శ్రీపతిరావు
కండ్లు తెరవకముందే తెగుతోంది పేగుబంధం. పున్నామరకం నుండి తప్పించువాడు పుత్రుడనే నానుడి దేవరకొండ నియోజకవర్గ ప్రాంతంలో ప్రజలకు నరనరాల్లో జీర్ణించుకుపోయింది. దాని ప్రభావం ఆడపిల్లలపై చూపుతుంది. పుట్టిన ఆడపిల్లలు అంటరాని వస్తువునైట్టుగా వదిలించుకుంటున్నారు. పేదరికానికి నిలువుటద్దంగా కనిపించే గిరిజన ప్రాంతమైన దేవరకొండ పరిసర ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికం. ప్రేమ, పేగుబంధాలు పంచుకుని పుట్టిన ఆడశిశువులకు ఆర్థిక ఇబ్బందులను బూచిగా చూపించి 'ఆడపిల్ల' అనే సాకుతో వదిలించుకుంటున్నారు. వారసుడు కావాలనే ఆశతో ఆడపిల్లలకు అన్యాయం చేస్తూ వివక్ష చూపుతున్నారు. ఎన్ని కాన్పులైనా మగసంతానం కోసం ఎదురుచూడడం చివరికి ఆడపిల్ల జన్మిస్తే వదిలించుకోవడం, విక్రయించుకోవడం, దత్తత పేరుతో ఇతరులకు అప్పగించడం వంటి అటవిక చర్య అక్షరాస్యతలేని గిరిజనుల్లో పెనవేసుకుపోవడం గమనార్హం. ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంబురపడే వాళ్లు. కానీ గిరిజనులు మాత్రం వామ్మో..ఆడపిల్ల ..పాడుపిల్ల అని భయపడుతున్నారు. పేదరికం, అధిక సంతానం, కొడుకు కావాలనే కోరిక, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత పుట్టిన ఆడపిల్లలను వదులుకోవడానికి దారులు వెతుకుతున్నారు. ఆడపిల్లలను అమ్మి వదిలించుకోవడానికి, శిశుగృహానికి అప్పగించడానికి పురిగొల్పుతుంది.
దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా ఆడశిశువుల పట్ల వివక్ష అవలంభిస్తున్న వారిలో చందంపేట, డిండి, దేవరకొండ మండలాల్లో, గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలు, దేవరకొండ ఐసీడీఎస్ పరిధిలో 2008 ఆగస్టు నుండి ఇప్పటివరకు సాకలేమని 253 మంది ఆడశిశువులను తల్లిదండ్రులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మరో 80 మందికి పైగా అమ్మకాలు, మరో 60 మంది ఇతరులకు దత్తత పేరుతో అప్పగించడం వంటివి చోటు చేసుకున్నాయి. వందలాది మంది తల్లిదండ్రులకు ఆడశిశువులను అప్పగించొద్దని, వదిలించుకోవద్దని, అమ్ముకోవడం, దత్తత ఇవ్వడం నేరమని, కుటుంబనియంత్రణ చేయించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొంతమంది తల్లిదండ్రులు తమ శిశువులు ఏడుస్తుండగానే శిశుగృహానికి అప్పగించిన సంఘటనలు వందలాది ఉన్నాయి.
అధిక సంతానం.. ఉపాధి చూపండి
కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, అధిక సంతానం పైగా ఆడపిల్లలు నిరుపేద కుటుంబాన్ని పోషించలేక తన కుటుంబానికి ఉపాధి అవకాశాలు చూపించాలని ఆడపిల్లపై వివక్ష చూపిన సంఘటన దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. దేవరకొండ డివిజన్లోని చందంపేట మండలం మోత్యాతండాకు చెందిన ఆంబోతు రాజు, సావిత్రి దంపతులకు ఈ నెల 8న 9వ కాన్పులో ఆడశిశువుకు జన్మనిచ్చారు. రాజు, సావిత్రి దంపతులకు 2002లో వివాహమైంది. రాజుకు మూడెకరాల భూమి మాత్రమే ఉంది. నీటి వసతిలేక వర్షాధార పంటలపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈదంపతులకు వరుసగా ఐదు కాన్పులలో ఆడపిల్లలు పుట్టారు. ఆరో కాన్పులో కుమారుడు, ఏడవ కాన్పులో ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఒక కుమారుడు రెండు నెలల తర్వాత మరణించాడు. 8వ కాన్పులో మరో మగపిల్లవాడు జన్మించాడు. ఈ నెల 8న 9వ కాన్పులో ఆడశిశువు జన్మించింది. మొదటి కాన్పు నుండి 8 కాన్పుల వరకు ఇంటి వద్దే డెలివరీ అయ్యింది. 9వ కాన్పు మాత్రం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో సీజరింగ్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే సావిత్రి డెలివరీ అయిన అనంతరం రక్తం కావాల్సి ఉండగా రాజు నల్లగొండకు వెళ్లాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు బిడ్డను ఆస్పత్రి సిబ్బందికి అందజేశారు. బిడ్డను వారు శుభ్రం చేసి తల్లి సావిత్రికి అందజేశారు. ఈపని చేసినందుకు తమకు డబ్బులు కావాలని ఆస్పత్రిలో సిబ్బందిలో ఒకరు రాజు అత్తను అడిగారు. తమ వద్ద డబ్బుల్లేవని, పైగా ఆడపిల్ల పుట్టింది. కావాలంటే ఈ పిల్లను తీసుకెళ్లమని చెప్పింది. దీంతో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం చేశారని బాధితుడు రాజు పేర్కొన్నారు.
దత్తత పేరుతో ఇద్దరు శిశువులు
గిరిజనుల అమాయకత్వాన్ని, అధికసంతానాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు దత్తత పేరుతో గిరిజనులను మభ్యపెట్టి ఇద్దరు శిశువులను తీసుకెళ్లిన సంఘటన ఇటీవల చందంపేట మండలంలో చోటుచేసుకుంది. చందంపేట మండలం ఉస్మాన్కుంటకు చెందిన జటావత్ జయ, బద్దూ దంపతులకు చెందిన రెండో సంతానంలో ఆడశిశువును, అదే మండలంలోని మోత్యాతండాకు చెందిన బానోత్ సోన్యా, బాలు దంపతులకు చెందిన ఇద్దరు ఆడశిశువులను విజన్ వాలంటరీ ఆర్గనైజర్ హైదరాబాద్ వారు దత్తత పేరుతో తీసుకెళ్లారు. 2018 నవంబర్ 10న కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఈ నెల 9న ఉస్మాన్కుంట, మోత్యాతండాకు వెళ్లి శిశువులను చూడగా అక్కడ కన్పించకపోవ డంతో తల్లిదండ్రులను ఐసీడీఎస్ అధికారులు ప్రశ్నించారు. దీంతో తాము సాకలేక హైదరాబాద్కు చెందిన రజితకు అప్పగించామని తెలిపారు. ఐసీడీఎస్ అధికారులు ఫోన్ ద్వారా రజితను సంప్రదించగా తాను విజన్ వాలంటరీ ఆర్గనైజర్ పేరుతో రిజిస్ట్రేషన్ ద్వారా దత్తత తీసుకున్నానని భయపెట్టింది. ఐసీడీఎస్ సీడీపీఓ సువర్ణ ఈనెల 10న చందంపేట ఎస్సైకి ఫిర్యాదు చేసింది. శిశువుల రక్షణ కోసం ఐసీడీఎస్ సిబ్బందితోపాటు నల్లగొండలోని ఐసీపీఎస్ రమాదేవి, సీడీపీఓ సువర్ణ, సూపర్వైజరు వెంకటమ్మ శిశువులను తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
సెల్ : 9440424060
తండాల్లో అవగాహన కల్పిస్తున్నాం
శిశువిక్రయాలు, బాల్యవివాహాలు, శిశువులను వది లించుకోవడం వంటి వాటిపై డివిజన్ లోని గ్రామా లు, తండాల్లో అవగాహన కల్పిస్తు న్నాం. ప్రభుత్వ ప థకాలతోపాటు ''మాఇంటి మహాలక్ష్మి'' పథకాన్ని కల ెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రవేశపెట్టడంతో శిశువిక్రయాల సంఖ్య తగ్గి ంది. మాఇంటి మహాలక్ష్మీ పేరుతో రూ.3 లక్ష లు కేటాయించి ఆడశిశువుల తల్లిదండ్రులను గ్రామాల్లోనే సన్మానించడంతోపాటు సత్కరించాం. ఆడపిల్లలు పుట్టిన ఇంట్లో సందడి చేస్తున్నాం. డెలివరీ అయిన ప్రతిశిశువునూ కాపాడేందుకు స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు నిరంతరం పరిశీలిస్తున్నారు.
- సువర్ణ, ఐసీడీఎస్ సీడీపీఓ -దేవరకొండ
కన్నపేగును అమ్ముకునేంత నీచుణ్ని కాదు
నేను కన్నపేగును అమ్ముకునేంత నీచుణ్ని కాదు. కుటుంబ నియంత్రణపై అవగాహన లేక అధికసంతానం కలిగింది. ఉపాధి లేక ఇబ్బందిగా ఉంది. అమ్ముకునే వాడినైతే వరుస గా ఐదు మంది ఆడపిల్లలను ఎలా పెంచుతా. కావాలనే ప్ర చారం చేస్తున్నారు. నా పిల్లను నేనే పెంచుకుంటా. ఉపాధి చూపండి. కాలం లేదు...పంటలు పండడం లేదు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని జంగాల కాలనీకి చెందిన ఓ కుటుంబం వచ్చి ''పెంచుకుంటా నీ బిడ్డను ఇస్తావా?'' అని అడిగారు. వారిని తిట్టి పంపినా. కానీ నాకు సహాయం చేసి పని కల్పించండి. ఇట్లాగైనా అధికారులు పని కల్పిస్తారనే సాకలేనని చెప్పా. కానీ వేరే ఉద్దేశం నాకు లేదు.
అంబోతు రాజు, పసిపాప తండ్రి
Authorization