నవతెలంగాణ-రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేశారు. సాటాపూర్ సంత కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి, లైసెన్స్లు, హెల్మెట్ ధరించని వహనాదారులకు జరిమానాలు విధించినట్టు రెంజల్ ఎస్ఐ ఆర్.శంకర్ తెలిపారు. 30 వాహనాలను తనిఖీ చేసి సుమారు రూ.3100లను జరిమానా విధించినట్టు తెలిపారు. తనిఖీల్లో ఏఎస్ఐ రఫియోద్దీన్, కానిస్టేబుళ్లు శ్రీను, సాయికుమార్, తదితరులున్నారు.