నవతెలంగాణ-మాచారెడ్డి సాముహిక సెలవు మంజూరు చేయాలని కోరుతూ మాచారెడ్డి మండల రెవెన్యూ అధికారుల సంఘం సోమవారం గిర్దావరి బావయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, సెప్టెంబర్ 1న సామూVి క సెలవు ఇవ్వాలని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం పిలుపు మేరకు వినతి పత్రం అంజేసినట్లు మండల రెవెన్యూ అధికారుల సంఘం నాయ కులు సత్యం తెలిపారు. సీపీిఎస్ విధానాన్ని రద్దు చేసేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆర్వోలు పీవీ మోహన్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.