నవతెలంగాణ-రెంజల్ మండలకేంద్రంలోని గ్రంథాలయానికి 135 కొత్త పుస్తకాలు వచ్చినట్టు గ్రంథపాలకుడు రాజేశ్వర్ సోమవారం తెలిపారు. చారిత్రక పుస్తకాలతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకుల పుస్తకాలు వచ్చాయని చెప్పారు. ఈ అవకాశాన్ని స్థానిక యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.