ఉమ్మడి రాష్ట్రం చివరి బడ్జెట్లో రూ.7,500 కోట్ల ఎక్సైజ్ ఆదాయం వస్తుందని అంచనా వేయగా ఇప్పుడు 2017-18 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రూ.9వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. దీనిని ఎప్పుడు రూ.15వేల కోట్లకు పెంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణ ఖజానా పెరిగి ధనిక రాష్ట్రంగా మారాలంటే జనం మద్యం మత్తులో తూగుతూ ఉండాలనుకోవడం శోచనీయం. నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం వారి మానసిక బలహీనతపై దెబ్బ కొట్టి డబ్బులు దండుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించే పేదలు కష్టపడి సంపాదించుకన్న నాలుగు రాళ్లను వారికి తాగబోయించి గుంజుకునేందుకు సిద్ధపడుతోంది. అసలే పౌస్టికాహార లోపంతో ఉన్న పేదలు, మద్యం వ్యసనం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అంతేకాదు అనారోగ్యంతో అర్థాయుష్షుతో చిన్న వయసులోనే భర్తలను కోల్పోయిన 30 శాతం మంది మహిళలు, ఒంటరిగా కుటుంబ భారాన్ని తలకెత్తుకొని జీవచ్ఛవాలుగా బతుకుతుఆ్నరు. విచ్చలవిడిగా మద్యం వ్యసనం వల్ల ఒంటరి మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ వ్యసనం వల్ల స్త్రీలపై, బాలికలపై రోజురోజుకూ లైంగిక హింస, శారీరక హింస పెరుగుతోంది. రోజు కనీసం 30 మంద మహిళలు వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్నారు. తప్ప తాగిన మైకంలో వావివరసలు మరిచి మృగాళ్లుగా మారుతున్నారు.
బతుకులను బుగ్గిపాలు చేసే మద్యాన్ని ఆపాలి.
బతుకమ్మ స్ఫూర్తిని నిలపాలి
మద్యం విచ్చలవిడి అమ్మకాలు ఆపాలి
బతుకమ్మ సంబరాల్లో సంతోషం నిలపాలి
ఆడది కోరుకునే వరాలు రెండే రెండు. చల్లని సంసారం, చక్కని సంతానం'' అన్నాడు ఒక కవి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్మాత్రం ప్రతి మహిళా ఆనందంగా ఉండాలి. ప్రతి మహి ళా మొఖంఓ చిరు నవ్వులు చూడాలని అప్పుడే బంగారు తెలం గాణ వచ్చినట్టు అని చెప్పి ఇప్పుడేమో కేసీఆర్ నేతృత్వంలో తెలం గాణ ఆదాయమే పరమావధిగా మద్యం అమ్మకాలు ప్రోత్సహిం చి, మందు బాబులను పెంచేందుకు కంకణం కట్టుకున్నది. ఇప్పుడు మందు బాబులకు మద్యం షాపులు రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంచాలని, సాధారణ షాపింగ్ మాల్స్లో కూడా మద్యం అమ్మకాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చిపెట్టే ప్రధాన వనరుగా ఎక్సైజ్ శాఖ మారింది. తెలుగు దేశం, కాంగ్రెస్ బాటలో నే టీఆర్ఎస్ పాలకులు కూడా నడుస్తున్నారు. అందులో భాగం గానే సీసాలో పీసా చట్టాన్ని కూడా బంధించేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే మద్యం షాపులు ఎక్కడబడితే అక్కడ విచ్చల విడిగా, పాఠశాలలు, వైద్యశాలలు, దేవాలయాలన్న తేడా లేకుం డా మద్యం షాపులు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు గిరిజన ప్రాంతాలనూ వదలడం లేదు. గిరిజన ప్రాంతాలలో మద్యం షాపులకు అవసరమైన డిపాజిట్ కట్టగలవారు దొరకరు. మద్యం షాపుల లైసెన్స్లు కూడా గిరిజనులకే ఇవ్వాలన్న చట్టపరమైన ఆంక్షలే ఇందుకు కారణం. కానీ కాంట్రాక్టర్ల ఎత్తులు తక్కువేమీ కాదు కదా! కాంట్రాక్టర్ల కసం ఏమి చేయడానికైనా సిద్ధమంటున్న తెలంగాణ పాలకులు కూడా ఇందుకు తోడై మద్యం అమ్మకాలు ఎంత పెరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయమని ఆబగా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను ముందు పెట్టి, కాంట్రాక్టర్లు డిపాజిట్లు కట్టి బినామీలుగా రాజ్యమేలుతున్నారు. మద్యం షాపులు కైవసం చేసుకుంటున్నారు. సాగు నీటి సంగతేమో గానీ మందు పారించేందుకు మాత్రం స్కూల్, గిరిజన ప్రాంతాలను కూడా వలలలేదు.
ఉమ్మడి రాష్ట్రం చివరి బడ్జెట్లో రూ.7,500 కోట్ల ఎక్సైజ్ ఆదా యం వస్తుందని అంచనా వేయగా ఇప్పుడు 2017-18 తెలం గాణ రాష్ట్ర బడ్జెట్లో రూ.9వేల కోట్లు రాబట్టాలని నిర్ణయించా రు. దీనిని ఎప్పుడు రూ.15వేల కోట్లకు పెంచాలన్న ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణ ఖజానా పెరిగి ధనిక రాష్ట్రంగా మా రాలంటే జనం మద్యం మత్తులో తూగుతూ ఉండాలనుకోవడం శోచనీయం. నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం వారి మానసిక బలహీనతపై దెబ్బ కొట్టి డబ్బులు దండుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించే పేదలు కష్టపడి సంపాదించుకన్న నాలుగు రాళ్లను వారికి తాగబోయించి గుంజుకునేందుకు సిద్ధపడుతోంది. అసలే పౌస్టికాహార లోపంతో ఉన్న పేదలు, మద్యం వ్యసనం పెరగ డంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అంతేకాదు అనారోగ్యంతో అర్థాయుష్షుతో చిన్న వయసులోనే భర్తలను కో ల్పోయిన 30 శాతం మంది మహిళలు, ఒంటరిగా కుటుంబ భా రాన్ని తలకెత్తుకొని జీవచ్ఛవాలుగా బతుకుతుఆ్నరు. విచ్చలవి డిగా మద్యం వ్యసనం వల్ల ఒంటరి మహిళల సంఖ్య రోజురోజు కూ పెరుగుతున్నది. ఈ వ్యసనం వల్ల స్త్రీలపై, బాలికలపై రోజు రోజుకూ లైంగిక హింస, శారీరక హింస పెరుగుతోంది. రోజు క నీసం 30 మంద మహిళలు వరకట్న వేధింపులు ఎదు ర్కొంటున్నారు. తప్ప తాగిన మైకంలో వావివరసలు మ రిచి మృగాళ్లుగా మారుతున్నారు. కన్న తండ్రే కూతు రుపై లైంగికదాడి అన్న వార్తలు మనం చూస్తున్నాం. మద్యం మత్తులో పసి పాపనుండి పండు ముసలి వరకు లైంగిక దాడులకు గురవుతున్నారు. ఇంత హింస జరుగుతున్నప్పటికీ మా రాష్ట్ర ఖజానా, దళారుల జేబులు నిండితే చాల్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పేదల ఆరోగ్యా లను ఫణంగా పెట్టి పోగేస్తున్న ఆదాయంతోఏ పేదల సంక్షేమం పేరుతో పథకాలు ప్రకటి స్తున్నది. ఈ పేరుతో కేటాయిస్తున్న నిధులకు కూడా ఆచరణలో కోత పెడుతున్నది. 2015-16 బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే సాంఘిక సంక్షేమం కేటాయింపులలో సగం నిధులు దారి మళ్లించారు. వైద్య, ఆరోగ్య శాఖ కేటాయింపులలో మూడో వంతు ఖర్చు చేయలేదు. ఇక 2016-17 బడ్జెట్ కేటాయింపులు ఏ మేరకు ఖర్చు చేసారో తెలియాలంటే రానున్న బడ్జెట్ లెక్కలు చూడాల్సిందే. రాష్ట్ర పాలకులకు ఆదాయం పెంచుకోవడం మీద ఉన్న దృష్టి ప్రజల ఆరోగ్యం మీద, సంక్షేమం మీద లేదు. మహిళలు, యువత ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన భ్రుత్వం అధికారం కోసం మాత్రం నా ఆడబిడ్డల కంటతడి చూడలేనంటూ కేసీఆర్ ప్రచారం చేసారు. మహిళల్ని హింసిస్తే వారిపై దాడి చేస్తే అలాంటి వారి గుడ్లు పీకేస్తామని, వారు ప్యాంట్లు తడుపుకునేలా చట్టం చేస్తామని సేఫ్ సిటీ, సేఫ్ ఉమెన్ అని మహిళల్ని రక్షించడం కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం రకరకాలుగా చెబుతున్నది. హైదరాబాద్ నగర పోలీసులకు హంగూ, ఆర్భాటలతో లక్షలు ఖర్చు పెట్టి పెద్ద, పెద్ద వాహనాలు కొనిచ్చారు. కానీ ఆచరణలో మహిళలకి, పిల్లలకి రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కనీసం క్షేత్రస్థాయిలో పని చేస్తున్న, మహిళా, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి. ఆలోచనలు పంచుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోంది. మద్యం నియంత్రణ కూడా మహిళలకు రక్షణ లేదు. అయినా ప్రభుత్వం నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందాన వ్యవహరిస్తోంది. అభివృద్ధి పేరుతో ఇప్పటికే క్లబ్బులు, పబ్బుల సంస్కృతి వ్యాపిస్తున్నది. యువత మీద దీని ప్రభావం పెరుగుతున్నది. ఇది మద్యం దగ్గర ఆగటం లేదు. గంజాయి, డ్రగ్స్ సంస్కృతి విచలవిడిగా పెరుగుతున్నది. గంజాయి, డ్రగ్స ప్రభావానికి బానిసలయ్యే యువతకు మద్యం తొలిమెట్టు. ఇక్కడే తగిన నియంత్రణ చేయగల్గితే యువ శక్తి నిర్వీర్యం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ప్రజలు ఈ విషయాన్ని గమనించినప్పుడే పాలకులను ప్రశ్నించగల్గినప్పుడే సామాజిక భద్రత సాధ్యం.
ఈ కింది అంశాలను ఒక్కసారి గమనిద్దాం :
- ప్రతి 30 మంది పిల్లలకు ఒక తరగతి గది ఉండాలి. ( కానీ మన రాష్ట్రంలో 200 మందికి ఒకటి ఉంది)
- ప్రతి వెయ్యి మందికి తొమ్మిది మంది పోలీసులు ఉండాలి ( కానీ మన వద్ద ఇద్దరు కూడా లేరు.
- ప్రతి 30 వేల మందికి ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలి. ( మన రాష్ట్రంలో 51 వేల మందికి ఒకటి మాత్రమే ఉంది)
- ప్రతి 500 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ( కానీ మన పల్లెల్లో వేల మందికి ఒక్కరు కూడా లేరు)
మరి జనాభా ప్రాతిపదిక వీటికి వద్దా? ప్రతి పది వేల మందికి ఒక మద్యం దుకాణం మాట సిగ్గు సిగ్గు. నాడు జీవితాలను సర్వనాశనం చేస్తున్న మద్యం మహమ్మారిఇ తరిమి కొట్టడానికి మహిళలతో ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఉద్యమాలు నడిపారు. సాధించుకున్నారు. కానీ పాలకు నయ వంచనతో మళ్లీ మద్యం ఏరులై పారుతోంది. అందుకే మద్యం వద్దు మంచినీళ్లు కావాలి. విద్యా, వైద్యం కావాలి. మద్యరహిత గ్రామ జ్యోతులు వెలగాలి. కనీస అవసరాలు తీర్చాలని మళ్లీ గొంతెత్తి నినదించి మరో మద్య నిషేధ ఉద్యమానికి నాంది పలకాలి. అప్పుడే మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, వివక్షలు తొలగిపోతాయి. మహిళలను అన్ని రంగాలలో సమానంగా గుర్తించే రోజులు వస్తాయి.
సెల్ :9951483440
పసుపులేటి రమాదేవి
Authorization