- 12దాటినా ప్రజావాణి లేదు నవతెలంగాణ-జుక్కల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహిం చాల్సి ఉన్నా మధ్యాహ్నం వరకూ అధికారులు పత్తాలేకుం డాపోయారని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. తహసీల్దార్ శంకర్సింగ్, ఎంపీడీఓ చందర్ నాయక్ మధ్యాహ్నం 12 తరువాత వచ్చారని ప్రజావాణికి వచ్చినవారు వాపోయారు. ఎంఈవో సైతం లేరని పనినిమ్తిం వచ్చినవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయమై కార్యాలయ సిబ్బందిని అడుగగా ఎంఈఓ మద్నూర్ మీటీంగ్లో ఉవ్నారని సమాధానం చెప్పారు. తహసీల్దార్, ఎంపీడీఓ ఎంఈవో కుర్చీలు ఖాళీగానే దర్శనమి చ్చాయి. మండలాధికారులు సమ య పాలన పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీరికి అడిగే వారు లేరా అని ప్రశిస్తు న్నారు. ఎవరైన గట్టిగా అడిగితే అన్నివిషయాలు మీకు చెప్పాలా అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని పనులనిమిత్తం వచ్చినవారు వాపోతున్నారు. అధికారులు జవాబుదారీగా ఉండాలని, మారు మూల మండలం అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.