- జాడలేని బయోమెట్రిక్
- ఎంపికలతోనే సరిపెట్టిన అధికారులు
- అందులోనూ 'ప్రైమరీ'ని మరిచారు..
- అడ్డదారిలో క్రమశిక్షణ
- గాడిన పడని సర్కారు బడులు
రాష్ట్ర సర్కారు చర్చలు, నిర్ణయాలకే పరిమితమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రావడం, పోవడం ఇంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. పాఠశాలలో హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా అనుమానంగా ఉంటోంది. కొందరు ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు కాపాడుకునేందుకు పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసి చూపుతున్నారనే ఆరోపణలూ ఉన్న నేపథ్యంలో వీటిన్నింటికీ బయోమెట్రిక్తో చెక్ పెట్టొచ్చని ఈ జూన్ పాఠశాలల ప్రారంభం నుంచే అమలు చేయాలని, జూన్లో పాఠశాలలు ప్రారంభానికి బయోమెట్రిక్ పరికరాలను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో చర్యలకు పూనుకోలేదు.
నవతెలంగాణ-భిక్కనూరు
కామారెడ్డి జిల్లాలో 314 ఉన్నత పాఠశాలలు, 217 ప్రాథమికోన్నత పాఠశాలు, 730 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో లక్షా 47వేలా 449 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నారు. అయితే ఈ పాఠశాలల్లో బోధిస్తున్న కొందరు ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు చదువులు చెప్పి సమయం అయిన వెంటనే వెళ్లిపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు ఆర్టీసీ బస్సు, రైలు సమయం అవుతోందని పాఠశాల నుంచి వెళ్లిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. తమకు నచ్చిన సమయంలో రావడం, వెళ్లడం.. ఏదో ఒక వంకతో పాఠశాలకు వచ్చిన వెంటనే వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతోంది. విద్యార్థుల సంఖ్య సైతం తక్కువ గా ఉన్నా తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు సంఖ్యను ఎక్కువగా చూపుతున్నారని ఆరోపణలూ ఉన్నారు. వీటిని చెక్ పెట్టేందుకు ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమె ట్రిక్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఎక్కడా ప్రారంభించిన దాఖలాలు లేవు.
మొదటి విడుతలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయడానికి కామారెడ్డి జిల్లాలో 184 ఉన్నత పాఠశా లలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారులకు నివేధిక అందజేసి నా నేటికీ బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో విద్యాశాఖ అధికారులకు ఆయా జిల్లా కలెక్టర్లకు బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిధులు సైతం విడుదల చేసి చేసినట్టు సమాచారం. నిధులు సమకూర్చినా నేటికి యంత్రాల ను బిగించలేదు. ప్రస్తుత సంవత్సరంలో ప్రయివేటు కంపెనీల ద్వారా టెండర్లను పిలిచి ప్రభుత్వ పాఠశాల లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక, ప్రాథమికోన్నతపాఠశాలల్లోనే ఎక్కువ డుమ్మాలు..
ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎక్కువగా గైర్హాజరవుతు న్నారు. కొందరు ఉపాధ్యాయులు సమావేశాలు, శుభ కార్యాలయాల పేరిట నకిలీ సెలవు పత్రాలు ముందు గానే ఏర్పాటు చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు విద్య అం దడం లేదు. పిల్లల భవిష్యత్తుకు పునాది రాళ్లటువంటి విద్యనందించే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశా లలను వదిలేసి ఉన్నత పాఠశాలల్లో మాత్రమే బయో మెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు తె లుస్తోంది. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ శాలలు మరింత అస్తవ్యస్తంగా మారేలా ఉన్నాయి.
ఎంపికలతోనే సరి..
బయోమెట్రిక్ విధానాన్ని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లాలో 184 ఉన్నత పాఠశాలలను గుర్తించారు. ఇది జరిగి ఏడాది గడుస్తు న్నా ఎంపిక చేసిన ఒక్క పాఠశాలలోనూ బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరంలోనైనా బయో మెట్రిక్ విధానం ఏర్పాటు చేస్తుందా లేదా అనే ప్రశ్నార్థ కంగా మారింది. ప్రయివేటు కంపెనీల ద్వారా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, నిధులు కొరత సాకుతో వచ్చే సంవత్సరానికి మాట మార్చు తుందోననే అనుమానాలు ఉన్నాయి.
అచరణలో ప్రభుత్వం విఫలం
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్
ప్రభుత్వం చర్చలు, నిర్ణయాలు తీసకుంటున్నా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. బయోమెట్రిక్ విధానం గత సంవత్సరంలోనే అమలు చేయాలనుకున్నా నేటికీ చేయలేదు. విద్యార్థులుకు వి ద్య అందాలంటే ఉపాధ్యాయులు విధులను సక్రమంగా చేపట్టాలి. కానీ కొందరు ఉపాధ్యాయులు ఇష్టారీతన హాజరుకావడం, డుమ్మాలు కొట్టడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
బయోమెట్రిక్తో పాటు మౌలిక
వసతులు కల్పించాలి
- దామోదర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యకుడు
ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల హాజరుశాతం పెరుగుతుంది. విద్యావ్యవస్థను పటిష్టం చేయవచ్చు. బయోమెట్రిక్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి.
నిర్ణయం మాత్రమే జరిగింది..
ఆదేశాలు రాలేదు..
- మధన్మోహన్, డీిఈవో కామారెడ్డి
బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయడా నికి ఎంపిక చేసిన పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారులకు నివేదిక అందజేశాం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు.
Authorization