ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనలు, శాస్త్రీయ విలువలను పెంపొందించడానికి ప్రయత్నించాల్సిన నాయకులు ప్రజలను వారిలో గల సెంటిమెంట్లతో, ఆచార వ్యవహారాల పేరుతో రెచ్చగొట్టడం తగదు. శబరిమలై ఆలయంలోకి మహిళ ప్రవేశం కేవలం కేరళ రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు. అది దేశంలోని మహిళలందరి సమస్య. నేడు శబరిమలైకి మహిళలను నిరాకరించినవారు రేపు మన గ్రామంలోని గుళ్లోకి కూడా మన తల్లినో, చెల్లినో నిరాకరించవచ్చు. ఆధునిక యుగంలో జీవిస్తున్న మనం మత విశ్వాసాల మలినాల్లో కూరుకుపోతున్నాం. విశ్వాంతరాల్లోకి ప్రయాణిస్తున్న, శోధిస్తున్న మన ఆలోచనలు మత విశ్వాసాల ముసుగులో మసకబారుతున్నాయి. శాస్త్ర సాంకేతికత సాయంతో విశ్వావిర్భావ మూలకాలను వెతికే మన కనులు అంధ విశ్వాసాలతో మూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ సమానమే అని ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగుతున్న తరుణంలో సహజ శారీరక మార్పులకు కారణంగా చూపి మన అక్కని, చెల్లిని ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడమనేది మన తిరోగమనాన్ని సూచిస్తుంది. సహజ శారీరక మార్పుల ద్వారా కలిగే చర్యలను మైల, ముట్టు, అపవిత్రం అనే భావనలు మాన విద్యలో గల శాస్త్రీయతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అందుకే విద్యలో శాస్త్రీయ ధృక్పథాన్ని, ఆధునిక ఆలోచనలు సమాజంలో కలిగేలా కృషి చేద్ధాం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడాన్ని ఖండిద్ధాం. మనుషులందరూ సమానమేనని మహిళలకు ఆలయం ప్రవేశం రాజ్యాంగం వారికి కల్పించిన హక్కుగా వారికి మద్దతునిద్ధాం. 'హీ', 'షీ' సేమ్(అతడు, ఆమె సమానం) అని నినదిద్ధాం.
దైవం ముందు, చట్టం ముందు అందరూ సమానులే అం టుంటారు. కానీ అబద్ధం. సాక్షాత్ ఆ దేవుడే 'ఆమె' ను అపవిత్రం అన్నాడు. ఆమెకు ఆలయంలోకి ప్రవేశం నిరాక రించా డు. దైవంపై నమ్మకం లేని నా బోటి వాళ్లకు చట్టంపై నమ్మకంతో చట్టం ముందు సమానమవుతారేమో అని ఆశగా చూస్తే, నిరాశే ఎదురైంది. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పు కూడా అవమానానికి గురై న్యాయ దేవత తలవంచుకుంది. గత కొన్ని నెలలుగా శబరి మలై ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిత్యం ఏదో రకమైన అలజడలు, నిరసనలు చేస్తూనే ఉన్నాం. ఆలయంలోకి మహిళల ప్రవేశం రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులో భాగమని దేశ అ త్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినా ఈ నిరసనలు ఇంకా ఆగట్లే దు. మహిళలకు ప్రవేశం కల్పించట్లేదు. 'మతం మనుషుల ఆలో చనలు చంపుతుంద'న్న మహానుభావుడి మాటలకు ఆవల 'ఆమె' మతంలోనే తనపట్ల వివక్షతకు, అవమానాలకు కారణాలను ఆ లోచించుకుంటుంది. దైవానికి తాను చేరువకావాలని ప్రయత్ని స్తుంది. కానీ దైవమే 'ఆమె'కు ప్రవేశం నిరాకరించాడని చెబుతు న్నారీ 'అ'భక్కులు.('అ'-అయ్యప్ప). ఇటీవల ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారనే కారణంతో ఆలయం మైలపడిందని, అపవిత్రమైందని 12 గంటలు ఆలయ బందుకు పిలుపునిచ్చింది 'శమరిమల కర్మ సమితి'. బీజేపీ కూడా 2 రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దైవానికి 'ఆమె' 'అటరానిది', 'అపవిత్రమైంది' ఎట్లైంది? 'ఆమె'లో రక్తమే అపవిత్రమా? పురుషుల్లో రక్తం కాదా? నిజానికీ 'రుతుక్రమం' లేకుంటే మానవాళి సృష్టికి మూలమైన తల్లి గర్భం ఎక్కడిది? 'అమ్మ' గర్భం కూడా అపవిత్రమైందేనా? హిందూ ధర్మం ప్రకారం 'స్త్రీ' అత్యంత గౌరవ ప్రదమైందని, పవిత్రమైందని ఊదర గొట్టే ఈ అయ్యవార్లకు శబరిమలైకి వ చ్చే స్త్రీ మాత్రం మలినమైనది, అపవిత్ర మైనదిగా ఎట్లా కనపడింది వారికీ.. 'త ల్లి గర్భం' పవిత్రమైంది అంటారు కదా! మరి ఆ గర్భానికి కారణమైన 'రుతు చక్రం'లో ఉన్న మహిళ ఆలయానికి వ స్తే అపవిత్రం ఎట్లగును. అసలు రుతు క్రమంలో ఉన్న స్త్రీలు శబరిమలకు పో తే ఏమీ జరుగుతుందో, పాపం ఏంటో ఎవ్వరు చెప్పరు. కేవలం మలినమైంది, అపవిత్రమైంది అంటారు. అయినా ఎంతటి అపవిత్రతనైనా శుద్ధి చేసే మహిమలుగల మంత్రాలుండగా, మ హిళలు ప్రవేశిస్తే కలిగే ఇబ్బంది ఏం టీ? ఒకవేళ వారి ప్రవేశం మైలపడేలా చేసిందనుకుంటే మంత్రాలతో శుద్ధి చేసుకోవచ్చు కదా! అయినా మహిళల శబరిమలై ఆలయ ప్రవేశం అయ్యప్పకు కలిగే ఇబ్బందా? లేక కొన్ని రోజులు పాపాలు, పుణ్యాలు, అపచారాలు అనే అంధ విశ్వాసాలతో ప్రజలను మభ్యపెట్టిన ఈ హిందుత్వ వాదుల కుట్రలు భయటపడుతాయని భయమా? ఒకవేళ రుతుచక్రంలో ఉన్న మహిళల ప్రవేశం ఆలయ విశ్వాసాలకు, ఆచారాలకు వ్యతిరేకం అనుకున్నా... మరి దేవుని విశ్వాసాన్ని, ఆయన ప్రత్యక్ష దర్శనాన్ని పొందాలనుకుంటున్న స్త్రీలకు ప్రవేశం లేకపోవటం వారి హక్కులకు, స్త్రీ పురుష సమానత్వానికి అయ్యప్య లేదా హిందూజం వ్యతిరేకమేనని ఒప్పుకోవాలి. మొన్నటికి మొన్న చీరలు కట్టుకుని, స్త్రీ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించ ప్రయత్నం చేసిన హిజ్రాలను కూడా అడ్డుకున్నారు. అంటే... ఇప్పటి దాకా వీరు చెబుతున్న రుతుచక్రం, మైల, అపవిత్రం అన్నవన్ని కట్టుకథలే అని అర్థం చేసుకోవచ్చు. హిజ్రాలకు రుతు చక్రం, నెలసరి జరుగుతుందా? లేదే.. అయినా అడ్డుకున్నారు. ఎందుకు స్త్రీ వేషధారణలో ఉన్నారని. అంటే వారి ఉద్దేశంలో స్త్రీలు అయ్యప్పను దర్శించుకోవద్దు. దీనికి వీరు చెప్పేవన్ని కేవలం సాకులు మాత్రమే.. మొత్తం హిందూ పురాణాల్లో ఇట్లా స్త్రీల స్థాయిని ఏదోరకంగా తగ్గించడమో, త్యాగం, శీలం పేరుతో అవమానాలకు గురి చేయడమో జరుగుతుంది. రుతుచక్రం ఆధారంగానే గర్భవతై, నాకు జన్మనిచ్చిన తల్లి, నాతోపాటే ఎదిగి సహజ శారీరక మార్పులకు లోనైన అక్క, చెల్లి ఆలయ ప్రవేశం కాడ అపవితం ఎట్లైంది? అని ఆలోచిస్తే తెలుస్తది. ఇది దైవం చెప్పింది కాదు. కావాలని స్త్రీని తక్కువగా చూపే ఈ మనువాదుల కుట్రల ఫలితం అని.
రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను కూడా ఈ అభక్తులు పట్టించుకోరు. నిజానికి ఆ లాయరు గారు అన్నట్టు మాట్లాడితే... ఈ దేవుడికి హక్కులుం టాయని అంటే.. ఆ దేవుడు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే. మతప రమైన హక్కు, సమానత్వపు హక్కు పౌరులకు రాజ్యాం గం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో భాగం. దీన్ని అనుసరించి అన్నింటా స్త్రీ లు, పురుషులు సమానం. కానీ అయ్యప్ప మాత్రం సమానం కాదంటున్నాడు. అయ్యప్ప అనుచరులు గుడి లోకి ప్రవేశం నిరాకరిస్తు న్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి నందుకు గాను 'అయ్యప్ప' భక్కులపై కేసులు పెట్టాలి. ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని తీర్పు నిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఆటంకపరిచినందుకు, అవమానపరిచినందుకు వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలి. అయినా ఈ ప్రభుత్వాలు, పాలకులు బలవంతులకు, వారు అనుకున్నవాటికి ఇచ్చే ప్రాధా న్యత బలహీనులకు, వారు అనవసరం అనుకున్నవాటికి ఇవ్వదు. 'ట్రిపుల్ తలాక్' విషయంలో మత విశ్వాసాలకన్నా, మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాజ్యాంగ విలువలను, అత్యు న్నత న్యాయస్థానం తీర్పును గౌరవించాలని ఊదరగొట్టే ఈ నాయకులు శబరిమలై విషయంలో అంతే శ్రద్ధతో మత విశ్వా సాలకంటే, మానవత విలువలకు, రాజ్యాంగ విలువలకు, సుప్రీం తీర్పును గౌరవించి మహిళలకు ఆలయ ప్రవేశం స్వేచ్ఛగా కలిగేలా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. ట్రిపుల్ తలాక్ ద్వారా మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుందని, ముస్లీం పురుషుల చేత (అవమానాలకు) వివక్షతకు గురవుతున్నారని వారి రక్షణ కోసం పట్టుదలతో చట్టం చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులు, అదే శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశానికి ఆలయం మైలపడిందని నిరసన కార్యక్రమాలకు పిలుపున్విడంలో అర్థం ఏమిటి? ఈ ద్వంద్వ వైఖరికి గల కారణాలు ఏమిటి? బీజేపీ పాలకులు చెప్పాలి. అక్కడి విజయన్ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలుపరుస్తామంటే కూడా అభ్యంతరం తెలిపారెందుకు. ఎందుకంటే వారి దృష్టిలో హిందూ మత విశ్వాసాల ప్రకారం మహిళలు అసమానులే అనే భావన ఉంది కాబట్టి. ట్రిపుల్ తలాక్ బిల్లును చట్ట సభల్లో ఆమోదం కోసం ప్రయత్నించడం, శబరిమలై ఆలయంలో మహిళల ప్రవేశానికి నిరసనగా రెండు రోజులు నిరసన కార్యక్రమాలకు బీజేపీ నాయకులు పిలుపునివ్వడం యాధృచ్ఛికంగా జరిగినవే అయినా. హిందూ మహిళల ఆలయ ప్రవేశం పట్ల వారి ఆలోచనలు యాధృచ్ఛికమైనవి కావు.
ప్రజల్లో హేతుబద్ధ ఆలోచనలు, శాస్త్రీయ విలువలను పెంపొందించడానికి ప్రయత్నించాల్సిన నాయకులు ప్రజలను వారిలో గల సెంటిమెంట్లతో, ఆచార వ్యవహారాల పేరుతో రెచ్చగొట్టడం తగదు. శబరిమలై ఆలయంలోకి మహిళ ప్రవేశం కేవలం కేరళ రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు. అది దేశంలోని మహిళలందరి సమస్య. నేడు శబరిమలైకి మహిళలను నిరాకరించినవారు రేపు మన గ్రామంలోని గుళ్ళోకి కూడా మన తల్లినో, చెల్లినో నిరాకరించవచ్చు.
ఆధునిక యుగంలో జీవిస్తున్న మనం మత విశ్వాసాల మలినాల్లో కూరుకుపోతున్నాం. విశ్వాంతరాల్లోకి ప్రయాణిస్తున్న, శోధిస్తున్న మన ఆలోచనలు మత విశ్వాసాల ముసుగులో మసకబారుతున్నాయి. శాస్త్ర సాంకేతికత సాయంతో విశ్వావిర్భావ మూలకాలను వెతికే మన కనులు అంధ విశ్వాసాలతో మూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మనుషులందరూ సమానమే అని ఆధునిక ఆలోచనలతో ముందుకు సాగుతున్న తరుణంలో సహజ శారీరక మార్పులకు కారణంగా చూపి మన అక్కని, చెల్లిని ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడమనేది మన తిరోగమనాన్ని సూచిస్తుంది. సహజ శారీరక మార్పుల ద్వారా కలిగే చర్యలను మైల, ముట్టు, అపవిత్రం అనే భావనలు మాన విద్యలో గల శాస్త్రీయతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అందుకే విద్యలో శాస్త్రీయ ధృక్పథాన్ని, ఆధునిక ఆలోచనలు సమాజంలో కలిగేలా కృషి చేద్ధాం. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడాన్ని ఖండిద్ధాం. మనుషులందరూ సమానమేనని మహిళలకు ఆలయం ప్రవేశం రాజ్యాంగం వారికి కల్పించిన హక్కుగా వారికి మద్దతునిద్ధాం. 'హీ', 'షీ' సేమ్(అతడు, ఆమె సమానం) అని నినదిద్ధాం.
వనపాకల దిలీప్
సెల్: 8464030808
Authorization