- ఎంబీసీ, బీసీ, దళిత సంఘాల నిరసన
నవతెలంగాణ-కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 34% శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతం తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్కు నిరసనగా శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంబీసీ, బీసీ, దళిత సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆర్డినెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.రామ్మో హన్రావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా ఎంబీసీ జాతీయ కో-కన్వీనర్ దండి వెంకట్, బీసీ సంఘాల నాయకుల బాస రాజేశ్వర్, కొయెడ నర్సింహులు, ఎం.రామ్మోహన్ చారి, సీపీఐ జిల్లా నాయకులు పి.సుధాకర్, దళిత నాయకులు ఎడ్లరాము, కె.రాజన్న, ఎంబీసీ నాయ కులు జె.సత్యనారాయణ, గోపి, వేముల రవి, వై.అనిల్ కుమార్, సాయిలు పాల్గొని మాట్లాడారు. 55 శాతం ఉన్న బీసీ జనాభాకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతా నికి తగ్గించడం, బీసీలకు రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులను కాలరాయడమేనని అన్నారు. బీసీ, ఎంబీసీ, సంచార జాతుల ప్రజలు ఐక్య కార్యాచరణకు సిద్ధ్ధం కాకపోతే రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వం రద్దుచేసిన ఆశ్చర్యం లేదన్నారు. రాజకీయ పార్టీలకుఅనుబంధాలను పక్కన పెట్టి బీసీ సమాజం ఉమ్మడి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Authorization