ఓ దుర్ఘటనలో ఒకే గ్రామానికి చెందిన 15మంది మృతి చెందారు. ఇది ఊహించని సంఘటన. కష్టం చేసి జీవించే నిరుపేదలు పని కోసం ట్రాక్టర్లో బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబాలు చిన్నాబిన్న మయ్యాయి. ఈ దుర్ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చలించిపోయారు. అయ్యోపాపం అంటూ ఆందోళన చెందారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలపై కనీసం కనికరం చూపలేదు. పరిహారం ప్రకటించేందుకు కూడా వెనుకాముందు ఆడింది. పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో కొంత ఓదార్పు హామీలిచ్చినా అవి ఇంతవరకూ పూర్తిగా అమలు కాలేదు. ప్రభుత్వం ఆ గ్రామ బాధిత కుటుంబాలపై ప్రభుత్వం వివక్ష చూపుతుందనేందుకు నిదర్శనంగా మారింది.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేముల కొండ గ్రామంలో దేశాన్ని కలచివేసే సంఘటన జరిగింది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. గత జూన్ 24న వేములకొండ గ్రామాని కి చెందిన 33 మంది వ్యవసాయ కూలీలను కౌలు, వ్యవసాయ పనులు చేస్తున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మిపు రం గ్రామానికి చెందిన అలూరి వెంకట నారాయణ చేనులో పత్తి గింజలు నాటేందుకు ఉదయం 9.30గంటలకు తన ట్రాక్టర్లో ఎక్కించుకొని బయలుదేరాడు. బయలుదేరిన పది నిమిషాల్లోనే ఊహించని సంఘటన జరిగింది. వెంకటనారాయణ ట్రాక్టర్ ఇంజన్ మీద కూర్చున్న వారితో ముచ్చటిస్తూ అజాగ్రత్తగా వ్యవ హరించడంతో రోడ్డు పక్కనే ప్రవహిస్తున్న ఆసీఫ్నగర్ కాల్వలో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో గ్రామంలోకి పెద్ద అరుపులు వినిపించాయి. కాల్వ బయటపడ్డ కాడిగల్ల మనీషా, కాడిగల్ల అఖిలలు అరుపులు, ఏడుపులతో గ్రామంలోకి పరుగులు తీశారు. అప్పటికే ట్రాక్టర్ కింద పడిపోయిన 14 మంది కూలీలు, ఒక బాలుడు చనిపో యారు. గ్రామ ప్రజలు అక్కడకు చేరుకొని చనిపోయిన వాళ్లను బయటికి తీశారు. డ్రైవర్ వెంకట నారాయణ సురక్షితంగా బయ టపడి తప్పించుకొని పారిపోయా రు. మిగతా 18 మందిలో కొంతమందికి కాళ్లు, చేతులు విరిగా యి. కొద్దిమందికి దెబ్బలు తగిలాయి. చనిపోయిన వారిలో 1.కాడిగల్ల లక్ష్మి తండ్రి లింగయ్య, 2. లక్ష్మి కూతురు కాడ ిగల్ల మానస, 3. సుంచు నర్మద, 4. పంజాల భాగ్య మ్మ, 5.ఎనుగుల మాదరి, 6.బీను కవిత, 7.ఇం జమూరి నర్స మ్మ, 8.ఇంజమూరి శంక రమ్మ, 9.బందారపు స్వరూప, 10.గన్నెబో యిన అండాలు, 11.జక్కుల మారెమ్మ, 12.అరూ రి మణె మ్మ, 13.అంబాల రాములమ్మ, 14.జక్కుల శకుంతల, 15.శకుంతల కొడుకు మల్లికార్జున్ ఉన్నారు.
వీరి మృతదేహాలను గ్రామం లోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రా నికి తరలించి అక్కడే పోస్టుమా ర్టం చేశారు. గాయపడిన వా రందరినీ రామన్నపేట ఏరి యా ఆస్పత్రికి తరలించా రు. మృతుల కుటుంబాలు, స్థానికులు, పలు రాజకీయ పార్టీల నాయకులు అక్కడికి చేరుకొని మృతుల కుటుం బాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, డబు ల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చే యాలని, మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యో గం ఇవ్వాలని డి మాండ్ చేస్తూ ధర్నాకు దిగా రు. ఈ పరిస్థితుల్లో అక్కడి కి చేరుకున్న రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డిని అడ్డుకు న్నారు. మొదట మంత్రి తన బాధ్యతను విస్మరి స్తూ, సంఘటన స్థలాన్ని పరిశీలించి చెబుతానం టూ, మరోవైపు నోరుజా రి ''వీరైమైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారా? రూ.లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు'' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అతడిపై ప్రశ్నల వర్షం కురిపించిన విలేకర్లను సైతం ''మీకేమీ పనిలేదా'' అంటూ చీద రించుకున్నారు. రూ.ఒక లక్ష ఇస్తాం అంతే అంటూ మొండికేశారు. కానీ గ్రామ యువకులు చైతన్యం గా వ్యవహరించి మంత్రి నుంచి గట్టి హామీ వచ్చే వరకు కదలనివ్వలేదు. దీంతో కం గుతిన్న మంత్రి జగదీష్రెడ్డి చని పోయిన వారి కుటుంబ సభ్యుల తో సమావేశం పెట్టి ''మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇప్పుడైతే మేం ఇచ్చినదానికి ఒ ప్పుకోవాలం''టూ బతిమిలాడారు. తీ వ్రమైన దు:ఖంతో ఉన్న మృ తుల బంధువులకు అక్కడు న్న స్థానికులు, బాధితుల బం ధువులు, వివిధ రాజకీ య పార్టీల నాయకులు మద్దతు గా నిలిచారు. మ ంత్రి ప్రతి పాదనకు ఒప్పు కోలేదు. స్థానిక యు వకులు ఆగ్ర హించారు. వలయ ంలా మారి జగదీష్రెడ్డిని వెళ్లకుండా అడ్డుకు న్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కుటుంబానికి రూ.లక్ష చొప్పున, ప్రభుత్వం నుం డి రూ.2లక్షల చొప్పున అన్ని కుటుంబాలకు డబు ల్ బెడ్రూం ఇండ్లు కట్టి ఇస్తామని, రూ.50 వేలు ఆప ద్బాంధు స్కీం కింద ఇప్పి స్తామని ప్రకటించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అక్కడున్న వారు ఒప్పుకోక తప్పలేదు. కానీ ఇంత పెద్ద సంఘట నలో మంత్రి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అక్కడున్న ప్రజలను తీవ్ర దిగ్బాం తికి గురిచేసింది. జిల్లా మంత్రిగా ఉన్న ఒక మంత్రి బాధితులకు పరిహారం చెల్లించడంలో వ్యవహ రించి న తీరు సరైనది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత దుర్ఘటనల్లోనూ, అంతకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదాల్లోనూ ప్ర భుత్వం తక్షణమే ఐదు నుంచి ప ది లక్షల వరకు పరిహారం ప్రకటి చింది. కానీ ఈ గ్రామంలో ఒకేసా రి చనిపోయిన 15 మందికి పరి హారం ప్రకటించడంలో ప్రభుత్వం వివక్ష, కుట్రపూరితంగా వ్యవహ రించిందని పలువులు, మేధావు లు, నాయకులు, స్థాని కులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే కుటుంబం నుండి చని పోయిన కాడిగల్ల లక్ష్మి, మానసల కు పరిహారం విషయంలో ప్రభు త్వం, జిల్లా, మండల యంత్రాం గం చాలా ఇబ్బందికి గురిచేసింది. తల్లీ కూతుళ్లు ఇద్దరు చనిపోతే ఒక్కరికే మొదట పరిహారం ఇచ్చింది. దీనిపై బీఎల్ఎఫ్ స్పందించి కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తే తిరిగి ఇద్దరికీ చెల్లించిన పరిస్థితి. కట్టిస్తామన్న డబుల్ బెడ్రూం ఇండ్లు ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు.
పరిహారం చెల్లింపులో వివక్ష చూపొద్దు
ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన వ్యవసాయ కూలీలు 15 మందికి పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చనిపోయిన వారంతా పేదలే. దళితులు, బీసీలున్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం సరైన భరోసా ఇవ్వలేకపోయింది. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన వారికి ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి ఇక్కడి వారిపై వివక్ష చూపుతున్నారు. ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పింది. మూడు నెలలు గడిచినా అతీగతీ లేదు. వ్యవసాయ కార్మికులకు పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. చనిపోయిన వారిలో నలుగురు దళిత కుటుంబాల వారున్నారు. వారికి 3 ఎకరాల భూమి పథకం కింద భూమి కేటాయించి, మిగతా భూమి లేని ఇతర పేదలకు కూడా భూ పంపిణీ చేయాలి. ప్రభుత్వం పాక్షిక పరిహారం చెల్లించింది. వెంటనే గ్రామాన్ని ముఖ్యమంత్రి సందర్శించి బాధితులకు తగు న్యాయం చేయాలి. బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి.
- వేముల మహేందర్, బీఎల్ఎఫ్ భువనగిరి పార్లమెంటరీ నాయకులు
- సిర్పంగి స్వామి
సెల్ : 9848094327
Authorization