- వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
- కామారెడ్డి జిల్లా డీఈవో రాజు
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
సమాజంలో గౌరవం పొందాలంటే విద్య వల్లనే సాధ్యమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. మంగళవారం చిన్నమల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అల్పాహార పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. చదువుకున్న వ్యక్తి ప్రతీ రంగంలో రాణిస్తారని అన్నారు. పదో తరగతి అనేది విద్యార్థుల జీవితంలో మొదటి మెట్టని తెలిపారు. దీంట్లో తడబడకుండాపైకి ఎక్కాలని, అంతిమంగా శిఖరం చేరే వరకూ శ్రమించాల్సి ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ప్రతీ విద్యార్థి కష్టపడి చదివి జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి వరుసలో వందశాతం ఉత్తీర్ణతలో ముందుంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ .... విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయక కమిషనర్ నీల లింగం మాట్లాడుతూ ... ఈ విద్యా సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ అనిలకుమారి, అల్పాహారధాతలు శంకర్, బెస్ట్ డెయిరీ క్వాలిటీ ప్రొడక్టు యాజమాని కామారెడ్డి వాసులు, సీఆర్పీ చిరంజీవి, బుచ్చిరెడ్డి, ప్రభాకర్, ఉమాదేవి, రాజ్యలక్ష్మి, సుశీల, రాము, ప్రబు, తదితరులు పాల్గొన్నారు.
Authorization