నవతెలంగాణ-సదాశివనగర్
గాయత్రి షుగర్ ప్యాక్టరీలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద కార్మికులు సోమవారం అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. ముడురోజులుగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు వేలం వేశారు. ఈ వేలం పాటలో జె .రామారావు ముదిరాజ్ అనే కార్మికుడు 3100 రూపాయలకు వేలం ద్వారా లడ్డును దక్కించుకున్నారు. ఈతరం యూత్క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఉపాధ్యక్షులు వేణుగోపాల్రావు, కేన్ మేనేజర్ వెంక ట్రావు, డీజీఎం వీరరాజు, కార్మిక సంఘం నాయకులు ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, రాజ్కుమార్, రామ్మో హన్, దామోదర్ రెడ్డి, లింబాద్రి, గోవర్ధన్, మల్లికార్జున్, రాజయ్య, ఈతరం యూత్ సభ్యులు శివకుమార్, ప్రశాంత్గౌడ్, సురేశ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు :మండల కేంద్రంలో ఆదర్శ యూత్ క్లబ్ అధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆదర్శ యూత్క్లబ్ వ్యవసా ్థపకులు గజ్జెల భికపతి, శ్రీవాణి దంపతులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో యూత్క్లబ్ సలహా దారులు దేవుని సాయిలు, సత్యనారాయణ, ప్రతినిధు లు గంగల రమేశ్, గంగారాములు, ఉప్పరి రాజు, బండి సత్యనారాయణ తదితరులున్నారు.
లింగంపేట్ :మండల కేంద్రంలోని తన కార్యాలయం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చినట్లు తహసీల్దార్ మోతిసింగ్ తెలిపారు. తహసీల్ కార్యాలయంలో స్వచ్ఛందంగా వీఆర్ఏలు, వీఆర్వోలు ముందుకు వచ్చి తహసీల్ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. వినాయక పూజలో భాగంగా నాల్గోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ సంపత్కుమార్, ఎంపీడీవో శంకర్రెడ్డి, డీటీ గంగాధర్, ఆర్ఐ గణేశ్, ఈవోపీఆర్డీ వెంకటేశం, ఏపీవో రజనీ, ఏపీఎం శ్రీనివాస్, వీఆర్వోలు సత్యనారాయణ, దర్మయ్య, సునీత, అనురాధ, రాజేశ్వర్, ఏఎస్ఐ చక్రవర్తి, వీఆర్ఏలు ఉన్నారు.
Authorization