క్రాంతికుమార్
అభం శుభం తెలియని తొమ్మిది నెలల పసి పాపపై ఓ మానవమృగం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఉన్మాది చేతిలో నరకం అనుభవించిన ఆ చిన్నారి చివరకు ప్రాణాలు కోల్పోయింది. స్థానికులనే కాదు ఈ ఉన్మాదం గురించి విన్నవాళ్లందరూ పసిగుడ్డును తలుచుకుంటూ కంటతడి పెట్టుకున్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ టైలర్స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో యాదగిరి, నిర్మల దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కూతురు రచనను నాలుగేండ్ల కిందట మహబూబాబాద్ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన జంగ య్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి చాలా కాలం తర్వాత శ్రీహిత(9నెల లు) జన్మించింది. పెండ్లయినా చాలా రోజుల తర్వాత పుట్టిన బిడ్డ కావడంతో ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. జంగయ్య, రచన దంపతులు బతు కుదెరువు నిమిత్తం హైదరాబాద్లోని కొత్తపేటలో నివాసముంటున్నారు. వేసవి సెలవులు గడిపేందుకు జంగయ్య భార్య రచనను,కూతురు శ్రీహితను అదివారం సాయంత్రం హన్మకొండలో తోలి వెళ్లాడు. ఇంట్లో ఉక్కపోత కారణంగా రోజువారీ లాగానే మంగళవారం రాత్రి రచన తన కూతురు తోపాటు కుటుంబ సభ్యులందరూ కలిసి డాబాపై పడుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రచన కుటుంబ సభ్యులు శ్రీహితతో ఆడుకుంటూ గడిపారు. ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నారు. అదే కాలనీలో వెనుక గల్లీలో నివసించే పోలెపాక ప్రవీణ్ అనే కామాంధుడు అర్ధరాత్రి సమయంలో వాళ్లు నిద్రిస్తున్న ఇంటి డాబాపైకి అలికిడి కాకుండా ఎక్కాడు. నిద్రలో ఉన్న తొమ్మిదినెలల పసికందును ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి పాపను తీసు కెళ్లి అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దుర్మార్గుడి అరాచకానికి పాప గుక్కపెట్టి ఏడు స్తున్నా నోరు మూసి మరీ లైంగికదాడికి పాల్పడ్డాడు. 1.30 గంటల ప్రాంతంలో మృతురాలి అమ్మమ్మ నిర్మల బాత్రూంకు వెళ్లేందుకు నిద్ర లేచిం ది. పక్కన పడుకున్న పాప కనిపించకపోవడంతో కంగారుపడి కుటుంబసభ్యులను నిద్రలేపింది. అందరూ కలిసి వెతకడం ప్రారంభించారు. పోలీసులకు కూడా సమా చారం ఇచ్చారు. అదే సమయంలో హన్మకొండలోని బొమ్మల వేపచెట్టు వద్ద పోలెపాక ప్రవీణ్ అనే యువకుడు పసిపాపను టవల్లోచుట్టి బుజంపై వేసుకుని వెళ్తుండగా స్థానికులు గమనించారు. స్థానికులను గమనించిన ప్రవీణ్ పాపను అక్కడ విసిరేసి పారిపోయేందుకు యత్నించాడు. స్థానికులు వెంబడించి అతన్ని చితకొట్టారు. అనం తరం పోలీసు లకు అప్పగించారు. చిన్నారిని వెంటనే స్థానిక ప్రయి వేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని బాధిత కుటుంబీకులు, స్థానికులు ఆందోళన నిర్వహించారు.
నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలి
నిందితుడు పోలెపాక ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని పాప బంధువులు, స్థానికులు కుమార్పల్లి నుంచి హన్మకొండ పోలీస్స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి అశోక జంక్షన్లో దాదాపు గంట సేపు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. పోలెపాక ప్రవీణ్ను ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రాస్తారోకో నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నగరంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, శాంతిభద్రతలకు భంగం కలిగించే యువకులను గుర్తించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నగరంలో భారీ భద్రతా చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మృతురాలికి తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేవిధంగా ప్రయత్నిస్తామని పోలీసులు హామీనివ్వడంతో బంధువులు కొంతమేరకు శాంతించారు. నిందితుడు ప్రవీణ్ను అరెస్టు చేసి సెక్షన్ 366, 302, 376ఎ, 376ఏబీ, 379 ఐపీసీ సెక్షన్లతోపాటు 5(ఎం) రెడ్విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. కాగా నిందితుడు ప్రవీణ్ శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందినవాడు. దంపతులు పోలేపాక రాములు, సూరమ్మకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రెండో కుమారుడు ప్రవీణ్. కొంతకాలంగా హన్మకొండలోని ఓ హోటల్లో క్లీనర్గా పనిచేసేవాడు. ప్రవీణ్ నాలుగేండ్ల కిందట గంగిరేనిగూడెం గ్రామానికి చెందిన బేర లక్ష్మి పొలం పనులకు వెళ్లి తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుండగా పుస్తెలతాడు దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బ్లేడ్తో ఆమెను గాయపరిచిన కేసు శాయంపేట స్టేషన్లో నమోదు చేశారు.
సెల్ : 9490099372
Authorization