ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామసర్పంచ్ జ్యోతిని జాతీయపతాకం ఎగురవేయకుండా అడ్డుకున్న ఘటనకు సంబంధించి మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో ఫిర్యా దు అంది వారం రోజులు దాటింది. అయినా ఫలితం లేదు. సాక్షాత్తూ జాతీయజెండా సాక్షిగా గ్రామసర్పంచ్గా ఉన్న మహిళకు జరిగిన అవ మానంపై జిల్లా అధికారులకు అనేక ఫిర్యాదులు, వినతిపత్రాలు అందా యి. అంతెందుకు రాష్ట్ర మానవహక్కుల కమిషన్కు కూడా పలువురు విద్యార్థిసంఘాలు నేరుగా కలిసి నవతెలంగాణ దినపత్రికలో వచ్చిన కథ నాన్ని చూపి మరీ లిఖితపూర్వక ఫిర్యాదుచేశారు. గ్రామమొదటి పౌరురా లుగా ఉన్న గిరిజన మహిళను అవమానించి కన్నీళ్లుపెట్టుకునేలా వ్యవ హరించిన ఘటనకు సంబంధించి స్పందించని అధికారులను కేవీపీఎస్, తదితర వివక్ష వ్యతిరేక సంఘాలన్నీ కూడా ఫిర్యాదు చేశాయి. ఘటన జరిగి దాదాపు పక్షం రోజులైనా కనీసం జిల్లా అధికారులు స్పందించకపో వడం బాధితులను అవమానికి గురిచేస్తోంది. డెబ్బైఏండ్ల స్వాతంత్య్రంలో ఇదేనా మాకిచ్చే గౌరవం అని వారు వాపోతున్నారు.
ఇటీవల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా సాక్షిగా వివక్షకు గురైన విషయం తెలిసిందే. దీనిపై నవతెలంగాణలో ప్రత్యేక కథ నం ప్రచురితమైనది. ఈకథనా నికి స్పందించిన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని వివిధ విద్యార్థిసంఘాల రాష్ట్ర నాయకులు పత్రికలో వచ్చిన కథనంతో మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుబ్రహ్మణ్యంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఓయూ వామపక్ష విద్యార్థి, మైనారిటీ, దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దళిత సర్పంచ్కు అవమానం కలిగించిన ఉపసర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్రవిచారణ జరిపించాలని జస్టిస్ సుబ్రహ్మణ్యంకు విన్నవించారు. డెబ్బైఏండ్ల స్వాతంత్య్రంలో సర్పంచ్లకు గ్రామాల్లో ఎదురవుతున్న వివక్షను హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థిసంఘాల నాయకులతో చర్చించిన చైర్మన్ ఈఘటనకు సంబంధించి ఖమ్మం జిల్లాకలెక్టర్ను విచారణకు ఆదేశిస్తానని హామీఇచ్చారని విద్యార్థిసంఘాల నాయకులు వెల్లడించారు. అయినా కనీసం విచారణ కూడా జరపడంలో అధికారు లు తాత్సారం చేస్తున్నారని బాధిత సర్పంచ్ జ్యోతి వాపోతున్నారు.
ఖమ్మం సీపీ, గ్రీవెన్స్లోనూ టీమాస్ ఫిర్యాదు...
తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం గ్రామసర్పం చ్ను వివక్షకు గురిచేసినట్టు వచ్చిన కథనంపై ఇటీవల టీమాస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరకమిషనర్ తఫ్సీర్ఇక్బాల్, గ్రీవెన్స్లో డీఆర్వో శివశ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా సర్పంచ్పై వివక్ష ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. పలుమార్లు తిరుమలాయపాలెం మండలంలో ఆందోళనలు చేపట్టారు. అయినా అధికారుల్లో చలనం లేదని వారు విమర్శిస్తున్నారు. అధికారు లు కూడా పెత్తందార్లకు ఎలాంటి ఇబ్బందిలేకుండా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇదేం న్యాయం...జ్యోతి-సర్పంచ్ దమ్మాయిగూడెం
ఒక సర్పచ్నైన నన్ను గ్రామస్తులందరి ఎదుటా అవమానించారు. ఇంత జరిగినా నాకు న్యాయం జరిగేలా చూడలేదు. అధికారులు కూడా వివక్షను పట్టించుకోలేదు. గిరిజనురాలునైనందునే నా ఆవే ధనను అధికారులు పట్టించుకోలేదు. దీనిపై న్యాయపోరా టానికైనా సిద్ధమే. ఇలాంటి ఘటనలపై అధికారులు పట్టిం చుకోకపోతే మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదముంది.
అధికారపార్టీకి అధికారులు తొత్తులు : నందిపాటి మనోహర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
గిరిజన సర్పంచ్ కన్నీళ్లుపెట్టుకున్నా అధికారులు స్పం దించలేదు. కేవలం అధికా రపార్టీ నేతలకు తొత్తులుగా మారారు. దీనిపై సమగ్రవిచా రణ జరిపించాలి. మాన వహ క్కుల కమిషన్కు ఫిర్యాదుచే సినా స్పందించకపోవడం విచారకరం.
- వనం నాగయ్యన
సెల్ : 9490099343
Authorization