వంగాల రమేష్
గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా కుల వివక్షతకు వ్యతిరేకంగా ఓ వైపు పోరాటాలు కొనసాగుతున్నా కుల రక్కసి బుసలు కొడుతూనే ఉంది. అయినా వివక్షత ఎక్కడ ఉందంటూ ఎదురు ప్రశ్నించేవాళ్లకు కొదువలేదు. మనుషుల్లోనే కాదు.. విగ్రహాల విషయంలోనూ వివక్షత కొనసాగుతుందనేందుకు సాక్ష్యంగా సంగారెడ్డి జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంబేద్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేయడాలు, కూల్చివేయడాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రిజర్వేషన్లలో ఉద్యోగాలు పొందిన ప్రభుత్వాధికారులూ తమకు సంబంధం లేదనట్టు పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటం శోచనీయం.
జిల్లాలో గతంలో కూడా అంబేద్కర్ విగ్రహాల కూల్చివేత ఘటనలు, దళితులపై దాడులు కొనసాగినా పట్టించుకున్నవారు లేరు. ఎస్సీ అసెంబ్లీ రిజర్వ్ స్థానమైన జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసినా కనిపెట్టేవారే కరువ య్యారు.జిల్లా కేంద్రా నికి చేరువలో అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలు నిరాధారణకు గురై, పగుళ్లుపట్టినా పట్టించుకున్న వారు లేరు. నిమ్న జాతి కులాలకు, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమా నత్వం కోసం కృషి చేయడమే గాక మహిళా సమానత్వానికి కూడా భారతీయ సంస్కృతిలో స్థానం కల్పించాడు అంబేద్కర్. ఆయన విగ్రహాలకే అవమానం జరుగుతుంటే పాలకులు మాత్రం స్పందించడం లేదు.
కొరవడుడుతున్న 'స్ఫూర్తి'...
విగ్రహాలంటేనే వారి జ్ఞాపక చిహ్నాలు మాత్రమే కాదు. వారి సిద్ధాంతాలనూ పంచే స్ఫూర్తి పతాకాలు. కానీ ఆ దిశగా పాలకులు ఆలోచించడం లేదు. కంది మండలంలోని ఎద్దుమైలారంలో 2018 జూన్ 1న అంబేద్కర్, జగ్జీవన్రాం విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులూ హాజరయ్యారు. వారి జయంతులు, వర్ధం తులు, నిర్వహిస్తున్న శాఖల అధికారులు వారి విగ్రహాలు అనుమానాల పాలవుతున్నా అవసాన దశకు చేరుకున్నా పట్టించుకోవడంలేదు. జాతీయ పండుగ రోజుల్లో వారి సిద్ధాంతాలను గొప్పగా వర్ణించే ప్రజాప్రతినిధులకు విగ్రహాలను పునరుద్ధరించాలనే ద్యాసే లేదు. ఈ నెల 8న రాత్రి మొగుడంపల్లి మండలం గుడిపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసి అవమానించిన దుండగులను ఇప్పటి వరకు అధికార యంత్రాంగం గుర్తించలేదు. రూ.3వేల కోట్లతో పటేల్ విగ్రహాన్ని గొప్పగా కట్టించిన ప్రభు త్వాలకు అంబేద్కర్ విగ్రహాలపై మక్కువ కలగడం లేదనే విమర్శలు లేకపోలేదు. మహానీయుల విగ్రహాలపైనా ప్రభుత్వాలు, అధికారులు వివక్షత ప్రదర్శిస్తున్నారనడంలో సందేహం లేదు.
కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
గుడిపల్లిలో జరిగిన ఘటనపై ఇప్పటికీ నిరసనలు కొన సాగుతున్నాయి. ఈ నెల 10న గ్రామంలో బంద్ నిర్వహిం చారు. ఆదివారం కేవీపీఎస్, దళిత సంఘాలు గ్రామాన్ని సందర్శించాయి. ప్రస్తుతం పోలీసులు అక్కడ పికెట్ నిర్వ హిస్తున్నారు. ఇవే కాదు.. గత నెలలోనే పుల్కల్ మం డలం పోతిరెడ్డిపల్లిలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశా రు. దీనిపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఝరాసంగం మండలం జొనగామలో అంబేద్కర్ విగ్రహ దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ ఘటనపైనా అక్కడి ఎస్ఐకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. మనూర్ మండలంలోని బాదల్గాంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్నెళ్ల కింద ధ్వంసం చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్లో, జహీరాబాద్ మండ లం హుగ్గెళ్లిలో కూడా అంబేద్కర్ విగ్రహం దిమ్మెలను ధ్వంసం చేశారు. ఇన్ని సంఘటనలు జరిగినా ఏ ఘటనలోనూ పోలీసులు, యంత్రాంగం నిందితులను అరెస్టు చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సెల్ : 9490099115
ప్రముఖుల విగ్రహాలను రక్షించాలి
దేశం, సమాజం కోసం ప్రాణాలు, జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించు కోవడం, గౌరవించుకోవడం మనందరి బాధ్యత. మనువాదులు జాత్యహంకారంతో మహనీయుల స్మృతులను ధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్ర హాలను ధ్వరసం చేస్తుండటం బాధాకరం. ఇలాంటి దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు, అధి కారులు పట్టించుకోకపోవడం విచారకరం!
- అతిమేల మాణిక్యం
కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా.
Authorization