నవతెలంగాణ-భిక్కనూరు
రుణం ఇచ్చేవారికి తీసుకునే వారు ప్రామిసరి నోట్ రాసి ఇస్తారు. ఈ నోట్పై అవగాహన లేక కొందరు మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిసై సరైన అవగాహన ఉంటే మోసపోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ప్రామిసరీ నోట్ (ప్రానోట్) అంటే రాతపూర్వకమైన పత్రమని అర్థం. ప్రామిసరి నోట్లో డబ్బు ఇచ్చే వ్యక్తి (రుణదాత) అప్పు తీసుకున్న వ్యక్తి (రుణగ్రహిత) పూర్తి పేర్లు, చిరునామాలు ఉం డాలి. డబ్బు ఎంత మొత్తం అనేది తప్పనిసరిగా అక్షరాల్లో రాసుకోవాలి. ప్రానోట్ రాసిన స్థలం, తేదీని రాయాలి. డబ్బులు తీసుకునే వ్యక్తి ప్రానోట్ కింది భాగంలో అంటించిన రెవెన్యూ స్టాంప్పై సంతకం చేయాలి. చదువు రాని వారు ఎడమ చేతి బొటన వేలిముద్రలను వేయాలి. ప్రామిసరీ నోట్కు సాక్షులు ఉండి తీరాలని చట్టంలో లేదు. కాకపోతే ఇద్దరి సాక్షుల సంతకాలు తీసుకోవడం మంచిది.
నిర్ణీత మొత్తాన్ని ఒక వ్యక్తి లేదా అతడితో ఆర్డర్ పొందిన వ్యక్తికి లేదా ఆ పత్రంపై డబ్బు తీసుకోవడానికి దానిని తెచ్చిన వ్యక్తికి చెల్లిస్తానని వాగ్ధానం చేసి ఉండాలి. షరతులు మాత్రం ఉండకూడదు. ప్రతి ఫలం (ఇచ్చిన సోమ్ము) నగదు రూపంలో ఇస్తున్నామో, చెక్కు రూపంలో ఇస్తున్నామో ఉండాలి. ప్రామిసరి నోట్ రాతపూర్వకంగా ఉండాలి. ప్రానోట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. రూపాయి నుంచి ఎంత రుణానికైనా ఒక రూపాయి రెవెన్యూ స్టాంపు సరిపోతుంది.
కాలపరిమితి ప్రామిసరి నోట్పై ఉన్న తేదీ నుంచి మూడు సంవత్సరాలు ఉంటుంది. ప్రామిసరి నోట్ రాసిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు రుణగ్రహిత సొమ్ము చెల్లించక పోతే కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. మూడుసంవత్సరాలు దాటిన తరువాత కోర్టులో కేసు వేయ డానికి వీలులేదు. మూడేండ్ల కాలంలో రుణగ్రహిత ఏమైనా సొమ్ము చెల్లిస్తే ప్రామిసరి నోట్ వెనుక ఎంత చెల్లించింది రాసి, సంతకం చేసి తేదీ వేయాలి. దీంతో ఆ తేది నుంచి తిరిగి మూడు సంవత్సరాలకు ప్రానోట్కు కాలప రిమితి ఉంటుంది.వడ్డీ అప్పుగా తీసుకున్న సొమ్ముకు రూ.2 మాత్రమే వడ్డీగా వసూలు చేయాలి. అధిక వడ్డీ వసూలు చేయడం నేరం.
రుణదాత బాధ్యతలు :
ప్రామిసరి నోట్పై కొట్టివేతలు లేకుండా చూసుకోవడం మంచిది. రుణగ్రహిత సంతకాలను ఫోర్జరీ చేసి ప్రామిసరి నోట్లు తయారు చేయడం నేరం. రుణ గ్రహితకు డబ్బు అప్పుగా తీసు కుని మూడు సంవత్సరా లలోపు చెల్లించక పోతే న్యాయవాది ద్వారా అతడికి నోటిసు ఇచ్చి కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు.
రుణగ్రహిత బాధ్యతలు :
ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంత కాలు చేస్తే ఇబ్బందు లు తప్పవు. తాను అప్పుగా తీసుకున్న సొమ్మును సకాలంలో తీర్చాలి. తన ఆర్థిక శక్తి ఎంత ఉందో అంతవరకే అప్పు తీసుకో వడం మంచిది. ప్రానోట్ బదిలీ ప్రామిసరి నోట్ను రుణదాత తనకు కావాల్సిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు.
రుణగ్రహిత నుంచి అప్పు వసూలు చేసుకునే హక్కును బదిలీ చేయవచ్చు. ఆధారం కోసం మరో సంతకం అవసరం. రుణం ఇచ్చే సమయంలో ప్రామిసరి నోట్పై సంతకం చేయించుకునే సమయంలో వారు గతంలో పెట్టిన సంతకాలు పరిశీలించాలి. అలాగే దొంగ సంతకాలు చేసి కోర్టులో దావా వేస్తే బాధితులు భయపడకుండా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం ద్వారా సంతకం తనది కాదని నిరూపించుకోవచ్చు. ఖాళీ ప్రామిసరి నోట్పై ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం చేయకూడదు. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు.
Authorization