నవతెలంగాణ-కంఠేశ్వర్
రెండు రోజుల క్రితం నిర్వహించిన బీఎస ్ఎన్ఎల్ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూ నియన్ జెండా ఎగురవేసి విజయం సాధిం చింది. జిల్లాలో గుర్తింపు ఎన్నికల్లో ఈ సంఘం సెల్ఫోన్ గుర్తుతో ఎన్ఎఫ్టీ యూ 5 చేతులు కలిసిన గుర్తుతో పోటాపోటీగా ప్రచారం చేశా యి. ఈ నెల 16న ఓటింగ్ నిర్వహించగా బుధ వారం ఓట్ల లెక్కింపు జరిగింది. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్కు 178, ఎన్ఎఫ్ టీయూకు 161 ఓట్లు వచ్చాయి. బీటీటీయూకు 5, బీఎంఎస్కు రెండు ఓట్లు, బీఎస్ఎన్ఎల్ ఈసీకి ఒక ఓటు వచ్చింది. దీంతో జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్కి 4344 ఓటింగ్ శాతంతో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జెండా ఎగురవేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాములు, ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. కోశాధికారిగా సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.గంగారం గెలుపొందారు.
Authorization