- 10 రోజుల పాటు రెండు తడులకు సాగునీరు - వృథా చేయొద్దు.. వినియోగించుకోండి : అధికారులు నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ/నిజాంసాగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని రేపటి (గురువారం) నుంచి విడుదల చేయనున్నారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి ఆదేశాల మేరకు రెండు తడులకు నీరు ఇచ్చేందుకు గాను 10 రోజుల పాటు సాగునీరు విడుదల చేయనున్నట్టు నీటిపారుదలశాఖ బోధన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ మధుకర్రెడ్డి మంగళవారం తెలిపారు. రబీ పంటలకు గాను రెండు తడుల నీరు ఇచ్చేందుకు 1200 క్యూసెక్కుల నీటిని విదుల చేయనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు-కాలువ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.802 టీంఎసీలు) కాగా, ప్రస్తుతం 1387.75 అడుగుల (3.208 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది.