈ పద్దతిలో కందిని సాగు చేసేటప్పుడు శాఖీయ ఎదుగుదలకు 40 రోజుల సమయం అధికంగా పట్టినా సాంప్రదాయ పద్దతిలో పోలిస్తే ఎకరానికి మూడు రెట్లకుపైగా అధిక దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
- విస్తరణ సంచాలకులు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
Authorization