నవతెలంగాణ-కమ్మర్పల్లి
మండల కేంద్రంలోని కమ్మర్పల్లి, ఉప్లూర్ గ్రామాల మధ్య రహదారి కిందుగా మాటు కాలువ ఉంది. రోడ్డుకు ఇరువైపుల మాటు కాలువపై కల్వర్టులను నిర్మించారు. మూడేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డుకు కుడివై పున ఉన్న కల్వర్టు కోతకు గురై, కల్వర్టు గోడలు విరిగి పడ్డాయి. బీటీ రోడ్డుపైన పడే వర్షపు నీరు నేరుగా కాలువలోకి ప్రవహించి ఆ సమ యంలో కల్వర్టు దిగువన గల పంట పొలాలు నీట మునిగాయి. భారీవర్షం మూలంగా నీటితో పాటు కాలువలోని ఇసుక ప్రక్కనే ఉన్న పోల ంలోకి వెళ్లి ఇసుక మేటలు వేశాయి. ప్పటి నుం చి కల్వర్టు మరమ్మతులు నోచుకోనే లేదు. దీంతో క్రమంగా కల్వర్టు రెండు వైపుల గోడల భాగం నుండి బిటి రోడ్డు అంచు వరకూ తరుచురోడ్డు కోతకు గురవుతూ వస్తోంది. ఈ కల్వర్టు వద్ద రాత్రి వేళల్లో ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురయ్యే అవకా శముంది. మూడు సంవత్సరాల క్రితం ధ్వంస మైన కల్వర్టు ప్రమాదాలకు ఆస్కారంగా మారిన పట్టించుకునే వారే కరువయ్యారు.
కమ్మర్పల్లి గ్రామ శివారులో ఉప్లూర్ వెళ్లే రోడ్డులో భూములు పల్లంగా ఉన్నందున వర్షపు వరద నీరు, పంట పొలాల నీరు మాటు కాలు వగుండా వేగంగా ఉప్లూర్ వైపు ప్రవహిస్తోంది. పదేండ్ల క్రితం కమ్మర్పల్లి శివారు గుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ నిర్మాణం జరిగింది. వరద కాలువ అడ్డుకావడంతో కమ్మర్పల్లి గ్రామంలోని వర్షపు వరద, పంట పొలాల నీరు దిగువకు ప్రవహించే మార్గం లేకపోవడంతో ఈ ప్రాంతాంలో పంట పొలాలు నీట మునిగి, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో వరద కాలువ కిందుగా అండర్ టన్నెల్ నిర్మిం చారు. ఈ టన్నెల్ గుండా బయటకు వచ్చే వరద నీరు మాటుకాలువ ద్వారా ఉప్లూర్ చెరువుకు వెళ్లేలా ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే ఈ కాలువ గుండా నీటి ప్రవాహం జోరుగా ఉంటుంది. రెండు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షంతో మరింతగా రోడ్డు కోతకు గురై పెద్ద గుంత ఏర్పడింది. రాత్రి వేళ వాహనదారులు ఏమరుపాటుగా వస్తే ఇక అంతే సంగతులు. కల్వర్టు ధ్వంసమై ఏండ్లు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టక పోవడంతో రహదారి గుండా వెళ్లే వాహన దారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
కూలిన గారడి కుంట అలుగు గైడ్ వాల్స్..
మండల కేంద్రం నుంచి మోర్తాడ్ మం డలం వడ్యాట్ వెళ్లేదారిలో ఉన్న గారడి కుంట(గాండ్ల చెరువు) అలుగు గైడ్ వాల్స్ బుధ వారం రాత్రి కూలిపోయింది. దీంతో వరద నీరంత పక్కనే ఉన్న పంట పోలాల్లోకి చేరడం తో పంటలకు నష్టం వాటిల్లింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం చెరువుల పునరుద్దరణలో భాగంగా ఫేస్-2లో గారడి కుంటను పునరుద్దరించారు. కేవలం 29 ఎకరాల ఆయకట్టు ఉన్న గారడి కుంటకు రూ.22లక్షల80వేలు ఖర్చు చేశారు. ఇందులో కట్ట బలోపేతం కోసం రూ.2లక్షల 22వేల 456 ఖర్చు చేశారు. తూము నిర్మాణం కోసం రూ.7లక్షల 31వేల 641 వెచ్చించారు. అలుగు మరమ్మతు కోసం రూ.3లక్షల 396, మాటు కాలువ మరమ్మతుకు రూ.2లక్షల 51వే ల677, పంట కాలువ మరమ్మతు కోసం రూ. 2లక్షల46వేల 648, కుంటలో పూడిక మట్టి తీయుటకు రూ.2లక్షల 63వేల 909 ఖర్చు చేశారు. మొదటి నుంచి గారడి కుంట పను లను సదరు కాంట్రాక్టర్ నాసీకరం పనులతో పూర్తి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ లకుబలం చేకూర్చే విధంగా రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు నిండు కుండల మారిన గారడి కుంట చెరువు అలుగు పారుతుంది. అయితే అలుగు ప్రవహం ఎక్కువగా ఉండ టంతో గైడ్ వాల్స్ కూలిపో యాయి. దీంతో అలుగు ద్వారా బయటకు వస్తున్న నీరంత గైడ్ వాల్స్ లేకపో వడంతో పక్కనే ఉన్న పంట పోలాల్లోకి చేరింది.నీటితో పాటు కుంటలోని చెత్త చెదారం మొత్తం పోలాల్లోకి వచ్చి చేరింది.
నాసిరకం పనుల వల్లే
గారడి కుంటను మిషన్ కాకతీయలో పునరుద్దరించిన కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనుల వల్లే అలుగు గైడ్ వాల్స్ కూలిపో యాయి. అలుగు నుంచి నీరంత పొలంలోకి చేరింది. కుంటలోని చెత్తచెదారం పొలంలోకి రావడంతో పంటకు నష్టం జరిగింది. సుమారు 30వేలకు వరకు వరిపంటకు నష్టం వాటిల్లింది. అధికారులు పంటను పరిశీలించి నష్టం పరిహరం ఇవ్వాలి. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి.
- సుంకెట రవి, రైతు
Authorization