దళితులకు కేటాయించిన భూమిపై రెండేండ్ల కింద గ్రామ పెత్తందారుల కన్ను పడింది. ఆ గ్రామంలో ఏ దళితుడికీ అర ఎకర, ఎకరాకు మించి భూమి లేదు. అలాంటి దళితుల ఆధీనంలో ఇంత భూమి ఎందుకని కక్షగట్టారు. ఆ భూమిని రంగనాయక గుడికి ఇచ్చేయ్యాలని పేచీ పెట్టారు. దీనికి దళితులు అంగీకరించలేదు. 'దొరగారు మా దళితుల కోసమే ఇచ్చారు. అది మా ఆధీనంలోనే ఉండాలి. మేం ఎవ్వరికీ ఇవ్వం' అని ఖరాకండీగా చెప్పారు. దీనిపై పెత్తందారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులందరినీ పిలిచి గ్రామ సభ నిర్వహించారు. ఇక్కడ కూడా దళితులు అదే విషయం చెప్పడంతో సమావేశం నుంచి దళితులను వెళ్లగొట్టారు. ఆ తర్వాత పెత్తందారులంతా కలిసి దళితులను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్టు తీర్మానం చేసుకున్నారు. వారితో మాట్లాడితే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని కూడా ప్రకటించుకున్నారు.
కులం కట్టుబాట్లతో హేళన చేస్తే ఎట్లా ఉంటుంది. మేం మీ పక్కన కూర్చోలేం. అందుకే వెళ్లిపోతున్నాం.. అని మొహం మీదే చెప్పేస్తే ఎంత అవమానకరంగా అనిపిస్తుంది. రెక్కాడితే కాని డొక్క నిండని ఆ బడుగు జీవులను ఇక నుంచి పనులకు పిలవకూడదని కట్టుబాటు పెట్టుకున్నాం.. అని ఊరంతా పనుల్లో మునిగినా ఆ కులం వాళ్లకు పని లేకుండా ఇంటికే పరిమితం చేస్తే వాళ్ల పరిస్థితి ఏమిటి?. ఇదంతా ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా నాలుగు నెలలుగా కొనసాగుతున్నది. ఇదంతా చదువుతుంటే ఇదేదో వందేండ్ల కింది ఘటన అనుకుంటే పొరపాటే. స్వాతంత్య్రం వచ్చి 70 వసం తాలు ఇటీవలే పూర్తి చేసుకున్న దేశంలోనే.. కొత్త రాష్ట్రం కొత్త కొత్త ఆశలతో అభివృద్ధి వైపు మరింత ముద్దుగా చెప్పాలంటే బంగారు తెలంగాణ వైపు కలలు కంటున్న మన రాష్ట్రంలోనే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. చివరికి ఇటీవల నిర్వహించిన వినాయక ఉత్సవాల్లో నిమజ్జనానికి ట్రాక్టర్ కిరా యికి ఇచ్చేందుకు కూడా ఆ ఆధిపత్య కులాల వారు నిరాకరించా రు. ఇంత బహిరంగ కుల బహిష్కరణ కు గురైన గ్రామమే మంథని.
అసలేం జరిగింది
వందల ఏండ్లుగా ఆ గ్రామంలో దళితులు దొరలకు ఊడిగం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ఉధృ తమైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో దొరల ఆధిపత్యం తగ్గిపోయింది. కానీ వారికి సంబంధించిన భూములు చా లా వరకు వారి ఆధినంలోనే ఉన్నాయి. కానీ దొరలు గ్రామాల్లో ఇమడలేక పట్ట ణాలకు వలసపోయారు. ఈ క్రమంలోనే మంథని గ్రామానికి చెందిన దొర కూడా తన భూములను క్రమంగా అమ్మేసుకుంటూ వచ్చారు. ఈనేపథ్యంలో తాము మా తాత, ముత్తాతల నుంచి తమరికి సేవ చేశాం. మా కూ ఏదైనా సాయం చేయండని దొర ను ఆ గ్రామ దళితులు వేడుకున్నారు. దీంతో దామోదర్రెడ్డి ఊరి చివరన రంగనాయక గుడి పక్కన ఉన్న 32 ఎకరాలను ఇరవై ఏండ్ల కింద గ్రామ దళితులకు కేటాయించారు. ఇక అప్పటి నుం చి ఆ భూమిలో దళితులే పశువులను మేపుకోవడం వంటి పనుల కు ఉపయోగించుకుంటున్నారు. ఈభూమిని పట్టా చేసుకోవాల ని ఎన్నో సార్లు దళితులు ప్రయత్నిం చినా కుదరలేదు. 'నేను ఆ భూమిని మీ రెండు కులాలకు ఇచ్చాను. తిరిగి అడుగుతాను రా..' అంటూ దొర వారికి భరోసా ఇచ్చారు. ఆ ధీమాతోనే మాల, మాదిగలు పట్టా విషయం పెద్దగా పట్టించుకోలేదు. అదే నేడు అతిపెద్ద తప్పిదంగా మారింది. ఈ భూమిపై రెండేండ్ల కింద గ్రామ పెత్తందారుల కన్ను పడింది. ఆ గ్రామంలో ఏ దళితుడికీ అర ఎకర, ఎకరాకు మించి భూమి లేదు. అలాంటి దళితుల ఆధీనంలో ఇంత భూమి ఎందుకని కక్షగట్టారు. ఆ భూమిని రం గనాయక గుడికి ఇచ్చేయ్యాలని పేచీ పెట్టారు. దీనికి దళితులు అంగీకరిం చలేదు. 'దొరగారు మా దళితుల కోసమే ఇచ్చారు. అది మా ఆధీనంలోనే ఉండాలి. మేం ఎవ్వరికీ ఇవ్వం' అని ఖరా కండీగా చెప్పారు. దీనిపై పెత్తందారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులందరినీ పిలిచి గ్రామ సభ నిర్వహించారు. ఇక్కడ కూడా దళితులు అదే విషయం చెప్పడంతో సమావేశం నుంచి దళితులను వెళ్లగొట్టారు. ఆ తర్వాత పెత్తందారులంతా కలిసి దళితులను గ్రామ బహిష్కరణ చేస్తున్నట్టు తీర్మానం చేసుకున్నారు. ఇక్కడి నుంచి గ్రామ పెత్తందారులకు కులగజ్జి లేసి దురదగా మారి రోజురోజుకూ పెరుగుతున్నది.
ఆ గ్రామంలో దళితులే అధికం... భూమిలో కాదు
ఆ గ్రామంలో ఐదువేల మంది జనాభా. 2200మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 135 కుటుంబాలు, 450మంది ఓటర్లు మాల, మాదిగలున్నారు. అగ్రకుల పెత్తందారులు 350మంది ఓటర్లు ఉన్నారు. వీరు చెప్పిందే ఈ గ్రామంలో వేదంగా మారింది. ఇక్కడ విచిత్రమేమంటే సర్పంచ్, ఎంపీటీసీలు ఎస్సీలే, అందున అధికార పార్టీకి చెందినవారే అయినా వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. పెత్తందారులను ధిక్కరిస్తే అధికారిక పనులకు ఆటంకం కలిగించటం, చేసిన పనులకు బిల్లులు రాకుండా అడ్డంకులు సృష్టించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. దళితులు ప్రజాప్రతినిధులైనా గ్రామంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లోనూ ఆధిపత్య కులాలదే పెత్తనం. వారు కూర్చోమంటేనే ప్రజాప్రతినిధులు కూర్చోవాలి. వెళ్లమంటే వెళ్లిపోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే వారి చెప్పుచేతుల్లోనే ప్రజాప్రతినిధులుగా ఉన్న దళితులు కీలుబొమ్మల్లా పనిచేస్తున్నారు. ఆనాడు దొర కేటాయించిన 32 ఎకరాల్లో ఇటీవల కొలిస్తే 17 ఎకరాలే ఉంది. మిగతాదంతా రంగనాయక గుడి కోసమంటూ ఈ 20 ఏండ్ల కాలంలో కబ్జా చేస్తూ వచ్చారు. అయినా దళితులు దీనిపై పేచీకి వెళ్లలేదు. ఉన్నదైనా సక్రమంగా ఉంటే చాలని భావిస్తున్నారు. కానీ పెత్తందారులు అంత భూమి దళితులకు ఎందుకిచ్చారని దామోదర్రెడ్డిపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఆయన ఇటీవలే గ్రామానికి వచ్చి ఆ భూములకు హద్దులు కూడా చూపించి వెళ్లారు. 'మీరు పట్టాలు చేసుకోండి. నేను వచ్చి సంతకం పెడతా' అంటూ దళితులకు ధైర్యం చెప్పి వెళ్లారు. దీంతో గత నాలుగు నెలల నుంచి దళితులు మాల, మాదిగల అభివృద్ధి కమిటీల పేరుతో ఏర్పడిన సొసైటీల పేర పట్టా కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దసరాకు పట్టాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ పెత్తందారులు గ్రామ దళితులను వేధిస్తున్నారు.
కోరలు చాచిన కుల బహిష్కరణ
ఈ భూమి విషయంలో పెత్తందారులు దళితులపై కక్షపెంచుకున్నారు. సామూహికంగా మాల, మాదిగలను గ్రామ బహిష్కరణ చేశారు. 'దళితులతో ఎవరూ మాట్లాడకూడదు. వారి పక్కన కూర్చోకూడదు. వారిని పనులకు పిలవకూడదు. వారితో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు.. ఈ నిబంధనలు ఎవరు ధిక్కరించినా రూ.వెయ్యి జరిమానా విధించాలి..' అని కట్టుబాట్లు పెట్టుకున్నారు. దీనిపై నాలుగు నెలల కిందటే దళితులు పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే పనులు లేక దళితులు అతలాకుతలం అవుతున్నారు. పనులకు పిలవకపోవడం వల్లనే దళితులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క దళితుల భూముల్లో కోతలకు కూడా వారు కోత మిషన్లు పంపించడం లేదు. దున్నకానికి ట్రాక్టర్లు కూడా బంద్ చేశారు. ఇటీవల వినాయక నిమజ్జన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామంలో పెత్తందారులకు మాత్రమే ట్రాక్టర్లు ఉన్నాయి. దళితులు ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనానికి ట్రాక్టర్ అద్దెకు తీసుకునేందుకు వెళ్లగా ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో పక్క గ్రామం నుంచి తీసుకొచ్చి నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. వినాయక ఉత్సవాల సందర్భంగానూ ఆధిపత్య కులాలకు చెందిన యువకులు ఎస్సీలు ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చి ఖాళీ గాజు సీసాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు.
పట్టాలిచ్చేందుకు జంకుతున్న తహశీల్దార్
గత శుక్రవారం గ్రామ దళితులమంతా పట్టాల విషయం చర్చించేందుకు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లార. దసరాకు పట్టాలు తీసుకునేందుకు డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని కోరార. కానీ తనకు పైనుంచి (గ్రామ పెత్తందారులతోపాటు ఎమ్మెల్యే నుంచి కూడా..) ఒత్తిడి పెరుగుతోందని తహశీల్దార్ మదనపడుతున్నారు. పట్టా చేయవద్దని చాలామంది తనపై ఒత్తిడి తెస్తున్నారని మాకు స్వయంగా తహశీల్దారే చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం.
కోర్వ రాజు, బాధిత గ్రామస్తుడు
- ఓగోటి కిరణ్కుమార్
సెల్ : 9666011107
Authorization