యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా నేటికి కులవర్గ వైషమ్యాలతో గ్రామ ప్రజలు వెనకబాటుకులోనై అనేక పీడనలకు గురవుతున్నారు. భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం సాగిన మహాత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఎందరో వీర యోధులను ఈ గ్రామం అందించి సమర శీల పొరాటాలకు, సాయుధ పోరాట యోధులకు చిరునామాగా నిలిచింది. తర్వాత భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో భాగంగా ఈ ఊరిలో ఉన్న అగ్రకుల పెత్తందారులు తమ భూము ల ను అమ్ముకొని ఊరు విడిచి హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు వెళ్లిపోయారు. నేడు ఈ గ్రామంలో ప్రత్యేక పరిస్థితులు ఏమిటంటే అగ్రకుల దొరలు, పటేండ్ల అజమాయిషిలో లేని గ్రామం కావడంతో గత రెండు దశాబ్దాలుగా బీసీలలో నుండి ధనికులు రాజకీయ అండతో దొర అవతారం ఎత్తి పీడిత కులాలపై పెత్తనం చేలాయిస్తూ వస్తున్న పరిస్థితులు.. గ్రామంలో నయా దొరలు చేసిన అనేక అరాచ కాలు, దళితులపై లైంగికదాడులు అనేకం.ఎందరో బాధితులు వారి వేధింపులు భరించలేక ఊరు విడిచి పట్నం వలస వెళ్లారు. తమకు ఎదురు తిరిగిన గ్రామ యువకులపైన అనేక అక్రమ కుట్ర కేసులు పెట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఊరికే పెద్ద మాదిగ (పెద్ద మాతర) అతను. ఆయన పేరు చింతిగారి పెద్ద మాతర బాలయ్య అని ఊరి వాళ్లు, తోటి బహుజన శ్రామిక కులాలు గౌరవంతో పిలుచుకుంటారు. జాగిరులు తమకు ఎట్టి చేసినందున గ్రామ మాదిగలకు ఇనాంగా కొంత భూమిని ఇచ్చారు. ఈ క్రమంలో ఎకరంన్నర భూమిని గ్రామంలో 60 మాదిగల కు టుంబాలు సమిష్టి ఆస్తిగా అప్పటి నుండి చింతిగారి బాలయ్య తాత అయిన నర్సయ్య వారి పూర్వికుల పేరు మీద నుండి నేడు బాలయ్య పేరు మీద వారసత్వంగా వస్తూ ఉంది. 40 ఏండ్ల కింద జెల్ల భిక్షపతి తండ్రి జెల్ల నర్సయ్య వద్ద చింతిగారి బాలయ్య పూర్వికులు ఇల్లు గడవక కేవలం రూ.40కు తమ భూమిని కుదువ బెట్టారు. ఆనాటి జాగిరులు ఇచ్చిన భూమిని ఈనాడు ఆ భూమి పక్కనే మెయిన్రోడ్, బస్టాండ్ ఉండ డంతో డిమాండ్ పెరిగి జెల్ల భిక్షపతి అనే నయా పెత్తందారికి ఆ భూ మిపై కన్ను పడింది. ఏదో ఒక విధంగా ఆ భూ మిని దక్కించ్చుకోవాల ని పన్నాగం పన్నాడు. వెంటనే జెల్ల భిక్షపతి తన తండ్రి దగ్గర ఏనుకట చింతిగారి బాలయ్య పూర్వికులు ఇల్లు గడవక పొట్ట తిప్పల కోసం చేసిన తీసుకున్న రూ.40 అప్పు గుర్తుకు వచ్చింది. రూ.40 గాను చింతిగారి బాలయ్య పూర్వికులు మొదలు కొని తన పెద్దకొడుకు అయిన బాలనర్సయ్య తాను 16 ఏండ్ల వయ స్సు వచ్చే వరకు ఆ అప్పును ఎట్టి చేసి తీర్చాడు. ''ఆ అప్పు తీర్చినం'' అని భావిస్తు న్న సందర్భంలో జెల్ల భిక్షపతి తన రాజకీయ పలుకుబడితో ''ఇంకా మీరు రుణపడి ఉన్నారు'' అనే భావాన్ని కలిగించి దళితుల ఇనాం భూమిని అక్రమంగా తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
బోరు కోసం అర గుంట జాగ కావాలని నమ్మ బలికి నిరక్షరాస్యుడైన పెద్ద మాతర చింతిగారి బాలయ్యను మోసం చేసిన జెల్ల భిక్షపతి తన నమ్మిన బంటులైన గడ్డమీది వెంకటయ్య గౌడ్, చింతిగారి అంజ య్యల సహకారంతో యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసు కొచ్చి తను కన్ను వేసిన భూమిని అక్రమంగా తన పేరుమీద రిజిస్ట్రే షన్ చేపించుకున్నాడు.దళితుల ఇనాం భూమి మొత్తం చింతి గారి బాలయ్య ఒక్కని పేరుమీద ఉండడంతో రిజిస్ట్రేషన్ చేయడానికి ఆస్కారం లేనప్పటికీ ఆనాటి రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై భూమిని కాజేశాడు. కొన్ని నెలల కింద ప్రభుత్వం ప్రకటించిన పంట రుణం కిం ద దరఖాస్తు పెట్టుకునప్పుడు తమ పేరుమీద ఉన్న భూమి తక్కువగా వస్తుందని అనుమానం వచ్చి జెల్ల భిక్షపతిని నిలదీయగా దాబాయి స్తూ వచ్చాడు. గత వారం డిసెంబర్ 10వ తేదీన తమ పూర్వికుల స్మారక గోరిని అదే స్థలంలో బాధితుడు బాలయ్య, అతని కుటుంబ స భ్యులతో కలిసి నిర్మిస్తుండడంతో జెల్ల భిక్షపతి తన ఇద్దరు కొడుకులు ప్రవీణ్, ప్రసా ద్లతో వచ్చి వారి ట్రాక్టర్తో పనిచేస్తున్న బాధితులపైకి తీసుకొని రావడంతో వారు భయంతో పక్కకు పరుగెత్తారు. దీంతో భిక్షపతి కొడుకు ప్రసాద్ ట్రాక్టర్తో నిర్మాణంలో ఉన్న గోరిని కూల్చివే సాడు. పొలంలో ఉన్న చెట్ల మొక్కలను ధ్వంసం చేసి బాధితులను కు లం పేరుతో చెప్పరాని విధంగా దూషిస్తూ ''నాకు రాజకీయ పలుకు బడి ఉన్నది, మీ అంతుచూస్తా'' అని హెచ్చరించారు. తర్వాత తమ ఇ ంటికి బాధితులు తిరిగి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో జెల్ల భిక్షపతి ఇంటి వద్ద అతని భార్య బాలమాణి, కోడలు రేఖలు బాధితు లను అవ మానిస్తూ కులం పేరుతో దూషించడంతో మనస్తాపం చెందిన చింతి గారి బాలయ్య తన ఇంటిలో ఉన్న పంట చెనుకు వాడే క్రిమి సంహా రక గులికలను తీసుకొని జెల్ల భిక్షపతి ఇంటి ముందుకు వెళ్లి ''నా చావుకు కారణం మేరే'' అంటూ పురుగుల మందు తాగి పడిపో యా డు. దీనితో బాలయ్యను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించా రు. ఆరు రోజులు బాలయ్య చావు బతుకుల మధ్య మృత్యువుతో పోరాడి గత శనివారం మరణించాడు. దీనితో యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐలు పంచనామా నిర్వహించి నిందితులపై క్రైమ్ నెంబర్ 128/2018, యూ/ఎస్ 306, 447, 427, 504, 506 ఐపీసీ 3(1) ఎస్సీ,ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియడంతో నిందితులు ఇంటికి తాళం వేసి కుటుంబమంతా పరారయ్యారు. పోస్టుమార్టం అనంతరం బాధితుని శవాన్ని ఊరికి తీసుకొచ్చి జెల్ల భిక్షపతి ఇంటి ముందు వేసి ఆందోళన నిర్వహించారు.
నయా మనువాదులకు శిక్ష పడాల్సిందే
తెలంగాణలో ఒకపక్క అణగారిన కులాల పట్ల అణ చివేత ధోరణి కొనసాగుతుంటే ఆ సమూహం నుం డి బయటపడ్డాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల ప్రజలు బ్రాహ్మణీయ భావజాలంతో వ్యవహరించడం దుర్మార్గం.నయా బ్రాహ్మణీకరణ అమలు చేసే విధాలాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కులాల ప్రజలు అందులో పావుగా మారుతున్నారు. ఇండియాలో ఎప్పుడైతే కుల నిర్మూలన అమలు జరుగుతుందో అప్పుడే అప్పుడే నిజమైన స్వాతంత్య్రం దళితులకు లభిస్తుంది.
సూదగాని వెంకటేష్
- కుంట రవీందర్యాదవ్,
యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
నిందితులను కఠినంగా శిక్షించాలి
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజు కు దళితులపై దాడులు తీవ్రమ వుతున్నాయి.. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. నింది తుల పట్ల చట్ట ప్రకారం ప్రభు త్వం కఠినంగా వ్యవహరిం చాలి. లేని పక్షంలో దళిత సంఘాలను ఐక్యం చేసి పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం.
- పాకాల రాజు,
తెలంగాణ బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు
ప్రేమించి పెండ్లి చేసుకుంటే సహించలేదు
నేను చింతిగారి బాలయ్య చిన్న కొడు కును ప్రేమ వివాహం చేసుకున్నాను. జెల్ల భిక్షపతి కుల దురహంకారంతో మా కులాంతర ప్రేమ వివాహాన్ని స హించలేకపోయాడు. ఊరిలో కుల కట్టు బాట్లు చెదిరిపోతున్నాయని, ఇలాంటి తప్పు చేస్తే మరొకరు తయారవుతారని మా మాల కులం వారిని పురమాహించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. కనీసం మా తండ్రి చనిపోయినప్పుడు నన్ను ఆయన మొఖం కూడా చూడకుండా అడ్డుకున్నాడు.
- స్వప్న, బాధితుడి కోడలు
నయా పెత్తందారి పీడ విరగడ కావాలి
రోజురోజుకు జెల్ల భిక్షపతి గౌడ్ అరాచకాలు, దళితులపై దాడులు, లైంగికదాడులు మితిమీరి పోతున్నాయి. తనకు ఎదురు తిరిగితే ఎవరినైనా రాజకీయ అండతో, గ్రామంలోని తన గూండాలతో ఏదో విధంగా దాడులు చేయించి ఊరిలో ఉండనియకుండా కుట్రలు చేస్తున్నాడు. ఈ పెతందారీ బాధితులు ఎందరో ఆ బాధలు భరించలేక హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ పెత్తందారీ ఆధిపత్య పీడన నుండి మా గ్రామాన్ని విముక్తి చేయాలి.
- అశోక్ గ్రామ యువజన సంగం
బాధితులకు తగిన న్యాయం చేస్తాం
బాధితులకు తగిన న్యాయం చేస్తాం. ఇప్పటికే నిందితులను అర్ధరాత్రి గజ్వేల్లో అరెస్ట్ చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద ఇప్పటికే కేసు నమోదు చేశాం. నిందితులను విచారించి బాధితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం.
- టి.మనోహర్రెడ్డి, ఏసీపీ, యాదాద్రి
Authorization