అంతర్జాతీయ క్రీడల్లో ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు
నవతెలంగాణ-బోధన్ మండలంలోని అచన్పల్లి గ్రామంలో గల ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్లో జరి గిన అంతర్జాతీయ యువజన క్రీడోత్సవాల్లో పాల్గొని బహుమతులు సాధించారు. ఇంటర్నె షనల్ యూత్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో మనదేశం తరపున ఎంపికైన వాలీబాల్ జట్టులో పాఠశా లకు చెందిన భరత్చంద్ర, సమీర్ఖాన్ అనే విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నట్టు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్కుమార్ తెలిపా రు. ఫైనల్స్లో నేపాల్ జట్టుతో జరిగిన పోటీలో రన్నర్ఆప్గా నిలిచి విజయం సాధించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాపోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొ నడం తమకు గర్వకారణమన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ప్రధా నోపాధ్యాయులు రామారావ్, హాస్టల్ ఇన్చార్జి అశోక్రావ్, పీఈటీలు సంతోష్, శీనునాయక్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.