ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం-1989 ప్రకారం కేసు నమోదైతే తక్షణమే ఎవ్వరినీ అరెస్ట్ చేయకూడదనీ, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపి, ఆరోపణల్లో నిజా, నిజాలు తెలుసుకున్న తర్వాతనే వారిని అరెస్ట్ చేయాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత డిపార్ట్మెంట్ పెద్దల అనుమతి పొందిన తర్వాత మాత్రమే అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఆయుధంగా చేసుకొని కొందరు దళిత ఉద్యోగులు తప్పుడు కేసులతో బెదిరిస్తూ, విధి నిర్వహణలో అడ్డు తగులుతున్నారనీ, అమాయకులైన అగ్రవర్ణాల ఉద్యోగులను, పౌరులను వేధిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయనీ ధర్మాసనం పేర్కొనడం అత్యంత దారుణం. ఇది న్యాయమూర్తుల నైతికతకు నిదర్శనం. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ! ''మేం చట్టంలో ఒక్క పదం చేర్చలేదు, ఒక్క పదాన్ని కూడా తొలగించలేదు. కేవలం ముందస్తు అరెస్టులు చేయరాదు, బెయిల్స్ ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పాం'' అంటున్నారు. చట్టంలో అన్ని అంశాలు పొందుపరచబడి ఉన్నప్పుడే ప్రభుత్వాలు దళిత, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న దుస్థితిలో ఉంటే, ఇక అరెస్టులు, బెయిల్స్పై సడలింపు ఇస్తే దళితులపై దాడులు జరగవనే హామీని న్యాయస్థానాలు ఇవ్వగలవా?
''ఏ పోరాటంలో అయినా నిమ్నజాతులు, అణగారిన వర్గాలు ఒకవైపు ఉంటే హిందువులలోని అగ్రకులాలవారు మరోవైపు ఉన్నప్పుడు పోలీసు బలగం మొత్తం ఎప్పుడూ హిందూ నియంతృత్వ మెజారిటీతోనే జతకడుతుంది. ఎందుకంటే అటు పోలీసుల్లోగాని ఇటు న్యాయవ్యవస్థలోగాని నిమ్నజాతులకు అస లు స్థానమంటూ లేకపోవడమే'' అన్నారు డా|| బాబాసాహెబ్ అంబేద్కర్. 1928లో చెప్పిన ఈ మాటలు సరిగ్గా 90 ఏండ్ల తరువాత మార్చి 20, 2018న భారతదేశ అత్యున్నత న్యాయస్థా నం సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టంపై 89 పేజీలతో ఇచ్చిన తీర్పు పైమాటలను నిరూపించింది.
ఈ దేశంలో కొన్ని వేల సంవత్స రాలుగా కులవివక్షకు గురవుతూ ఎన్నో దాడులకు, ఊచకోతలకు, సజీవ దహనాలకు బలై నిమ్నజా తులు చేసిన అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం. ఇప్పటికీ నిమ్నజాతులు ఏ విధంగానైతే వివక్షకు గురవుతు న్నారో ఎస్సీ, ఎస్టీల కోసం రూపొ ందించిన చట్టాలు కూడా అదే వి వక్షను ఎదుర్కొంటున్నాయి. ఇందుకు ఉదా హరణే 20 మార్చి 2018న సుప్రీంకోర్టు ఇద్ద రు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు.
1950లో రాజ్యాంగం జాతికి అందిం చిన ఆర్టికల్ 17తో సంక్రమించిన అధికరణ ద్వారా ''అంటరానితనం నేరం'' దాన్ని స మూలంగా నిర్మూలిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చేపట్టిన ఏ చర్యలు, ఎక్కడా అం టరానితనాన్ని పోగొట్టలేదు. పాలకులు రా జ్యాంగం సాక్షిగా ప్రకటన చేసినప్పటికీ దళిత, గిరిజనులపై దాడులు, దుర్మార్గాలు ఆగలేదు. దేశంలో అనేక దళిత, గిరిజన జాతుల పోరా టాలకు దిగొచ్చిన ప్రభుత్వాలు 1955లో మొ ట్టమొదటిసారి అంటరానితనం-నేరాలు అనే చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం కూడా దళితులపై కొనసాగుతున్న వివక్షను రూ పుమాపలేకపోయింది.అందుకోసం 1976 లో ''పౌరహక్కుల రక్షణ చట్టం'' తెచ్చారు. అ యినప్పటికీ దళిత, గిరిజనులపై దాడులు ఆగ కపోగా మరింత పెరిగాయి. ఇది గమ నించిన ప్రభుత్వాలు 1989లో మరో చట్టాన్ని తీసుకొ చ్చింది. అదే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం -1989.
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం-1989కి సంబంధించి ఈ చట్టం కింద కేసు నమోదైతే తక్షణమే ఎవ్వరినీ అరెస్ట్ చేయకూడదనీ, కనీసం డీఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక విచారణ జరిపి, ఆరోపణల్లో నిజా, నిజాలు తెలుసుకున్న తర్వా తనే వారిని అరెస్ట్ చేయాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో అయితే వారి సంబంధిత డిపార్ట్మెంట్ పెద్దల అనుమతి పొందిన తర్వాత మాత్రమే అరెస్టు చేయాలని తేల్చిచెప్పింది. ఎ స్సీ, ఎస్టీ చట్టాన్ని ఆయుధంగా చేసుకొని కొందరు దళిత ఉద్యో గులు తప్పుడు కేసులతో బెదిరిస్తూ, విధి నిర్వహణలో అడ్డు తగు లుతున్నారనీ, అమాయకులైన అగ్రవర్ణాల ఉద్యోగులను, పౌరు లను వేధిస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయనీ ధర్మాసనం పేర్కొనడం అత్యంత దారుణం. ఇది న్యాయమూర్తుల నైతికతకు నిదర్శనం. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ! ''మేం చ ట్టంలో ఒక్క పదం చేర్చలేదు, ఒక్క పదాన్ని కూడా తొల గించలేదు. కేవలం ముందస్తు అరెస్టులు చేయరాదు, బెయిల్స్ ఇవ్వచ్చు అని మాత్రమే చెప్పాం'' అంటున్నారు. చట్టంలో అన్ని అ ంశాలు పొందుపరచబడి ఉన్నప్పుడే ప్రభుత్వాలు దళిత, బల హీనవర్గాలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న దుస్థితి లో ఉంటే, ఇక అరెస్టులు, బెయిల్స్పై సడలింపు ఇస్తే దళితులపై దాడులు జరగవనే హామీని న్యాయస్థానాలు ఇవ్వగలవా?
అట్రాసిటీ కేసుల్లో అగ్రవర్ణ ముద్దాయిల హక్కుల గురించి మాట్లాడుతున్న కోర్టులు, దేశంలో దళితులపై పెరిగిపోతున్న నేరాల గురించి ఏ ఒక్క సందర్భంలోనూ కనీసం స్పందించక పోవడం ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాలి. చట్టంలో ఏ మార్పు చేయలేదని కోర్టు వ్యాఖ్యానిస్తూనే చట్టంలోని కీలకమైన అంశాలపై మినహాయింపునివ్వడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడంగాక మరేమవుతుంది.
''1977 నాటి (ఎమర్జెన్సీ) అత్యవసర పరిస్థితులను ఉదాహరిస్తూ ఎమర్జెన్సీ వల్ల ఒక వ్యక్తి అరెస్టయ్యాడు లేదా చట్టం చర్య తీసుకోవలసి వచ్చిన సందర్భంలో కూడా ఎవరైనా కోర్టుకు వస్తే వారికి నేరుగా బెయిల్ మంజూరయ్యేది. ఎమర్జెన్సీ కాలంలోనే అలాంటి వెసులుబాట్లు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో ఎందుకు ఉండకూడదు'' అని మార్చి 20, 2018న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై వివాదాస్పదమైన తీర్పునిచ్చి జూలై 6, 2018న ''పదవీ విరమణ'' చేసిన ఆదర్శకుమార్ గోయల్ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి)కు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్వారు ఇచ్చిన వీడ్కోలు సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. సరే! కొద్దిసేపు ఆయన మాటలతోనే ఏకీభవిస్తున్నాం అనుకుందాం! భారతదేశ స్వాతంత్య్రానంతరం 70 ఏండ్లు గడిచిన చరిత్రను చూస్తే ఏనాడైనా దళితులు అగ్రవర్ణాలపై మూకుమ్మడి దాడులు చేశారా? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలలో అగ్రవర్ణాల ప్రజలకు ఎమర్జెన్సీ తలపించే విధంగా ప్రాథమిక, మౌలిక హక్కులకు భంగం కలిగిందా? అగ్రవర్ణాల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన సందర్భాలను కోర్టు తీర్పులో ఎందుకు ఉదహరించలేదు? అటువంటి సంఘటనలను పత్రికలు ఎందుకు ప్రచురించలేదు. అదే దళితులపై జరిగిన వేలకొలది మూకుమ్మడి దాడులు, సజీవ దహనాలు, మారణకాండలను దేశంలో ఉన్న దినపత్రికలన్నీ పతాక శీర్షికన ప్రచురించిన కథనాలు ఈ ధర్మాసనాలకు ఎందుకు గుర్తుకురావు. భారతదేశంలో దాదాపు 98 శాతం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు అన్ని అగ్రవర్ణాల యాజమాన్యాల వారివే. అగ్రవర్ణాల ప్రజలపై దళితులు చేసిన దాడులుగాని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులవల్ల ఎమర్జెన్సీని తలపించే విధంగా జరిగిన సంఘటనలను ఏ ఒక్క పత్రికలో ప్రచురించలేదు. అటువంటి సంఘటనలే సంభవించనప్పుడు పత్రికలు ఏ విధంగా ప్రచురిస్తాయి. అంటే దీనిని బట్టి మీడియాకు ఉన్న వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలు న్యాయస్థానాలకు ఎందుకులేవు.
భారతదేశంలో ఎక్కడా ఎటువంటి అల్లకల్లోలాలు, అల్లర్లులేని సమయంలో జస్టిస్ యూ.యూ. లలిత్, ఎ.కె. గోయల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా దళితుల్లో ఆగ్రహాన్ని రాజేసింది. ఆ తీర్పును నిరసిస్తూ చేపట్టిన ''భారత్ బంద్'' సమయంలో దేశంలో అల్లర్లు చెలరేగి దాదాపు 12 మంది దళితులు మరణించారు. దీనికెవరు బాధ్యత వహిస్తారు?
జస్టిస్ ఎ.కె. గోయల్ న్యాయమూర్తిగా పదవీ విరమణ రోజుననే కేంద్రప్రభుత్వం ఆయనను ''జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) చైర్మన్గా నియమించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి తూట్లు పొడిచిన జస్టిస్ ఎ.కె. గోయల్కు నజరానాగా పదవీ విరమణ చేసిన వెంటనే ఎన్జీటీ చైర్మన్గా నియమించడం అంటే కేంద్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక రహస్య ఎజెండా మనకు అర్థమైపోయింది. అగ్రకుల దురహంకారుల దాడుల నుండి రక్షణగా ఉన్న ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న లక్ష్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వారా నెరవేర్చుకున్నారని చెప్పడానికి ఇంకా ఏ ఉదాహరణలు కావాలి.
మనం ఒక వ్యవస్థను వ్యతిరేకించినప్పుడు తప్పకుండా దానికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మాణం చేసి సూచించాలి. అందుకే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఎక్కడెక్కడ నిర్వీర్యం అయ్యే పరిస్థితులున్నాయో వాటిని ఉదాహరిస్తూ ప్రత్యామ్నాయ చట్టాలను రూపొందించడానికి పోరాటాలను కొనసాగిద్దాం.
అ ముఖ్యంగా ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులన్నీ సరియైన సాక్ష్యాధారాలను, సాధారణ పోలీసు దర్యాప్తు సంస్థలు సేకరించలేకపోయి కోర్టుల ముందు కేసులు నిలబడక, ముద్దాయిలంతా శిక్షల నుండి మినహాయింపు పొంది తప్పించుకుంటున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు దర్యాప్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులున్న ప్రత్యేక పోలీసు దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేయాలి.
అ ప్రతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ప్రాసిక్యూషన్వారు సరైన ఆధారాలు సమకూర్చలేదనే నెపంతో దోషులందరినీ నిర్ధోషులుగా కోర్టులు ప్రకటిస్తున్నాయి. సరైస సాక్ష్యాధారాలను సమర్పించే దోషులకు తప్పకుండా శిక్షలు పడే విధంగా ప్రాసిక్యూట్ చేయడానికి, ప్రత్యేకమైన ప్రాసిక్యూషన్ వ్యవస్థను ఏరాటు చేయాలి, లేదా ప్రాసిక్యూషన్ నైపుణ్యంతో చేసే న్యాయవాదులను నియమించుకోవడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వాలే భరించాలి.
అ హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనాల బెంచ్లలో ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తులున్న బెంచ్లలో ఒకరిని తప్పకుండా ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తిని నియమించాలి. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్లలో ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ వర్గాల నుండి తప్పకుండా నియమించాలి.
అ ఇప్పటి వరకు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి జిల్లా సెషన్స్ కోర్టు పరిధి వరకు మాత్రమే న్యాయవ్యవప్థలో రిజర్వేషన్ నియామకాలకు అనుమతిస్తున్నారు. ఇక నుండి హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను పాటించి నియామకాలు చేపట్టాలి.
అ దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలు సేకరించడానికి జరిగే కాలయాపన వలన సాక్షులు కాని, సేకరించిన ఆధారాలు కాని అగ్రవర్ణాల ధనబలం, కండబలంతో నీరుగార్చే విధంగా, కేసులు వీగిపోతున్నాయి. కాబట్టి దర్యాప్తు సమయంలో ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేసి, దర్యాప్తు చేసే విభాగానికి ప్రత్యేక రక్షణ కల్పించాలి.
- మీస రవి
సెల్ : 9440520787
Authorization