గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 34 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణ్నోగతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
సూచనలు: రాబోయే ఐదు రోజుల్లో వర్షపాత సూచనలున్నందున వర్షం కురిసిన తర్వాత ఈ కింది సూచనలు పాటించాలి. వర్షాదార పంటలలో పైపాటు ఎరువులను వేసుకోవాలి. పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు వంటి పంటలను విత్తుకోవాలి. దక్షిణ తెలంగాణ మండలంలో ఆముదం పంటను విత్తుకోవడానికి అనుకూలం. కంది పంటను వరుసల మధ్య దూరం తగ్గించి అధిక సాంధ్రతతో విత్తుకోవాలి. వర్షాధార పంటలలో నిలిచిన వర్షపు నీటిని తీసేయాలి. రైతులు తెలంగాణ సోన(ఆర్ఎన్ఆర్ 15048), ఇతర స్వల్పకాలిక వరి రకాల విత్తనాన్ని నారుమడి పోసుకోకూడదు. దోమపోటు ఉదృతి తగ్గించేందుకు ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటను వదులుకొని తూర్పు పడమర దిశలలో వరుసలను ఉండే విధంగా వరినాట్లు వేసుకోవాలి. నీటి కొరత దృష్ట్యా వరి పంటను సాగు చేయకూడదు.య తరువాత వర్షపాతం వల్ల నీటి లభ్యత ఏర్పడిన సమయంలో నేరుగా వరి విత్తనం వేసే పద్దతిలో సాగు చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలోరసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం.నివారణకు ప్రస్తుతం పత్తి పంట రాష్ట్రంలో 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. గత వారం రోజుల నుంచి రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అధిక వర్షాల వల్ల పత్తి పంటలో వివిధ సమస్యలను గమనించవచ్చు.అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో పత్తి పంటలో వడలు తెగులును (పారావిల్ట్) గమనించారు. దీని నివారణకు మొదటగా పొలంలో నిలిచి వున్న వర్షపు నీటిని కాల్వల ద్వారా బయటకుపంపించాలి. వడలి పోయిన మొక్కలతోపాటు వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్ల వద్ద వేరు వ్యవస్థ బాగా తడిచేటట్టు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి పోయాలి. వారం వ్యవధిలో అవసరాన్ని బట్టిమళ్లీ ఇదే పద్దతిలో భూమిని తడపాలి. రసం పీల్చే పురుగుల నివారణకు మొనోక్రోటోఫాస్ మందును, నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మొత్తని బ్రష్తో విత్తిన 30 రోజుల పైరుకు పూయాలి. నేలలో ఎక్కువ మోతాదులో తేమ ఉన్నట్టయితే పత్తిలో ఎండు తెగులు సోకుటకు అనుకూలం. ఈ తెగులు వ్యాప్తి నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.అధిక వర్షాల నుంచి పంట కోలుకోని త్వరగా అభివృద్ది చెందేందుకు 10 గ్రా. పొటాషియం నైట్రేట్ లేదా 20 గ్రా. యూరియా లేదా 10 గ్రాముల నీటిలో కరిగే ఎరువులైన 19.19.19ని లీటరు నీటిలో కలిపి పంటపై వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. అంతే కాకుండా పత్తిలో పొగాకు లద్దె పురుగు గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. థయోడికార్బ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్న రైతులు కూడా పొలంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు కాల్వల ద్వారా తీసేయాలి. వర్షం ఆగిన వెంటనే మొక్కజొన్న పంటకు 20 నుంచి 30 రోజుల దశలో 30 కిలోల యూరియాను, 25 కిలోల పొటాష్ను అదనంగా (బూస్టర్) మోతాదులో వేసుకోవాలి. మొక్కజొన్నలో ఎర్వినియా ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఎకరానికి 100 కిలోల వేపపిండి, 10 కిలోల (35శాతం క్లోరిన్ కలిగిన) బ్లీచింగ్ పౌడర్ను కలిపి పొలంలో నేలపై తేమ ఉన్నప్పుడు మొక్కల మొదళ్లకు దగ్గరగా వెదజల్లాలి.
కూరగాయలు: కూరగాయ పంటలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాట, వంగ మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతిగల ప్రాంతాలలో బెండ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి.
Authorization