ఎడపల్లి:మండలంలోని జానకంపేట్లో శాంతికమిటీ సమావేశాన్ని సోమవారం బోధన్ రూరల్ సీఐ గోవర్దనగిరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన హితవు పలికారు. వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో ఎడపల్లి ఎస్ఐ ఆసిఫ్, సర్పంచ్ బండారి దశరథ్, మండల పరిషత్ వైస్ ఎంపీపీ వరదాగౌడ్, స్థానిక నాయకులు, మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కుర్నాపల్లిలో.. మండలంలోని కుర్నాపల్లి గ్రామాన్ని బోధన్ రూరల్ సీఐ గోవర్ధనగిరి పరిశీలించారు. గణేష్ మండపాలను ఆయన పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. గ్రామంలో అందరూ సోదరభావంతో ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎడపల్లి ఎస్సై ఆసిఫ్, సర్పంచ్ సావిత్రి రవిందర్గౌడ్, స్థానిక నాయకులు సాయిలు, మండపాల నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.