నేరెళ్ల బాధితుల ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి నేటికీ వినిపించడం లేదు. అక్కడ అన్యాయం జరుగుతుందనీ దేశమంతా వినిపించేలా బాధితులు మొత్తుకున్నా పాలకుల చెవికెక్కడం లేదు. దీంతో నేటికీ అక్కడి బాధితులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అయినా పాలకులు చలించడం లేదు. కేవలం వారు దళితులనే వివక్ష చూపుతున్నారని రాష్ట్రమంతా ఘోషిస్తున్నది.
గతేడాది జూలై 2న ఇసుక లారీ ఢకొీన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు వరుసబెట్టి లారీలను తగలబెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో రెండ్రోజులనంతరం మ ఫ్టీల్లో వచ్చిన పోలీసులు అర్ధరాత్రి ఎ నిమిది మంది గ్రామస్తులను పట్టు కుపోయి చావబాదారు. అసలు అక్క డ వారు చేసిన నేరం ఏమిటి? అక్ర మంగా తరులుతున్న ఇసుక రవాణా ను అరికట్టాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం న్యాయం చేయక పోవగా బాధితులపైనే పోలీసుల ద్వారా థార్డ్ డిగ్రీ ప్రయోగించింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో 'నేరెళ్ల' ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిం దే. ఇప్పటికీ బాధితుల కాళ్లు చచ్చుబ డిపోయాయి. లేవలేని స్థితిలో ఉన్నారు. ఏ పనీ చేయలేక బాధితులు తమను ఆదుకోవాలంటూ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. వారికి ప్రజా సంఘాలు మొదలుకుని విపక్షాలన్నీ అండగా నిలిచాయి. ఘటన జరిగిన 50 రోజులకు దిగొచ్చిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ మెరుగైన వైద్యం చేయిస్తానని, కేసుల్లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఇది గడిచి నేటికి 15 నెలలవుతున్నది. ఆ హామీ అమలు ఊసే లేకుండాపోయింది.
మరోవైపు సమస్య రాజకీయంగా తీవ్రతరం కాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు దిగింది. దీంతో ఎనిమిది మంది బాధితుల్లో ఇద్దరు ప్రభుత్వ పంచన చేరారు. ఆ సమయంలో వారికి భారీ ఎత్తున సొమ్ము ముట్టజెప్పి మెరుగైన వైద్యం అందించారు. ఎటొచ్చీ మిగిలిన ఆరుగురు మాత్రం బాధితులుగానే కొనసాగుతున్నారు. వారు ప్రలోభాలకు లొంగలేదు. ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, అందులో మంత్రి బంధువుల పాత్రను ఎత్తిచూపుతూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. అదే అధికార పార్టీ నేతలకు కంటగింపుగా మారింది.
కొనసాగుతున్న పోరాటం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల బస్టాప్ సమీపంలోనే జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన నిరాహార దీక్ష చేస్తున్నారు. 'అధికార అహంకారంతో దాడిచేయించిన కేటీఆర్. దళితులనే భావనతో న్యాయం చేయని మంత్రికి ఓటడిగే హక్కు లేదని నినదిస్తున్నారు. ఆరుగురు బాధితులకే న్యాయం చేయలేనోడు ప్రజలకేం చేస్తాడు' అంటూ ఫ్లెక్సీల్లో సంధిస్తున్న ప్రశ్నలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీ పెట్టి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నది ఎవరో కాదు... పోలీసు లాఠీ దెబ్బలకు మరణం అంచులవరకూ వెళ్లి జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన నేరెళ్ల బాధితులే. కేటీఆర్ ఓటమే లక్ష్యంగా నేరెళ్ల బాధితులు ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఊరూరా కేటీఆర్ వ్యతిరేక ప్రచారానికి సన్నద్ధం
'పోలీసు దెబ్బలకు చీము, నెత్తురుతో గాయాలు ఇంకా మానలేదు. మెరుగైన వైద్యం అందిస్తామన్న సర్కారు 15 నెలలుగా జాడేలేదు. తమను ఇంకెన్నడు పట్టించుకు ంటారు' అంటూ నేరెళ్ల బాధితులు ప్రశ్నిస్తున్నారు. రిలే ని రాహార దీక్షకు కూర్చున్న వారిని పలకరించగా 'అన్యా యంగా మమ్మల్ని చావబాదారు. ఇప్పటికీ అనారోగ్యం వెంటాడుతోంది. ఏ పనీ చేయలేకపోతున్నాం. స్వయానా మంత్రి హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. దళితులమనే మాపై వివక్ష చూపుతున్నారు. అందుకే నిరాహార దీక్షకు కూర్చున్నాం' అంటూ గోడువెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయమై త్వరలో కాలి నడకన వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. అప్పటికీ స్పందన రానిపక్షంలో ఊరూరా తిరుగుతూ కేటీఆర్ ఓటమే లక్ష్యంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు.
పీఎస్ రవీంద్ర
సెల్ : 9490099395
బాధితులకు రూ.20లక్షలు చెల్లించాలి
15 నెలలుగా నేరెళ్ల బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున చెల్లించాలి. కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి. బాధితుల పక్షాన మేముంటాం. బాధితులను పట్టించుకోని కేటీఆర్ ఓట్లు అడగడానికి అనర్హుడే.
: పంతం రవి, బీఎల్ఎఫ్ రాజన్నసిరిసిల్ల జిల్లా కన్వీనర్
Authorization