నవతెలంగాణ-తాడ్వాయి
మండల కేంద్రంలోని బీసీ కాలనీలో 41.66 లక్షల వ్యయంతో మంచి నీటి ట్యాంక్ను నిర్మించారు. రెండు సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తి అయినప్పటికీ ట్యాంక్లోకి మంచి నీరు సరఫరా కావడం లేదని కాలనీవాసులు వాపోయారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందు కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీి పల్లెప్రాంత ప్రజల గొంతు తడవడం లేదు. వేసవి కాలంలో కిలోమీటర్ దూరం కాలినడకన వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ దప్పిక తీర్చుకుంటున్నారు. ఈ విషయమై మండల పరిషత్ అధికారులకు విన్నవించి నప్పటికీి చూసి చూడనట్లుగా వ్యవహరి స్తున్నారే తప్పా ట్యాంక్లకు నీరందించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి ట్యాంక్లో కి నీరు అందించి సరఫరా చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య తీవ్రం కాగా తాము పలుమార్లు రాస్తారోకోలు సైతం చేసినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, తమ కాలనీకి తాగునీటి సరఫరా చేయడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం సాగు, తాగునీటిని అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, మండల కేంద్రమైన తాడ్వాయిలో మాత్రం నిధులు సద్వినియోగం కావడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని, రెండు సంవత్సరాల క్రితం అన్ని హంగులతో నిర్మాణం పూర్తయిన మంచి నీటి ట్యాంక్లో నీటిని అందించి దాహం తీర్చేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Authorization