కృష్ణప్రసాద్
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ నిమ్నజాతిలో పుట్టిన ప్రపంచ మేధావి. అతన్ని కేవలం కుల నాయకుడిగానే గాక ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావుల్లో ఒకడిగా గుర్తిస్తుంది సమాజం. కానీ ఆధిపత్య కులాలు ఇంకా అంబేద్కర్ను దళిత నాయకుడిగానే చూస్తున్నాయా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానమిస్తున్నాయి కొన్ని ఘటనలు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా అడ్డుకోవడం, అంబేద్కర్ జయంతిలో చురుకుగా పాల్గొన్నాడనే నెపంతో దాడులు చేయడం, రాత్రికి రాత్రే ఆయన విగ్రహాలను తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడవేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. అంబేద్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేయడం, విగ్రహానికి నలుపు రంగు పూయడం వంటి ఘటనల నుంచి తేరుకోకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో దుస్సం ఘటన జరిగింది. స్థానిక ప్రాదేశిక ఎన్నిక ల్లో పాల్గొనే అభ్యర్థుల ప్రచార డోర్ పోస్టర్ల ను అంబేద్కర్ విగ్రహం మొఖానికి అంటిం చి తీవ్ర అవమానానికి గురి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ప్రభుత్వ పాఠశాలలో 2015వ సంవత్సరంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు జరుపుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో ఆ పాఠశాలలో పరిశుభ్రత లోపించింది. కనీసం అంబేద్కర్ విగ్రహ ప్రదేశమైనా పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ఆ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి లేకుండా పోయింది. ఇటీవల వచ్చిన గాలులకు ఆ పాఠశాలలో ఉన్న చెట్ల కొమ్మలు విరిగి అంబేద్కర్ విగ్రహంపై పడ్డాయి. విరిగిపడిన చెట్ల కొమ్మలు విగ్రహాన్ని మొత్తం కప్పేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. నిజంగా అక్కడికి మనుషులెవ్వరూ వెల్లడం లేదా అంటే ప్రతిరోజు ఆ ప్రాంతంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు తిరుగుతున్నా అంబేద్కర్ విగ్రహం గురించి పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్కు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల డోర్ పోస్టర్లను అంబేద్కర్ విగ్రహం ముఖంపై అంటించి ఆ మహా మేధావిని తీవ్ర అవమానానికి గురి చేశారు. నిజంగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి అక్కడికి ఎవ్వరూ వెళ్లడం లేదంటే ఆ డోర్ పోస్టర్లు ఎలా వచ్చాయని పలువురు ప్రశ్ని స్తున్నారు. కావాలని, అంబేద్క ర్ను అవమానించాలనే ఉద్దే శ్యంతోనే నిర్లక్ష్యం చేశారనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘటనపై గ్రామ దళిత యువకులు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగగా ఆ విషయం తెలిసిన మండల రెవెన్యూ అధికారి సిహెచ్.రమేష్ వారి సిబ్బందిని పంపించి చెట్ల కొమ్మలని, డోర్ పోస్టర్ను తొలగించి విగ్రహాన్ని నీటితో శుభ్రం చేయించారు.
సెల్ : 9441700094
టీఆర్ఎస్, బీజేపీల పాలనలో పెరిగిన దాడులు
రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక అంబేద్కర్ విగ్రహాలపైనా, దళితుల పై దాడులు పెరిగాయి. హైదరాబాద్లో అంబే ద్కర్ విగ్రహం తొలగింపు, జూలూరుపాడులో విగ్రహానికి టీఆర్ఎస్ పోస్టర్ అంటించడం వంటి ఘటనలు భారత రాజ్యాంగ నిర్మాతను తీవ్ర అవమానానికి గురిచేయడమే. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
- మోదుగు ప్రభాకర్, కేవీపీఎస్ నాయకులు
చర్యలు తీసుకుంటాం
పోస్టర్ అంటించిన విషయంపై తహశీల్దార్ను వివరణ కోరగా పాఠశాలకు సెలవులు ఉండటంతో విగ్రహంపై కొమ్మలు ఉన్న విషయం ఆలస్యంగా తెలిసిందన్నారు. అదేవిధంగా అధికారి పరిషత్ ఎన్నికల డోర్ పోస్టర్ అంటించి ఉండటం బాధాకరమైన విషయమన్నారు. అలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించేది లేదని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- సిహెచ్.రమేష్, తహశీల్దార్
Authorization