మోడీ మాత్రమే కాదు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు తమ పేర్లకు ముందు చౌకీదార్ అని పెట్టుకుని దేశానికి తామే కాపలాదారులమని, దేశాన్ని శత్రు మూకలనుంచి తామే రక్షించగలమనీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇందంతా ప్రజల దృష్టిని వారి అసలు సమస్యలనుంచి మళ్లించి, వారిని భావోద్వేగంలో ముంచి ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఇలాంటి శక్తులపట్ల అప్రమత్తంగా లేకుంటే దేశం నష్ట పోతుంది.
మన దేశంలో కులమతాలకు అతీతంగా రాజకీయం చేయడం అసాధ్యంగా మారిపోయింది. ఈ పరిస్థితి మొదటి నుంచీ ఉన్నా ఇటీవలి కాలంలో శృతిమించింది. మరీ ముఖ్యంగా మతతత్వ వాదులు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అన్య మతాలు, కులాలపై విద్వేష భావనలు మితిమీరాయి. రాజకీయాలలో కులం నిర్వహించే పాత్ర వేరు. మతం నిర్వహించే పాత్ర వేరు. కులం విషయంలో అభిమానం అధికంగా ఉంటే, మతం విషయంలో విద్వేషం అధికంగా ఉంటోంది. మా కులస్తులు ఎన్నికల్లో గెలిచి అధికా రంలోకి రావాలని ఆయా కులస్తులు భావిస్తారు తప్ప, ఫలానా కులం అభ్యర్థి ఓడిపోవాలని కోరుకోవడం తక్కువగా ఉంటుంది. తమ కులస్తుడు అధికారంలోకి వస్తే ఒరిగేదేమీ లేకోయినా తామే అధికారంలోకి వచ్చినట్టుగా ఆ కులస్తులు భావించడమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసేటపుడు ప్రతి పార్టీ అధిష్టానమూ తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థుల కులాలకూ ప్రాధా న్యతనిస్తాయి. అభ్యర్థికి కులం బలమైతే, కులానికి జనమే బలం. కావునే, ధనం లేని వ్యక్తికి, జనం లేని కులానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చేందుకు మన రాజకీయ పార్టీలు తటపటాయిస్తాయి. కానీ మతం విషయంలో అలా కాదు. మన మతస్తుని మీద అభిమానం కన్నా ఇతర మతస్తులపై ద్వేషమే అధికంగా ఉంటోంది. ఇది ఎన్నికలలో మరింత అధికంగా ఉంటోంది. సాధారణంగా ఇరువైపులా సాటి మత స్తులే పోటీ చేసినప్పుడు ఇక్కడ మతాభిమానం కులాభిమానంగా మారిపోతుంది. కావునే కులాభిమానాన్ని తట్టుకుని నెగ్గేందుకు మత దురాభిమానాన్ని రెచ్చగొ డుతున్నారు మతతత్వ వాదులు. 1992 బాబ్రీ మసీదును నేలమట్టం చేసినప్ప ట ినుంచీ ఇది మరింతగా పెరిగిపోయింది. శతాబ్ధాల క్రితం ఈ దేశాన్ని ఏలిన ముస్లిం రాజులు, మన దేవాలయాలను ధ్వంసం చేశారని, దేవాలయాలను ఆక్రమి ంచి వాటి స్థానంలో మసీదులు నిర్మించారని ప్రచారం చేస్తూ, వాటి స్థానంలో తిరిగి దేవాలయాలను నిర్మించాలని వీధులకెక్కుతున్నారు. వీరి చర్యలు సహజంగానే ముస్లిం సమాజంలో అ భద్ర తాభావం పెంచు తాయి. ఆ సమాజంలో తీవ్రంగా స్పందించిన కొందరు హింసాత్మక ఘ టనలకు పాల్పడుతారు. ఈ హింసాత్మక ఘటనలను చూపించి హిందువులలో ముస్లిం సమాజంపై ద్వేషం నూరిపోస్తారు. ముస్లింల ఆహారపు అలవాట్లు హిందువులను అవమానపరిచేవిగా, హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆ వర్గం ప్రజలపై దాడులు చేస్తారు. హిందువులు పవిత్రమైన గోవులను తింటున్నారని, కళేబరాలను తరలిస్తున్నారనీ ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులు ఈ కోవలోనివే. ఈ దేశంలో హిందూ మతోన్మాదుల కిరా తకాలకు పరాకాష్ట గుజరాత్ మారణహోమం. ఈ మారణహోమంలో వందలాది మంది ముస్లింలు దారుణంగా హతులయ్యారు. వారి ఆస్తులు ధ్వంసాలకు, ఆక్రమ ణలకూ గురయ్యాయి. ముస్లిం సమాజాన్ని భయకంపితం చేసిన ఆ విధ్వంస కాండపై విచారణ ఇంకా సాగుతూనే ఉంది. ఆ దారుణ మారణహోమం ప్రస్తుత ప్రధాని నరేద్రమోడీ నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందన్న విష యం మనం మరచిపోకూడదు. ఆ మారణ కాండ అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా మొరుగయ్యింది. ఇంకా చెప్పాలంటే మోడీ ఢిల్లీ చేరేందుకు మార్గం ఏర్పడింది. ముస్లింల నుంచి మనకు ప్రమాదం పొంచిఉందనీ, ఈ ప్ర మాదం నుంచి మనం రక్షింపబడాలంటే బీజేపీ, మోడీ లాంటి వారు అధికారంలో ఉండాలనీ ఊదరకొడతారు. మోడీలాంటి వారిని హిందువులను రక్షించే హీరో లుగా ప్రచారం చేస్తారు. ఇక పాకిస్తాన్ ఉండనేఉంది. ముస్లిం ప్రజలు అధికంగా ఉన్న మన అంతర్గత కాశ్మీర్ సమస్యలోకి మతం ఆధారంగా పాకిస్తాన్ ప్రవేశించి ఏర్పాటు వాదులకు అన్నిరకాల అండదండలు అందిస్తూ, దేశాన్ని విభజిం చేందుకు ప్రయత్నిస్తుండడంతో పాకిస్తాన్పై, తద్వారా దేశంలోని మొత్తం ముస్లిం సమా జంపై విద్వేషాన్ని రేకెత్తించడం హిందూ మతోన్మాదులకు సులభమ వుతోంది. ముస్లింలు అధికంగా ఉండబట్టే సుందర కాశ్మీరాన్ని దేశం నుంచి వేరు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనీ, మన దేశ సమగ్రతకు ముస్లింలు బద్ధ శత్రువులుగా మారారనీ ప్రచారం చేస్తూ వారి యెడల మెజారిటీలైన హిందువులలో శత్రుభావం రేకెత్తించడం జరుగు తోంది. పుల్వామా ఘోరకలి తరువాత ఇది తారాస్థాయికి చే రింది. పుల్వామాలో ఆత్మాహు తి దాడి చేసి 42 మంది సైనికు లను పొట్టనపె ట్టుకున్న ఏర్పాటు వాది పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహ్మద్ సంస్థ సభ్యుడు కావడం, ఆ దాడికి తామే బాధ్యు లమని స్వయంగా ఆ సంస్థే ప్రకటించడంతో మ న దేశంలో పార్లమెంటు ఎన్నికల నినాదాలే మారిపోయాయి. రైతు సమస్యలు, ని రుద్యోగం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలాంటి అయిదేండ్ల వైఫల్యాలన్నీ మరుగున పడ ిపోగా ఆ స్థానాన్ని దేశ భత్రద ఆక్రమించేసింది. అప్పటి వరకూ నేను చారువా లాను, పేదల బాధలు నాకు తెలుసు వాటిని నేను తీర్చుతానని చెప్పుకునే మోడీ ఉన్నట్టుండి ఇప్పుడు చౌకీదార్ నరేంద్ర మోడీ
(కాపలాదారుడు) అయిపోయాడు. ఒక్క మోడీ మాత్రమే కాదు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు తమ పేర్లకు ముందు చౌకీదార్ అని పెట్టుకుని దేశానికి తామే కాపలాదారులమని, దేశాన్ని శత్రు మూకలనుంచి తామే రక్షించగలమనీ ప్రచారం చేసుకుంటున్నారు. ఇందంతా ప్రజల దృష్టిని వారి అసలు సమస్యలనుంచి మళ్లించి, వారిని భావోద్వేగంలో ముంచి ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఇలాంటి శక్తులపట్ల అప్రమత్తంగా లేకుంటే దేశం నష్ట పోతుంది. ఈ శక్తులు మళ్లీ అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లో లమవుతుంది. సామరస్యాన్ని బోధించే గొంతులు నొక్కివేయబడి, ప్రశ్నించే గళాలు జైల్లపాలై, మతాలమధ్య మారణహౌమం చెలరేగుతుంది. కావు న, ఈ మతత్వవాద శక్తులను అధికారానికి దూరం చేయడం శాంతిని, అభివృద్ధినీ కోరుకునే ప్రతిఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉంది.
- కోప్ర
సెల్: 6301289321
Authorization