నవతెలంగాణ-కంఠేశ్వర్ నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 44 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఇన్చార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. నర్సాపూర్ పోతుగడ్డ వద్ద సర్వే నెంబర్ 53లో నడుస్తున్న క్వారీని రద్దు చేయాలని కోరుతూ పంచాయతీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం రవీందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.