తెలంగాణ రాష్ట్రం రాలేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముఖ్యమంత్రి కాలేదు. అప్పుడే కేసీఆర్కు అండగా నిలబడి అక్కున చేర్చుకున్న, అదరించి అన్నం పెట్టిన దళితవాడను ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోయారు. నాడు కేసీఆర్ రాక కోసం దళితవాడంతా ఎదురు చూసి వాడవాడలా పండుగ చేశారు. మా గ్రామానికి ఉద్యమ నాయకుడు వస్తున్నాడని చిన్నా, పెద్ద మొత్తం కలిసి కేసీఆర్కు బ్రహ్మర థం పట్టారు. వారే ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం పర్టూరు దళితవాడ ప్రజలు.
ఓ వైపు దళితుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని పాలకులు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా దళితులపై దాడులు అగడం లేదు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని అత్యంత పేదలు జీవనం సాగించే ప్రాంతమైన అంబేద్కర్నగర్కు చెందిన తాళ్లపల్లి యాదగిరి (67), అతని భార్య ఎల్లమ్మ, కొడుకు వెంకటేష్, కోడలు సరితా వారి ఇద్దరు పిల్లలతో కలిసి సూమారు 60 గజాల ఓ చిన్న రేకుల షెడ్డులో నివాసముంటున్నారు. కొన్ని అర్థిక ఇబ్బందుల వల్ల తాము నివాసముంటున్న ఇంటిని విక్రయించేందుకు అదే ప్రాంతంలో ఉండే పెద్ద మనిషి టి.శ్రీశైలంకు ఆమ్మకానికి పెట్టి రూ.లక్ష నగదును అడ్వాన్స్గా తీసుకున్నారు. అయితే కుటంబ సభ్యులంతా కలిసి ఉన్న ఇంటిని ఆమ్ముకొని చిన్న పిల్లలను పట్టుకొని ఎక్కడ ఉంటామని అలోచన చేసి ఇంటిని అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే సదరు ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన శ్రీశైలంకు అదే విషయం చెప్పడంతో అతను ససేమీర అన్నారు. దీంతో ఈ విషయం కాస్త పోలీస్స్టేషన్, అక్కడి నుండి కోర్టు వరకు వెళ్లింది. దీంతో స్థానికంగా ఉండే పెద్ద మనుషులు ఇరువర్గాలను కూర్చోబెట్టి ఇంటి కొనుగోలుకు అడ్వాన్స్గా ఇచ్చిన శ్రీశైలం యాదవ్కు ఇచ్చిన రుపాయాలకంటే అదనంగా కొన్ని డబ్బులు కలిపి ఇవ్వాలని నిర్ణయించి, ఆ డబ్బును సూమారు 6 నెలల్లో చెల్లించాలని ఒప్పందం చేశారు.
తాగొచ్చి దాడి
పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిరిన ఆనంతరం ఆ గొడవ అంతటితో ముగిసిందని అనుకున్నారు. యాదయ్య అతని కుటుంబ సభ్యులు మామూలుగా తమ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం కురుస్తుండగా యాదయ్య అతని భార్య, కోడలు ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు. యాదగిరి కొడుకు వెంకటేష్ డ్యూటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన శ్రీశైలం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలనీ, లేనిపక్షంలో చంపుతామని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా దాడి చేసి ఇంట్లోని సామాన్లు, ఇతర వస్తువులు, ఆహార పదార్థాలను బయట పడేసి నానా బీభత్సం సృష్టించారు. యాదగిరి కోడలు సరితపై భౌతిక దాడి చేశారు. జరిగిన ఘనటపై భయభ్రంతులకు గురైన వారు స్థానిక మేడిపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసుకొని రిమాండ్కు తరలించారు.
అక్కడ వలసొచ్చిన వారే అధికం
బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్నగర్, దేవేందర్నగర్, రాజీవ్నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో చాలామందికి అప్పటి ప్రభుత్వం 60 గజాల చొప్పున ఇండ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే సదరు ప్రాంతంలో చాలా వరకు ఇతర ప్రాంతాల నుండి బతుకుదెరువు కోసం వచ్చిన వారు ఇంటి కిరాయిలు కట్టలేక అప్పు చేసి మరీ 60 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేసి చిన్న రూములు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే అలా ఇంటి నిర్మాణం నుండి దాంట్లో నివాసం ఉండే వరకు స్థానికంగా పెద్ద మనుషులుగా చెప్పుకునే కొంతమంది డబ్బులు వసూళ్లు చేయడం, ఇయ్యని వారిపై దౌర్జన్యాలు చేయడం పరిపాటిగా మారింది. స్థానిక పోలీసులు కూడా పేదల మాటను వినకుండా పెద్దల మాటే వినడంతో అక్కడి ప్రజలు కిమ్మనకుండా గుట్టుగా జీవిస్తున్నారు.
మా ప్రాణాలకు ప్రమాదముంది
అప్పు కట్టాలని ఇంటిపై దాడి చేశారు. మా కుటుంబంపై దాడి చేసిన వారిని అరెస్టు చేశారు కానీ వారి నుండి ఎప్పటికైనా మాకు ప్రమాదం ఉంది. ఈ విషయంలో పోలీసులు మాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి. మాకే కాదు, మా ప్రాంతంలో వీరి ఆగడాలు అధికమయ్యాయి. వారి నుండి మాకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలి.
- సరిత, బాధితురాలు
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
బోడుప్పల్ పరిధిలో వీకర్ సెక్షన్ కాలనీల్లో చాలా వరకు పేదలే నివాసముంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. చాలా వరకు బయటకు పొక్కకుండా స్థానిక నాయకులే వాటిని పరిష్కారం చేయడంతో పోలీస్స్టేషన్ వరకు రాలేదు. అయితే బోడుప్పల్ అంబేద్కర్ నగర్లో యాదగిరి అనే దళిత కుటుంబంపై అదే ప్రాంతంలో ఉండే స్థానిక నాయకుడు శ్రీశైలం దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించి దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సదరు ప్రాంతంలో పేదల నుండి అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
- కర్రె జంగయ్య, కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా నాయకులు
- కల్కూరి ఎల్లయ్య
సెల్ : 8179190156
Authorization