- 30న ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా - జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్గౌడ్ నవతెలంగాణ-కంఠేశ్వర్ కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 30న ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర గీత పనివారి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2017-18 పాలసీలో వృత్తి, వనం, ఉపాధి గ్యారంటీ శాశ్వత లైసెన్స్, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఈ పాలసీకి స్వస్తిచెప్పి, లైసెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాకారసంఘాల్లో అర్హులైన వారందరికి సభ్యత్వం కల్పించాలన్నారు. నగరంలో మూసివేసిన కల్లు సోసైటీలను తెరిపించి కార్మికులను అదుకోవాలని, పలు సమస్యలతో ఆగస్టు 30 ఎక్సైజ్ సూపరిడెంట్ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గీత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గంగాధర్గౌడ్, నారాగౌడ్, శంకర్గౌడ్, లక్ష్మి నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.