- ఎరుకలి పరిపూర్ణం
''మద్దిమడుగు ప్రాంతంలో ఉన్న భూములన్నీ మావే. ఎవరైనా ఎదురుతిరిగి సాగు చేయడానికి ప్రయత్నిస్తే...తలలు పగలిపోతాయి. ఎవరు చేసే పని వారు చేయాలి. రెడ్లకు ఉండాల్సిన భూమిని దళితులకు చెందినవి అనడమేంది. మీకు పట్టాలు ఉండవచ్చుగాక.. మీరు మా కాలికింది చెప్పలు తయారు చేయాలి. కాదని పంట పండే భూముల జోలికి రావద్దు'' అంటూ... పదర మండలం మద్దిమడుగులోని రెడ్లు, బీసీలు కలసి ఎస్సీల తలలు పగలేలా దాడులు చేశారు. గొడ్డళ్లు, కత్తులు తీసుకొని వెంటబడి కొట్టడంతో దళితులు ప్రాణభయంతో ఇంట్లో దాక్కున్నారు.
''సారూ... మాకు ఎవ్వరు తెలియదు. ఈ భూమిలోనే మేము 50 ఏండ్లుగా సాగుచేసుకుంటున్నాం. మాకు సాగు భూమి తప్ప ఎలాంటి ఆధారం లేదు. మేము కన్న పోరలకు ఉన్న భూమి కూడా ఇవ్వలేకపోతున్నాం. మాకున్న భూమిని కొంతమంది రెడ్లు, భూస్వాములు గుంజుకునే యత్నం చేస్తున్నారు. అడ్డుతగిలితే... తలలు పగలగొడుతున్నారు'' అని బాధిత దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూ ల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో మద్ధిమడుగు అనే గ్రామం ఉంది. సుమారు 100 ఏండ్ల నుండి ఇక్కడ కొంత మంది దళితులు భూమిని చదును చేసుకొని వ్యవ సాయం చేస్తూ జీవనం సాగి స్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన ముప్పారు వెంకయ్య తండ్రి లాలయ్య అనే వ్యక్తికి ఇదే గ్రామంలో 25 ఎకరాల భూమి ఉంది. ఇది అతని తాత కోటయ్య పేరుమీద 50 ఏండ్ల క్రితం ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అప్పటినుండి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే నీటి వసతి లేక సరైన దిగుబడి రావడం లేదని ఇక్కడి నుండి దళిత కుటుంబాలు పక్క జిల్లాలైన ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాకు వలసలు పోయేవారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది రెడ్డి, బీసీ వర్గాలకు చెందిన వారికి భూమిపై కన్నుపడింది. ఏడాది క్రితం పట్టాదారులు లేనిది చూసిన సాదుల అంజిరెడ్డి, కోటిరెడ్డి, సాయిబాబు, రావంజీ, వెంకటేశ్లు, కృష్ణ, వీరనాగయ్యలు కలసి దళితుల భూమిని సాగు చేశారు. వలస వెళ్లిన అసలైన పట్టాదారులు వచ్చి ''మా భూమిలో మీరు ఎలా విత్తనాలు వేస్తారు'' అని అడ్డుకున్నారు. ''మీది కాదు, ఈ భూముల్లోకి వస్తే.. ప్రాణాలు పోతాయి'' అని దళితులను బెదిరించారు. దళితులు తహశీల్దార్, ఆర్డీఓ చుట్టూ తిరిగి అలసిపోయారు. ఇది మీ భూమి కాదు అంటూ సర్వే నెంబరు 3ను చూపారు. ఈవిషయమై మేము సర్వేయర్ను కూడా తెచ్చి కొలిపించాం. అయిన అగ్రకుల భూస్వాములు వినకుండా పొలం సాగు చేసే యత్నాలు చేశారు.
దాడులు, హెచ్చరికలు
ఈనేపథ్యంలో ఆదివారం పొలం పనులకు పోయిన దళితులను అడ్డుకున్నారు. పొలంలోకి వస్తే.. తలలు పగలగొడుతామని హెచ్చరించారు. అన్నంత పని చేశారు కూడా. ట్రాక్టరు తీసుకొని బలవంతంగా పంట పొలాలోకి వస్తుండగా దళితులు నిలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన అగ్రకుల పెత్తందారులు దాడులకు పాల్పడ్డారు. గొడ్డలి, కత్తులతో దాడులు చేసి తలలు పగలగొట్టారు. ''మాదిగ లం.. కొడుకుల్లారా మీకెందుకురా భూమి'' అంటూ చిందులేశారు. పొలంలో ఎస్ఐ, సీఐలతోపాటు తహశీల్దార్ సిబ్బంది కూడా ఉన్నా... దాడులను ఆపలేకపోయారు. ఇక్కడ ఉంటే చంపేస్తారేమోనని దళితులు పారిపోయారు. ఇరుగుపొరుగు వారి సహకారంతో అక్కడినుంచి అటే నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లారు.
సెల్ : 9398769450
మమ్ములను చంపుతరంట
నేను పొలంలో పనులు చేసుకుంటుంటే రెడ్లు వచ్చి మా మామ తలను పగలగొట్టారు. పొలం విడిచి పోకుంటే చంపేస్తామంటున్నారు. ''మాదిగ నాకడుకుల్లారా... మేకెందుకు రా సాగు భూమి'' అంటూ దాడికి వస్తున్నారు. గొడ్డలి, కత్తులతో దాడులు చేసి మామ తలను పగలగొట్టారు. వేళ్లను నరికేశారు. మేము ఇక్కడే ఉంటే మమ్ములను చంపేస్తారు. మాకు పోలీసులే రక్షణ కల్పించాలి.
- శాంతమ్మ, మద్దిమడుగు
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
పదర మండలం మద్దిమ డుగులో దళితుల భూములను అక్రమంగా సాగు చసుకుంటు న్న రెడ్లపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. పొలం మాదంటూ ఎలాంటి ఆధారా లు లేకుండా దళితులపై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. వారిపై దాడులు చేయడం భావ్యం కాదు. దళితులపై దాడులు చేస్తున్నా పోలీసులు అక్కడే ఉండి వారిని నియంత్రణ చేయకపోవడం మరీదారుణం.
లక్ష్మణ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి,నాగర్కర్నూల్
కిందబడటం వల్లనే దెబ్బలు తగిలాయి
నేను ఎలక్షన్ పనిమీద మద్దిమడుగు పోయాను. అక్కడ వీరు గొడువ పడుతున్న విషయం తెలుసుకున్నాను. వెంకన్న తాగి వచ్చిండు. పొలంలోకి రావద్దన్నా వినకుండా గొడవపడ్డారు. పెనుగులాటలో దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా గొడువైన తర్వాత ఎవ్వరూ నాదగ్గరకు రాలేదు. వస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.
- ఎస్ఐ పదర
Authorization