నవతెలంగాణ-లింగంపేట్ పట్టణంలోని వారాంతపు సంత మార్చాలని వ్యాపారులు శనివారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. పట్టణానికి చెందిన 24 వ్యాపార సంఘాలు, 20 కులసంఘాలు సంత బుధవారం నిర్వహించాలని వారు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికే పలుసార్లు ఆర్డీవో పురపాలక సంఘం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఆదివారం సంత వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని వారు అన్నారు. ఆదివారం సంత ఉండడం వల్ల వ్యాపారులకు సెలవు దినం లేకుండా పోయిందని, అందుకోసం బుధవారమే మార్చాలని వారు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, నిజాంసాగర్, గాంధారి ఆయా మండలాల్లో రోజువారీగా సంతలు జరుగుతున్నాయన్నారు. కేవలం బుధవారం మాత్రం జరగడం లేదని, ఎల్లారెడ్డిలో ఆ రోజు సంత నిర్వహించుకునేందుకు వ్యాపారులు ముందుకు వచ్చామన్నారు. ఆదివారం సంత వల్ల వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు పడు తున్నారు. ఇప్పటికైనా సకాలంలో స్పందించి బుధవారం సంస్థకు అనుమతించాలని వారు కోరు తున్నారు.