70ఏండ్లుదాటిన స్వతంత్య్రభారతంలో ముస్లిం సముదాయం పరిస్థితి 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న సామెతను తలపిస్తోంది. ఈనాటికీ దేశ ముస్లిం జనాభాలో 60శాతంమంది దారిద్య్ర రేఖకు దిగువన దుర్భరమైన జీవితం గడుపుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అత్యధికశాతం మందికి సొంత వ్యవసాయం, సొంత వ్యాపారాలు, కనీసం సొంత ఇండ్లు కూడా లేవు. తోపుడుబండ్లపై పండ్లు, కూరగాయలు లాంటి చిన్నచిన్న వ్యాపారాలు చేయడం, సైకిళ్లపై తిరుగుతూ గొడుగులు, తాళాలు బాగుచేయడం, బిందెలు, బకెట్లకు మాట్లు వేయడం, రిక్షాలు లాగడం, అద్దె ఆటోలు నడపడం, సైకిళ్లు రిపేరు చేయడం, పాన్ డబ్బాలు నిర్వహించడం ఇంకా ఇలాంటివే చిన్నాచితకా వ్యాపారాలు నిర్వహిస్తూ, కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అక్షరాస్యతా శాతం కూడా తక్కువే. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిని, చట్టసభల మెట్లెక్కిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాలూ వారి దరిచేరవు. వాటిని అందుకునే చైతన్యమూ వారిలో కనబడదు. ఎన్నో కమిటీలు, కమిషన్లు వారి జీవన స్థితిగతుల్ని, వారి వెనుకబాటును, దానికి గల కారణాలను వివరంగా తెలియజేశాయి. పరిష్కార మార్గాలనూ సూచించాయి. వారి సంక్షేమానికి చేపట్టవలసిన చర్యలనూ సిఫారసు చేశాయి.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడుదశాబ్దాలు దాటిపోయినా దేశంలోని పేదలు, బడుగుబలహీన వర్గాలకు స్వాతంత్య్ర ఫలాలు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలి పోయాయి. దేశంలోని అతిపెద్ద మైనారిటీవర్గమైన ముస్లింలు దీనికి మినహాయింపు కాదు. గత ఏడు దశాబ్దాలుగా ముస్లింలు నిరంతరం తరంతరం వివక్షకు, వెనుకబాటుకు, అవకాశాల లేమి కి గురవుతూనే ఉన్నారు. అస్తిత్వవేదనకు, ఆర్థిక అసమానత్వా నికి, విద్యా, ఉద్యోగ, ఉపాధిరంగాల్లో నిరంతరం ముస్లిం జాతి కడబంతికే పరిమితమవుతూ వస్తున్నది.దేశ జనాభాలో రెండవ స్థానంలో, అంటే సుమారుగా ఇరవైశాతంగా ఉన్న ముస్లింలు (ప్రభుత్వ లెక్కల ప్రకారం 14.2శాతం) సామాజికంగా, ఆర్థికం గా, రాజకీయంగా అధమ స్థితికి లోనై ఉన్నారు. 2005లో భార త ప్రభుత్వం నియమించిన జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వెలువరించిన నివేదిక ఇండియన్ ముస్లింల వెనుకబాటును, వారి దుర్భర దారిద్య్రాన్ని కండ్లకు కట్టింది. ఈ వెనుకబాటు కార ణంగానే ఈనాటికీ ఇండియాలోని ముస్లింలు విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలన్నిటిలో అన్నివర్గాలకంటే దారుణం గా వెనుకబడి ఉన్నారు. దీన్ని దూరం చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుధ్థితో ప్రయత్నించిన పాపానపోలేదు.
దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్తో సహా, జనతా పార్టీగానీ, నేషనల్ ఫ్రంట్ గానీ, భారతీయ జనతాపార్టీగానీ ఏదీ ముస్లింల సంక్షేమాన్ని, వారివృద్ధి వికాసాలను పట్టించుకోలేదు. జనతాపార్టీ, నేషనల్ ఫ్రంట్లు ముస్లింల పట్ల వ్యతిరేకత ప్రదర్శి ంచకపోయినప్పటికీ, ముస్లిం సముదాయం పట్ల సానుకూలం గానే ఉన్నప్పటికీ, అవి ఆ సముదాయానికి చెప్పుకోదగ్గ మేలు కూడా ఏమీ చేయలేకపోయాయనే చెప్పాలి. ఇక బీజేపీ గురించి చెప్పుకోడానికి ఏముంటుంది? ఎన్ని కబుర్లు చెప్పినా మైనారిటీల వ్యతిరేకతే దాని అసలు ఎజెండా. ఆదినుండి మోడీ వరకు, బాబ్రీనుండి దాద్రీవరకు ముస్లిం మైనారిటీ వ్యతిరేకత దాని నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. దీనికి అనేక రుజువులు, ఉదాహరణలూ ఉన్నాయి. బాబ్రీమసీదు విధ్వంసం, గుజరాత్ మారణకాండకన్నా ప్రబల నిదర్శనం మరొకటి అవసరంలేదు. గోద్రా, భాగల్పూర్లు, ముజఫర్ నగర్, బులంద్షహర్లు, సంఝౌతా, మక్కామసీదులు అసలు లెక్కలోనివే కావు. అఖ్లాఖ్ అనే 58 ఏండ్ల వృద్ధుడిని, 20 ఏండ్ల జునైద్ను నిర్దాక్షిణ్యంగా, అనాగరికంగా, అమానవీయంగా, హత్యచేశారు. ఆలయ ప్రవేశం చేశాడని దళిత వృద్ధుడిని చంపే శారు. వ్యతిరేకంగా మాట్లాడారని, రాశారని కల్బు ర్గి, గోవింద్ పన్సారే, దబోల్కర్, గౌరీలంకేష్ లాంటి చాలామంది జర్నలిస్టుల్ని పొట్టనపెట్టుకున్నారు. అనేకమంది రచయితలపై భౌతిక దాడులకు తెగబడ్డారు. మత అసహనానికి, ఉన్మాదానికి ఇంతకన్నా పరాకాష్ట ఇంకేముంటుంది?
ఇకపోతే, కాంగ్రెస్ పార్టీకూడా ముస్లింలను ఎప్పటికప్పుడు ఓటు బ్యాంకుగానే పరిగణించింది. బీజేపీ బూచి చూపి, అందలమెక్కడానికి ముస్లింల ఓట్లను నిచ్చెనమెట్లుగా వాడుకుంది. వారి సమ స్యలు తీర్చడానికి, వారిని సామాజికంగా, ఆర్థికం గా, రాజకీయంగా ఆదుకోడానికి పెద్దగా చిత్తశుద్ధి ప్రదర్శిచిన దాఖలాలేదు. బీజేపీ ఖచ్చితమైన మతోన్మాద ఎజెండాతో ఉండటంకూడా ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉండటానికి ఒక ప్రధానకారణం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకేదో ఒరగబె ట్టిందనికాదు. ఈ రకంగా స్వాతంత్య్రానంతరం పా లక పక్షాలన్నీ ఓటుబ్యాంకు రాజకీయాలతోనే కాలం గడిపి, ము స్లిం సముదాయంతోసహా ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశాయి.
ఈకారణంగానే, 70ఏండ్లుదాటినా స్వతంత్య్రభారతంలో ముస్లిం సముదాయం పరిస్థితి 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న సామెతను తలపిస్తోంది. ఈనాటికీ దేశ ముస్లిం జనాభాలో 60శాతంమంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన దుర్భరమైన జీవితం గడుపుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసు కోవచ్చు. అత్యధికశాతం మందికి సొంత వ్యవసాయం, సొంత వ్యాపారాలు, కనీసం సొంత ఇండ్లు కూడా లేవు. తోపుడుబండ్లపై పండ్లు, కూరగాయలు లాంటి చిన్నచిన్న వ్యాపారాలు చేయడం, సైకిళ్లపై తిరుగుతూ గొడుగులు, తాళాలు బాగుచేయడం, బిందె లు, బకెట్లకు మాట్లు వేయడం, రిక్షాలు లాగడం, అద్దె ఆటోలు నడపడం, సైకిళ్లు రిపేరు చేయడం, పాన్ డబ్బాలు నిర్వహించ డం ఇంకా ఇలాంటివే చిన్నాచితకా వ్యాపారాలు నిర్వహిస్తూ, కూలీనాలీ చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అక్షరాస్యతా శాతం కూడా తక్కువే. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారిని, చట్టసభల మెట్లెక్కిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాలూ వారి దరిచేరవు. వాటిని అందుకునే చైతన్యమూ వారిలో కనబడదు. ఎన్నో కమిటీలు, కమిషన్లు వారి జీవన స్థితిగతుల్ని, వారి వెనుకబాటును, దాని కారణాలను వివరంగా తెలియజేశాయి. పరిష్కార మార్గాలనూ సూచించాయి. వారి సంక్షేమానికి చేపట్టవలసిన చర్యలనూ సిఫారసు చేశాయి. జస్టిస్ గోపాల్ సింగ్ కమిషన్, జస్టిస్ రంగనాధ్ మిశ్రా కమిషన్ సహా, జస్టిస్ రాజేందర్ సచార్ కమిషన్ వరకూ, దేశంలోని వెనుకబడిన అన్నివర్గాలకంటే, ముస్లిం సముదాయం మరింత వెనుకబాటుకు, అణచివేతకు గురై ఉందన్న పచ్చి నిజాన్ని వెల్లడించాయి. జస్టిస్ సచార్ కమిటీ 20 నెలలపాటు దేశవ్యాప్తంగా పర్యటించి, ముస్లిం సముదాయ స్థితిగతుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, 404 పేజీల నివేదిక సమర్పించి కూడా 15ఏండ్ల కాలం గడిచిపోయింది. అయినా ప్రభుత్వాల తీరులో వీసమెత్తు మార్పుకూడా రాలేదు. ఇదీ మైనారిటీ వర్గాల పట్ల ఏలికలకు ఉన్న నిబద్దత, చిత్తశుద్ధి. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేముంటుంది?.
నిజానికి, దేశంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయబద్దంగా వారికి లభించవలసిన హక్కులు, అభివృద్ధి ఫలాలు లభించినప్పు డే దేశపురోభివృద్ధి సాధ్యపడుతుంది. ఏ ఒక్క వర్గం ప్రజలైనా వివక్షకు, పక్షపాతానికి, అవకాశాల లేమికి, అణచివేతకు, న్యాయ నిరాకరణకు గురైతే దేశం ప్రగతి వికాసాలతో తులతూగడం, నాగరిక లక్షణాలతో విలసిల్లడం అసంభవం. ఇండియాలాంటి ప్రజాస్వామ్య దేశంలో ఓ పెద్ద సముదాయం వెనుకబాటుకు, ఆర్ధిక అసమానత్వానికి, అభద్రతకు, ఆత్మన్యూనతకు లోనై ఉండడం, ఏలికలు వారి సమస్యలను పట్టించుకోకపోవడం, వారి అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం, వారి హక్కుల్ని నిరాకరించడం దేశ ప్రగతీ వికాసాలపై, నాగరిక లక్షణాలపై పెను ప్రభావం చూపే ప్రమాదముంది. మైనారిటీ సముదాయం పట్ల ఈవిధమైన వివక్ష, అసమానత, హక్కుల నిరాకరణ, అన్యాయపూరితమైన వైఖరి మన ప్రజాస్వామ్య, లౌకిక దేశానికి ఎంతమాత్రం శోభించదు.
ఒక బలమైన, శక్తివంతమైన దేశంగా ఇండియా అవతరిం చాలంటే, అల్పసంఖ్యాక సమాజం పట్ల చిన్నచూపు, వివక్ష, పక్ష పాతం, అన్యాయం, అణచివేత లాంటి అనాగరిక, అహంకార పూరిత చర్యలు అంతం కావాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథ మిక, మౌలిక హక్కులు రాగద్వేషాలకు అతీతంగా అమలుకా వాలి. జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఆర్థిక, సామాజిక, పబ్లిక్, ప్రైవేట్ రంగాలన్నిటిలో ముస్లింల ప్రాతినిధ్యానికి అవకాశాలు కల్పించాలి. ముస్లిం మైనారిటీలకు వారి వ్యక్తిగత చట్టాల పరిర క్షణ, మాతృభాషలో విద్యా బోధన, ఉర్దూభాష విస్తరణ, వికాసం, మైనారిటీ కార్పొరేషన్, మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డు, ఉర్దూ అకాడమీల పరిరక్షణ, ప్రభుత్వ కంపెనీలు, వివిధ బోర్డులు, యూనివర్శిటీల్లో సముచిత ప్రాతినిధ్యం, మైనారిటీ సంస్థలకు దయాదాక్షిణ్షాల హోదా కాకుండా చట్టబద్దమైన గుర్తింపును కల్పించాలి. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలన్నిటితోపాటు, పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు దామాషా పద్ధతిలో ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
గొప్ప చారిత్రక ప్రజాస్వామ్య నేపధ్యం కలిగిన స్వతంత్య్ర భారతావనిలో ఒకపెద్ద మానవసమూహం అన్యాయానికి, నిర్లక్ష్యానికి, అవకాశాల లేమికి, హక్కుల నిరాకరణకు గురికావడం చరిత్ర క్షమించని నేరంగా పరిణమించకూడదంటే, ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. న్యాయబద్దంగా, రాజ్యాంగబద్దంగా ఎవరి హక్కులు వారికి అందేవిధంగా చర్యలు చేపట్టాలి. జస్టిస్ రాజేందర్ సచార్ నివేదికను తక్షణం అమలుచేయాలి. ఈ విషయంలో పాలకవర్గాలు చురుగ్గా స్పందించే విధంగా దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులు, హక్కుల నేతలు, లౌకిక, వామపక్షవాదులు ఒత్తిడి తీసుకురావాలి. ప్రజాస్వామ్య శక్తులు, భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు, పార్టీల సహకారంతో ముస్లింనేతలు ఐక్య ఉద్యమాలకు పూనుకోవాలి. ఎందుకంటే సచార్ సిఫారసుల అమలుద్వారానే ముస్లిం సమాజానికి ఎంతోకొంత మేలు జరిగే అవకాశముంది.
యండి.ఉస్మాన్ ఖాన్సెల్ : 9912580645
Authorization